Jump to content

అగ్నికులక్షత్రియులు

వికీపీడియా నుండి

అగ్నికుల క్షత్రియులు

[మార్చు]
అగ్ని కుల క్షత్రియులు
వర్గీకరణఇతర వెనుకబడిన తరగతులు (ఆంధ్రప్రదేశ్)
జనాభా గల రాష్ట్రాలుఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ
Reservation (Education)BC - A - 1

అగ్నికులక్షత్రియ అంటే నేటి కాలంలో ఎదో ఒక కులంగా మాత్రమే అందరూ భావిస్తున్నారు కానీ, వాస్తవానికి సృష్టి ఆరంభ కాలం నుంచి అగ్ని నుంచి ఉద్భవించిన బ్రహ్మ క్షత్రియులుగా వర్ణ వ్యవస్థలో కొనసాగుతున్న వీరే నేటి కాలంలో అగ్నికుల క్షత్రియులుగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఏ - 1 విభాగానికి చెందుతారు.[1]

ఒకప్పటి పల్లవ -పాండ్య, చోళ-చాళుక్య, చేర-చోడ, హైహేయ, కాలచూర, రాష్ట్రకూట, యాదవ, కదంబ, వాకాట, శాతవాహన, మౌర్య, ఇక్ష్వాక, శాలంకాయన,విష్ణుకుండిన, బృహత్పలాయన.... తదితర రాజ వంశాలకు చెందిన ఈ అగ్నికుల క్షత్రియులు సూర్యవంశం - చంద్రవంశీయులుగా ఉంటూ తమిళనాడు నందు కంచి & మహాబలిపురం, తంజావూర్, మధురలను కేంద్రంగా చేసుకొని తెలుగు, తమిళ, కన్నడ, ఒరిస్సా ప్రాంతాలను పరిపాలన చేసి ఉన్నారు. అగ్ని వంశానికి రూప ప్రతిరూపాలే సూర్య, చంద్ర వంశాలని నేటి తరం ప్రసిద్ధ ప్రక్షిప్త చరిత్ర పరిశోధకులు వర్మ చింతా పరిశోధనలు పేర్కొంటున్నాయి.

అగ్ని(వహ్ని)కుల క్షత్రియ

వీరి వ్యవహారిక భాష "పాళీ" భాష నందు శాసనములు కూడా ఉన్నవి - దేవ భాష అయిన సంస్కృత భాషకి అధికార భాషగా ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగు భాషను సామాన్యులకు చేరువ చేయడం కోసం మహాభారతం తదితర సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదింప జేశారు. హిందూ మతానికి ప్రాధాన్యతనిచ్చి ఎన్నో వందలాది దేవాలయాలను కట్టించి వాటికి కొన్ని వేల ఎకరములు రాసి ఇచ్చినారు. యుద్ధములలో ఓడిపోవడం వలన గెలిచిన రాజా వంశీయులు ఆ ఆధారాలను చెరిపి వేసినారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్టా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. అగ్నికులక్షత్రియులు తమిళనాడునందు వన్నియర్ (వన్నికుల క్షత్రియులు) భాషా ప్రాదిపదికగా కనిపిస్తారు. ఒకప్పటి ఈ రాజవంశీయులు తురకలతో జరిగిన యుద్దాలలో ఓడిపోయినపుడు శతృ రాజులనుంచి తనను & తన కుటుంబాన్ని - వారసులను రక్షించుట కొరకు తీర ప్రాంతాలకు వచ్చి నౌకా వ్యాపారాన్ని కొనసాగిస్తూ... భారతదేశ ఆర్ధిక ఆలంబనకూ మరియూ నాగరికతా, సంస్కృతిలు పరిఢవిల్లదానికి కృషి చేసారు.

ఈ కులస్తులకు ఆధారములుగా "అగ్నికుల దీపిక, అగ్నికుల ప్రకాశిక, అగ్నికుల ప్రదీపిక, అగ్నివంశ దీపిక, పల్లవ రాజ్ చరిత్ర, అగ్నికుల కుల క్షత్రియ సంగ్రహ చరిత్ర, కులరాజుల పట్టాభిషేకాల చరిత్ర, పల్లికులం బల్లిచోడులు కైఫీయత్ మరియు "అగ్నికుల క్షత్రియుల వంశీయుల పుట్టుపూర్వోత్తరాలు" అనే మొదలైన గ్రంథములు & కొన్ని వందలాది శాసనములు ఆంధ్ర & తమిళనాడు ప్రాంతములలో గతంలో ప్రభుత్వం వారిచే రక్షింపబడినవి. కానీ, నేడు అవి అనూహ్యంగా కనుమరుగు అవుతున్నాయి. [2]

ప్రస్తుత సామజిక పరిస్థితి

[మార్చు]

నేడు అగ్నికులక్షత్రియ కులం యొక్క ప్రాచీన వారసత్వ ఆస్తిని మత్స్యకార ముసుగులో దోచుకుంటున్న వారి కుట్రలకు గురవుతున్న అగ్నికుల క్షత్రియులు, ఎవరికీ వారే విడివిడిగా ఉంటూ విభిన్న రాజకీయ పార్టీ లలో వర్గాలుగా విభజింపబడి ఉండటం వలన అన్ని రంగాలలో వెనకబడిపోయారు - వెనుకకు నెట్టబడుచున్నారు - కలసికట్టుగా ఉండటంలేదు - ఉండనివ్వటంలేదు.

అంతేకాకుండా నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోని కొంతమంది ఇతర కులస్తులు రాజకీయ నాయకుల ప్రాపకంతో... ఈ కులం పేరును మార్చుట కొరకు మరియు ఈ అగ్నికుల క్షత్రియ కులాన్ని కబ్జా చేయడం కోసం రాజ్యాలను పరిపాలించిన పూర్వ వైభవం నకు సంబంధించిన ఆధారాలను రూపుమాపుటకు సహకరిస్తున్నారు.

సమస్యలు

[మార్చు]
  • ప్రపంచ ప్రఖ్యాత చెందిన దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని & కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను నిర్మించి కొన్ని వేల ఎకరములు వారియొక్క ఆస్తులను దూప - దీప - నైవేద్య - భక్తుల ప్రసాదాల కొరకు ఇస్తే ఇప్పుడు ఆ స్థలాలు ఆక్రమణలకు గురై దేవాలయాల మనుగడే కష్టంగా మారింది - ఆధారాలు ఉన్నా ఆక్రమణదారులపై కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలూ కూడా ఎటువంటి చర్యలూ తీసుకోవటం లేదు & కబ్జాలు చేసిన వారు ఉన్న ఆధారాలను చేరిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. [3]
  • కోపనాతి కృష్ణమవర్మ, పెనబోతూ గజేంద్రుడు ఈ ఆలయాల నిర్మించారు. కానీ ఈ దేవాలయాలతో ఎటువంటి సంబందం లేని కులస్తులు ఐన "భీమవరం రాజులు లేక క్షత్రియ" కులస్తులు ధర్మకర్తలుగా ఉన్నారు. ఆలయ ధర్మకర్తలుగా అగ్నికులక్షత్రియులే ఉండాలని కుల సంఘం ఎప్పటినుంచో పోరాటం చేస్తుంది.

ఆచార వ్యవహారాలు

[మార్చు]

అగ్నికులక్షత్రియులకు ఉపనయనము, యజ్ఙోపవీతం ఆచారం ఉంది. వివాహానికి ముందు ఉపనయనం చేసుకుంటారు. వీరి కులస్తులు అందరూ హిందూ మతాన్ని అందులో వైష్ణవాచారమును (నిలువు బొట్టుతో) ఆచరిస్తూ ఉంటారు. వీరు పూర్వము వైష్ణవ బ్రహ్మణులు, వైష్ణవ బ్రహ్మణ కుటుంబములో గల నలుగురు అన్నదమ్ములను జంభు మహర్షి హోమము ద్వారా దేశ రక్షణ కోసం హోమము చేసి నలు దిక్కులా పంపబడినారు కనుక 'అగ్నికుల క్షత్రియులుగా' పేరు వచ్చింది. వీరు 'వైష్ణవ బ్రహ్మణ రాజులు'. భారతదేశంలో గుడులు కట్టి విగ్రహరాదనను ఆచరణలోకి తెచ్చినదే ఈ అగ్నికులక్షత్రియులు.

ప్రముఖులు

[మార్చు]
  • కొపనాతి కృష్ణమ్మ- అంతర్వేది ఆలయ నిర్మాత.
  • మల్లాడిసత్యలింగంనాయకర్ - MSN చారిటీస్ విద్యావేత్త.
  • పినపోతు గజేంద్రుడు - వాడపల్లి ఆలయ నిర్మాత.
  • పెదసింగు లక్ష్మణరావు - కులం మీద మత్స్యకార ముద్రవేసిన నాయకుడు
  • "పల్లవరత్న"(పల్లవ రాజులలో రత్నం లాంటివాడు) & సేవారత్న & దివి మకుటమణి బిరుదాంకితుడు స్వాతంత్రియ సమరయోధుడు ఐన సైకం సూర్యవరప్రసాదరావు గారు - కులాభివృద్దికి తన సొంత ఖర్చులతో కేంద్రం వద్దకు వెళ్లి ఎన్నో పనులను చక్కపెట్టినవారు. తనకున్న పేరుతో కులములోని వారికి 72 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి &149 మందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి.

మూలాలు

[మార్చు]
  1. "National Commission for Backward Classes". www.ncbc.nic.in. Retrieved 2023-05-17.
  2. అగ్ని కుల దీపిక మరియు అగ్నికుల క్షత్రియుల వంశీయుల పుట్టుపూర్వత్రాలు 1 & 2, ప్రభుత్వ ఆధీనములో కొన్ని వందలాది శాసనములు.
  3. "Lakshmi Narasimha Swamy Temple, Antarvedi, Andhra Pradesh". hindupost.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-22. Retrieved 2023-05-17.