అక్క పెత్తనం చెల్లెలి కాపురం
అక్క పెత్తనం చెల్లెలి కాపురం | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | కాశీవిశ్వనాథ్ (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | దాసరి నారాయణరావు |
కథ | అగతియన్ |
నిర్మాత | మాగంటి సుధాకర్ |
తారాగణం | రాజేంద్రప్రసాద్ అపర్ణ జయసుధ |
ఛాయాగ్రహణం | ఎం.నరేంద్రకుమార్ |
కూర్పు | బి.కృష్ణం రాజు |
సంగీతం | వాసు రావు |
నిర్మాణ సంస్థలు | శివశక్తి స్టుడియోస్ ప్రై.లిమిటెడ్ ప్రభు పిలిమ్స్ [1] |
విడుదల తేదీ | 1993 |
సినిమా నిడివి | 134 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |

అక్క పెత్తనం చెల్లెలి కాపురం 1993లో విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభు ఫిల్మ్స్ బ్యూనర్ పై మాగంటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు[2][3] రాజేంద్రప్రసాద్, జయసుధ, అపర్ణ ప్రధాన నటీనటులుగా నటించిన ఈ చిత్రానికి వాసురావు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా 1992 తమిళ చిత్రం "పొండట్టి రైయమ్"కు రీమేక్ చిత్రం.[4]
కథ[మార్చు]
సత్యనారాయణ (రాజేంద్ర ప్రసాద్) ఒక యువకుడు. అతబ్య్ అమ్మాజీ (వై.విజయ), బ్రహ్మజీ (కోట శ్రీనివాసరావు) నేతృత్వంలో నడపబడుతున్న ఊరగాయ కర్మాగారంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఒకసారి అతనికి ఒక అందమైన అమాయక అమ్మాయి చిన్ని (అపర్ణ) తో పరిచయం ఏర్పడి, ఇద్దరూ ప్రేమలో పడతారు. చిన్ని పురుషులందరినీ మోసగాళ్ళుగా నమ్మే తన అక్క రంగనాయకి (జయసుధ) చేతిలో కీలుబొమ్మ. ప్రస్తుతం, సత్యనారాయణ వివాహ ప్రతిపాదనతో రంగనాయకి వద్దకు వెళతాడు. ఆమె వారిని జంటగా చేసేందుకు కొన్ని పరీక్షలను చేస్తుంది. వెంటనే రంగనాయకి ప్రతిదానిపై చిన్ని భర్తపై అనుమానాన్ని సృష్టించి "చిన్ని" మనసును పాడుచేస్తుంది. కొన్ని హాస్య సంఘటనల తరువాత సత్యనారాయణ బయటకు బయలుదేరుతాడు. తిరిగి వెళ్ళేటప్పుడు అతను తన చిన్ననాటి ఆత్మీయ స్నేహితుడు రాధా కృష్ణ (విక్రమ్) ను కలుస్తాడు. అతను తన కాబోయే భార్య సోనా (శ్రీకన్య) కి పరిచయం చేస్తాడు. ఎందుకంటే వారు అనాథలుగా ఉన్నారు. ఆ సమయంలో దురదృష్టవశాత్తు సత్యనారాయణను ప్రమాదం నుండి రక్షించేటప్పుడు రాధా కృష్ణ ఒక ప్రమాదంలో మరణిస్తాడు. ఆ సమయానికి సోనా గర్భవతి. ఇప్పుడు సత్యనారాయణ సోనా బాధ్యతను స్వీకరిస్తాడు. కాని భార్య భయంతో అతను ఆమెను తన కంపెనీ గెస్ట్ హౌస్ వద్ద ఉంచుతాడు. అదే సమయంలో చిన్నీ కూడా గర్భవతి అవుతుంది, ఇద్దరూ మగపిల్లలకు జన్మనిస్తారు. ఆ తరువాత నిజం ముందుకు వస్తుంది. చిన్ని సోనా వద్దకు చేరుకుంటుంది. రంగనాయకి రెచ్చగొట్టి గొడవలను సృష్టిస్తుంది. మిగిలిన కథలో సత్యనారాయణ ఈ సమస్యల నుండి బయటపడతాడు, వారి సంబంధం పవిత్రమైనదని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాడు.
తారాగణం[మార్చు]
- రాజేంద్ర ప్రసాద్ - సత్యనారాయణ
- అపర్ణ - చిన్ని
- జయసుధ - రంగనాయకి
- విక్రం - రాధాకృష్ణ
- కోట శ్రీనివాసరావు - బ్రహ్మాజీ
- బాబూమోహన్ - ప్యూన్ సత్యమ్
- సుత్తివేలు
- వల్లభనేని జనార్థన్
- అశోక్ కుమార్
- అనంత్
- మాగంటి సుధాకర్
- రాధా ప్రశాంతి
- చంద్రిక
- శ్రీకన్య
- జయలలిత
- వై.విజయ
సౌండ్ ట్రాక్[మార్చు]
సంగీతాన్ని వాసురావు స్వరపరిచాడు. ఈ పాటలు సుప్రీం సంగీతం కంపెనీ విడుదలచేసింది.[5]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "హే కృష్ణా" | Jaladi | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:33 |
2. | "చెవిలో చెప్పవమ్మా" | భువనచంద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | 4:28 |
3. | "అఖిలా భరతా" | సి.నారాయణరెడ్డి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:52 |
4. | "మేఘమా చూసిపో" | భువనచంద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:56 |
Total length: | 18:49 |
మూలాలు[మార్చు]
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (Overview)". IMDb.
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (Banner)". Chitr.com.[permanent dead link]
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (Direction)". Spicy Onion.
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (1993)".
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-08-03.