అంబ (నాటకం)
Jump to navigation
Jump to search
అంబ అనే పౌరాణిక నాటకాన్ని చిలుకూరి నారాయణరావు (1889 - 1951) వాడుక భాష ప్రాచుర్యం కోసం 1933 ప్రచురించారు.
![](http://upload.wikimedia.org/wikipedia/te/8/84/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B1%81%E0%B0%95%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81.jpg)
తెలుగు సాహిత్య భాషను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రారంభమైన వ్యవహారిక భాషోద్యమానికి ఈ గ్రంథానికి సంబంధం ఉంది. భాషావేత్త, మహా పండితుడు గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషోద్యమానికి లక్షణకర్తగా సిద్ధాంత పరమైన పోరాటం చేస్తూండగా, శ్రీపాద, చిలుకూరి వంటి వారు తమ రచనలు వాడుక భాషలో రచించి బలోపేతం చేశారు. అదే క్రమంలో ఈ నాటకాన్ని వాడుక భాషలో భీష్మ-శిఖండి చరిత్రముగా రచించారు. రచయిత చిలుకూరి నారాయణరావు సంగీతం, పద్యాలు, ఔచిత్యానికి సంబంధం లేని గ్రాంథికాల నుంచి నాటకాలను బయటపడేసి వాడుక భాషలో ఒరవడి పెట్టేందుకు రాశారు. ముందుమాటలో దీన్ని గ్రాంథికంలోకి మార్చి ప్రదర్శించవద్దని నటులు, దర్శకులను విజ్ఞప్తి చేశారాయన.
పాత్రలు
[మార్చు]- అంబ : కథానాయిక
- అంబిక
- అంబాలిక
- కాశీరాజు : అంబాంబికాంబాలికల తండ్రి
- సాళ్వరాజు : అంబ కోసము భీష్మునితో యుద్ధముచేసిన రాజు
- భీష్ముడు : కథానాయకుడు
- పరశురాముడు : భీష్ముని గురువు
- కుబేరుడు
- స్థూలకర్ణుడు : కుబేరుని వనపాలకుడు
- అర్జునుడు
- కృష్ణుడు
- శిఖండి : అంబ పునర్జన్మము పొందినవాడు, ద్రుపదరాజు పుత్రుడు
- దేవదూత
- రెండు పిశాచములు
- పప్పుశాస్త్రి, నేతావధానులు : ఇద్దరు బ్రాహ్మణులు