అగ్నికులక్షత్రియులు
అగ్ని కుల (Palaekari)క్షత్రియులు | |
---|---|
వర్గీకరణ | ఇతర వెనుకబడిన తరగతులు (ఆంధ్రప్రదేశ్) |
జనాభా గల రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ |
Reservation (Education) | BC-A |
అగ్నికులక్షత్రియ అనే కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వీరూ రాముడి వంశానికి చెందిన వారు. కేవలం ప్రభుత్వం లెక్కల్లో మాత్రమే వీరు బీసీ-ఏ విభాగానికి చెందిన వారు. నిజానికీ రాముడి వారసులు వీరే. వీరి గోత్రం రఘుకుల సూర్య వంశస్థులు చెందిన వారు.[1] నేడు ఆంధ్ర ప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్టా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. వీరు సూర్యవంశానికి చెందినవారు. మరెన్నో దేవాలయాలు అగ్నికుల క్షత్రియులే నిర్మించారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అంతర్వేది, కోనసీమ బాలాజీ ఆలయం వీరే నిర్మించారు.ఈ రెండు ఆలయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినవి.
ప్రస్తుత సామజిక పరిస్థితి[మార్చు]
నేడు అగ్నికులక్షత్రియ కులం నిరక్షరాస్యత,అనైక్యతగా ఎవరికీ వారీగా వుంటూ పార్టీలుగా వర్గాలుగా విడి విడిగా ఉండటం వలన అన్ని రంగాలలో వెనకబడిపోయారు. అధికశాతం కోస్తా తీరా ప్రాంతంలో చేపల పెంపకం, చేతి వృత్తులు చేసుకుంటూ నిరంతరం జీవిత పోరాటం చేస్తున్నారు.
సమస్యలు[మార్చు]
- ప్రపంచ ప్రఖ్యాత చెందిన దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని, కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలని నిర్మించింనది అగ్నికులక్షత్రియ కులస్తులు.[2]
- కోపనాతి కృష్ణమవర్మ, పెనబోతూ గజేంద్రుడు ఈ ఆలయాల నిర్మించారు.కానీ ధర్మకర్తలుగా వేరే కులస్తులు ఉంటున్నారు. ఆలయ ధర్మకర్తల వీరి కులస్తులు ఉండేలా వీరి కుల సంఘం ఎప్పటినుంచో పోరాటం చేస్తుంది.
ఆచార వ్యవహారాలు[మార్చు]
అగ్నికులక్షత్రియులకు ఉపనయనము, యజ్ఙోపవీతం ఆచారం ఉంది. వివాహానికి ముందు ఉపనయనం చేసుకుంటారు. వీరి కులస్తులు ఎక్కువగా హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరికి రఘుకుల గోత్రం ఉంది.
అపోహ[మార్చు]
భారతదేశంలో కులాల విభజనకు, కులవృత్తులను స్థిరపరచడానికి మూలగ్రంథమైన మనుస్మృతి 10అధ్యాయం.48శ్లోకంలో "మత్స్యఘాతో నిషాదానాం" అంటే చేపలు పట్టే వృత్తి నిషాదులది” అని ఉంది. అగ్నికులక్షత్రియ వర్ణంకి మత్స్యకారులకు ఎటువంటి సంబంధం లేదు. సముద్రంలో చేపలుపట్టి అమ్ముకోవడం వీరి ప్రధానవృత్తి అని కొందరు అపోహ పడుతుంటారు కానీ వీరు వ్యవసాయదారులుగా, వడ్రంగులుగా,నౌకా నిర్మాతలుగా, విదేశీ నౌక వాణిజ్య వ్యాపారులుగా ఇలా అనేక వృత్తులలో స్థిర పడ్డారు.అగ్నికుల క్షత్రియులలో కొద్ది మంది మత్స్యకారులు ఉన్నారు. కాని వీరి మత్స్యకార కులానికి చెందినవారు కాదు.
ప్రముఖులు[మార్చు]
- పొన్నమండ లక్ష్మణస్వామివర్మ - అగ్నికులక్షత్రియ జాతిపిత.
- కొపనాతి కృష్ణమ్మవర్మ - అంతర్వేది ఆలయ నిర్మాత.
- మల్లాడిసత్యలింగంనాయకర్ - MSN చారిటీస్ విద్యావేత్త.
- పినపోతు గజేంద్రుడు - వాడపల్లి ఆలయ నిర్మాత.
- లంకాడ ఆదినారాయణ - స్వాతంత్ర్య సమరయోధులు
- పెదసింగు లక్ష్మణరావు - రాజకీయవేత్త
- మోపిదేవి నాగభూషణం-రాజకీయవేత్త
- తిరుమాని సత్యలింగ నాయకర్ - రాజకీయవేత్త
- జుత్తు జగన్నాయకులు - రాజకీయవేత్త
- రక్ష హరికృష్ణ - రాజకీయవేత్త
- మల్లాడికృష్ణారావు - రాజకీయవేత్త.
- మోపిదేవివెంకటరమణ - రాజకీయవేత్త.
- కొల్లురవీంద్ర - రాజకీయవేత్త.
- పొన్నాడ వెంకట సతీష్ - రాజకీయవేత్త.
మూలాలు[మార్చు]
- ↑ "National Commission for Backward Classes". www.ncbc.nic.in. Retrieved 2023-05-17.
- ↑ "Lakshmi Narasimha Swamy Temple, Antarvedi, Andhra Pradesh". hindupost.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-22. Retrieved 2023-05-17.