అచ్యుత్ పట్వర్ధన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అచ్యుత్ పట్వర్ధన్, 5-2-1905 న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో 1905 ఫిబ్రవరి 5 న జన్మించాడు. [1] ఇతను ఆగస్టు ఉద్యమమహానాయకుడు, సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు, రచయిత.తల్లి తండ్రీ వైపు వారంతా సాంప్రదాయ కుటుంబీకులే.తండ్రి గొప్ప ప్లీడర్, మహాదాత .తల్లి వీరమాత .వీరి సంతానమంతా స్వాతంత్ర్యోద్యంలో పాల్గొన్న వాళ్ళే, తల్లి కూడా తన 60వ ఏట ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళింది .అచ్యత్ అన్న రావు చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. సోదరి విజయ 1942 ఉద్యమంలో కాలేజీ మానేసి ఉద్యమంలో చేరి అన్నకు, జయప్రకాష్ నారాయణకు కార్యదర్శిగా పనిచేసింది .ఈ రహస్యోద్యమంలో  ఆమెకు తెలిసిన రహస్యాలు ఇంకెవ్వరికీ తెలియవు .గాంధీ గారి ‘’డు ఆర్ డై’’అనుసరిచి సోదరుడు ,సోదరి పని చేశారు .

విద్య[మార్చు]

అచ్యుత్ మంచి సంగీత గాయకుడు .అన్ని వాయిద్యాలు వాయించేవాడు .చిన్నప్పటినుంచి దేశభక్తి గీతాలు పాడేవాడు .లెక్కలు వచ్చేవికావు . సంపన్న కుటుంబం కనుక ఇల్లు నిత్యాన్నదానాలు అతిధులతో కళకళ లాడేది. బాగా ధనవంతుడైన పినతండ్రికి పిల్లల్లేక అచ్యుత్ ను దత్తత తీసుకొన్నాడు .అచ్యూత్ , రావు అహ్మద్ నగర్ లో మెట్రిక్ పూర్తి చేసి ,బెనారస్ కాశీ విశ్వవిద్యాలయం లో చేరారు .1893 నవంబర్ 16 అనీబిసెంట్ ఇండియారాగా జనం బ్రహ్మ రధం పట్టారు .ఆమె భారత్ నే మాతృభూమిగా భావించి దాస్య విముక్తికి సంకల్పించింది .ఇక్కడే దివ్యజ్ఞాన సమాజం స్థాపించి ప్రపంచమంతా వ్యాపింప జేసింది .మానవ సేవ పరమావధిగా ఉన్న ఆ సమాజం వైపు అచ్యుత్ తండ్రి ఆకర్షితు డయ్యాడు.

ఉద్యోగం[మార్చు]

1898జూన్ 6న లో బీసెంట్,  కొందరుకలిసి  ‘’సెంట్రల్ హిందూ కాలేజి ‘’స్థాపించారు.దీనికి ప్రిన్సిపాల్ గొప్ప విద్యావేత్త  జి ఎస్ అరండేల్ .ఇందులో పని చేసేవారంతా సేవాభావం తో చేసేవారే .ఒకరినిమించి మరొక ప్రజ్ఞా దురీణులు .భగవాన్ దాస్, గోవిందదాస్ , గుర్తు, లాంగ్ వంటి మేదావులున్నారు .కొంతకాలం గడిచాక పండిత మదన మోహన మాలవ్యా దీన్ని తీసుకొని హిందూ విశ్వ విద్యాలయం గా మార్చాడు .ఇక్కడ చదివిన అచ్యుత్ సోదరులు పీకే తెలంగ్ ,జ్ఞాన్ చంద్ ల శిష్యులై వారి అడుగుజాడల్లో నడిచారు .రావు వక్తృత్వం లో దిట్ట ఎన్నో బహుమతులు పొందాడు .ఒకసారి విశ్వ విద్యాలయ పార్లమెంట్ కు  అచ్యుత్ ప్రధానిగా ఉన్నాడు .ఎం.ఎ.పాసై అచ్యుత్  యూరప్ వెళ్లి వచ్చి ఇక్కడే ఆర్ధిక శాస్త్ర లెక్చరర్ గా చేరి పని చేశాడు .

ఉద్యమం[మార్చు]

దేశం లో శాసనోల్లంఘన ఉద్యమం మహాఊపుగా సాగుతోంది .రావు అప్పటికే ఉద్యమంలో చేరి జైలు కెళ్ళాడు .బొంబాయ్ ఉద్యమానికి గొప్ప కేంద్రమైంది .ప్రచారం కోసం ఉమాశ౦కర దీక్షిత్ ఒక రహస్య పత్రిక స్థాపించి నడిపాడు . పట్వర్ధన్ వెంటనే తానూ రహస్య ఉద్యమం లో చేరి  జైలుకెళ్లాడు .ప్రభుత్వ జైళ్ళు అన్నీ సత్యాగ్రహులతో నిండిపోయాయి .ఉద్యమం చల్లబడింది .యువకుల్లో ఉద్రేకం ఉప్పొంగింది .గాంధీ రాజకీయాన్ని సా౦ఘికోద్యమంగా మార్చాడు . రష్యాలో లెనిన్ నాయకత్వం లో సామ్యవాద రాజ్యం స్థాపించటం ఇక్కడి యువకులకు అర్ధమై ,ఇక్కడ ఉద్యమానికి ‘’స్వరాజ్యం ‘’అన్నదానికి నిర్దిస్టరూపం ఇవ్వలేక పోవటం గమనించి తామే నడు౦కట్టాలని యువత భావించింది . సామ్యవాదమే పరిష్కారం అని నిర్ణయించారు .[2]

ఈ సామ్య వాద సిద్ధాంతానికి  నాసిక్ జైలు ప్రధాన కేంద్రమైంది .జయప్రకాష్ ,అచ్యుత పట్వ ర్ధన్, అశోక్ మెహతా, మీనూ మసానీ మొదలైనవారు కలిసి సిద్ధాంత రూప కల్పన చేశారు .1934 మేనెలలో పాట్నా అఖిలభారత కాంగ్రెస్ సమావేశం లో శాసనోల్లంఘన విరమిస్తూ ,శాసన సభా ప్రవేశానికి వీలుకలిగిస్తూ తీర్మానం చేశారు .అప్పుడే జయప్రకాష్ పట్వర్ధన్లు ,ఆచార్య నరేంద్ర దేవ్ అధ్యక్షత న సమావేశమే కాంగ్రెస్ మితవాద మార్గాన్నితీవ్రంగా విమర్శించి , కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించి ,యువకులకు భాగస్వామ్య౦  కల్పించారు .

యువకిశోరం అచ్యుత్  పట్వర్ధన్ పాట్నాలో కాంగ్రెస్ పై నిప్పులు కక్కుతూ రాట్నం –ఖద్దరు తో స్వరాజ్యం రాదనీ ఉపన్యసించాడు .కాంగ్రెస్ నాయకులీ ప్రసంగానికి ఆశ్చర్యపోయారు .1936లక్నో కాంగ్రెస్ కమిటీ సభలో కూడా పట్వర్ధన్ కాంగ్రెస్ ను తీవ్రగా విమర్శించాడు .యువకుల మనోభావం అర్ధం చేసుకొన్న నెహ్రు  నిర్మించిన అఖిలభారత కాంగ్రెస్ కార్యవర్గం లో సామ్యవాద యువకులైన  ముగ్గురు-జయప్రకాష్ ,నరేంద్ర దేవ్ ,పట్వర్ధన్ లకు  అవకాశం కల్పించాడు.మర్యాదగా తిరస్కరించాడు పట్వర్ధన్ .అప్పటికి అతని వయసు 30మాత్రమే .పదవీ వ్యామోహం ఆయనకు లేదన్నదానికి ఇదే నిదర్శనం  .

1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక .ఇండియాను యుద్ధంలోకి ది౦చ వద్దని వాక్ స్వాతంత్ర హక్కు ఇవ్వమని గాంధీ వైస్రాయి లిన్ లిత్ గో తో మాట్లాడి విఫలుడయ్యాడు.రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రివర్గాల చేత రాజీ నామా చేయించాడు గాంధీ .వేరే మార్గం లేక గాంధీ  వైస్రాయియికి లేఖరాసి ,వినోబా భావేతో వ్యష్టి సత్యాగ్రహం ప్రారంభింప జేశాడు .యుద్ధ వ్యతిరేక నినాదాలు చేస్తూ సత్యాగ్రహం లో జనం పాల్గొని జనం స్వచ్చందంగా జైలుకు వెళ్ళారు .వ్యష్టి సత్యాగ్రహం ప్రజాపోరాటం కాజాలదు అని కమ్యూనిస్ట్ లు  భావించినా ప్రపంచామంతావ్యష్టి సత్యాగ్రహం తో  మారు మోగింది .ప్రతిపోరాటం లోనూ ఏదో ఒక సాకుతో కమ్మీలు తప్పించుకోనేవారు .ఉప్పు సత్యాగ్రహాన్నికూడా ‘’ప్రజల పోరాట శక్తి తగ్గించే మత్తు మందు ‘’అని పెదవి విరిచారు .వ్యష్టి సత్యాగ్రహాన్ని ‘’పూలదండల సత్యాగ్రహం ‘’అని హేళన చేశారు ,1942ఆగస్ట్ ఉద్యమాన్ని ‘’ఆగస్టు అల్లర్లు ‘’అనీ జపాన్ ఏజెంట్లు ,పంచమాంగ దళం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యా చర్యలనీ ప్రచారం చేసిన ప్రబుద్ధులు కమ్యూనిస్ట్ లు .ఊరందరిదీ ఒకదారి ఉలిపి కట్టేది మరో దారి అనే సామెత వీరిది .

పట్వర్ధన్ విజ్ఞాన సముద్రుడు .ఆయన ఇంటి లైబ్రరీలో దేశం లో ప్రచురితమైన ప్రతిరాజకీయ పుస్తకం దొరుకుతుంది .ఆయన చదవని రాజకీయ పుస్తకం లేదు .అన్ని విషయాలపై ఉత్తమ గ్రంధాలన్నీ ఆ ఇంట్లో ఉంటాయి .అజ్ఞాతవాసం లో ఉంటూ రైళ్ళరాకపోకల్ని తెలుసుకొంటూ వాటికి ఆటంకం కలిగించేవాడు. రైల్వే అధికారులకు సింహ స్వప్నంగా ఉండేవాడు.ఎంత విప్లవవాది అయినా గాంధీ పేరు చెబితే వినమ్రుడయ్యెవాడు.లోహియాలాగా’’ గాంధియన్ సోషలిస్ట్’’ . తుది నిర్ణయ౦ లో కాంగ్రెస్నే అనుసరిస్తారిద్దరూ .కాంగ్రెస్ ను విప్లవాత్మకం చేసే ప్రయత్నం చేశారు .పోరాటం పెరిగినకొద్దీ అతి వాదం పెరిగి దాన్నే అనుసరించాల్సి వచ్చింది .అతివాద చైతన్యం పెరిగింది .రాజకీయ చైతన్యానికి మహాత్ముడే కారణమని పట్వర్ధన్ ప్రగాఢ విశ్వాసం .అప్పటికి పాతికేళ్ళ క్రితం ‘’స్వరాజ్యం నా జన్మ హక్కు ‘’అన్నందుకు తిలక్ మహాశయుడిని తెల్లప్రభుత్వం ఆరేళ్ళు ఖైదులో ఉంచింది .గాంధీ వల్లనే వాక్ స్వాతంత్రం వచ్చి,’’మా దేశం విడిచిపొండి’’అని ఆజ్ఞాపించగలుగుతున్నాం .స్వతంత్ర వృక్షాన్ని పెంచి పెద్దదాన్ని చేసింది కాంగ్రెస్ .కాంగ్రేసే మహాత్ముడు మహాత్ముడే కాంగ్రెస్ .ఆయన సాధించేది సత్య సామ్రాజ్యం అని అభిప్రాయ పడ్డాడు పట్వర్ధన్ .గాంధీని చూస్తే పూనకమే వస్తుంది ఆరాధనాభావం తో పులకి౦చి పోయేవాడు .పెద్దల మితవాదం మాత్రం నచ్చలేదు కుండబద్దలుకొట్టినట్లుగా నిష్కర్షగా దాన్ని ఖండించాడు .స్వతంత్ర పోరాటం లో గాంధీ మితవాదం అతివాదులకు ఏమీ అడ్డు రాదు అని కాంగ్రెస్ సోషలిస్ట్ ల మనోభావం .అతివాద కార్యక్రమాలు చేబట్టినప్పుడే అతి వాదం వస్తుంది మాటలతో రాదు .దీనికి విరుద్ధంగా ‘’ప్రజా విప్లవమే మార్కిస్ట్ ల పంధా ‘’గా ఉండేది .స్వతంత్ర ఉద్యమలో ఎన్నో తప్పటడుగులు వేశారు కమ్మీలు .ఒక నిర్దుష్ట కార్యక్రమం ఇచ్చి నడపగలిగినవారిలో పట్వర్ధన్ ఒకడు .

1942 స్వతంత్ర భారత రేడియో కేంద్రం గురించి ఉషా మెహతా చెప్పిన విషయాలు –1942‘’ఆగస్ట్ ఉద్యమ కాంగ్రెస్ ఉద్దేశ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని దీన్నినేనూ నా సహచరులు కలిసి  ఏర్పాటు చేశాం  ఆగస్ట్ 20న మొదటి ప్రసారం చేశాం .అప్పుడులోహియా బాంబేలో అజ్ఞాతంలో ఉన్నారు .డిసెంబర్ లో ప్రసారాలు నిలిపేశాం .ప్రచారప్రసారాలు లోహియా రాసేవారు .కొన్ని నేనూ పట్వర్ధన్ రాశాం .వేటిని రేడియోలో చదవటానికి మాజీ ప్రొఫెసర్ కుందస్తూర్ ఉన్నారుకాని ఆమె అరెస్ట్ కాలేదు  .అందుకని గ్రామఫోన్ రికార్డులుగా ప్రసంగాలు తయారు చేసి వాటితో ప్రసారం చేసేవాళ్ళం .కాంగ్రెస్ కమిటీ చేసిన ఉపన్యాసాలు రికార్డ్ చేసి రేడియోలో ప్రసారం చేశాం .మొదట్లో రోజుకొక్కసారి తర్వాత రెండుసార్లు ప్రసారం చేశాం .రేడియో యంత్రాగం బొంబాయిలో ఒక ప్రసిద్ధ న్యాయవాది అల్లుడి ఇంట్లో ఉండేది.పోలీసులు ఆచూకీ చేసి నన్ను అరెస్ట్ చేస్తారని తెలిసి ,ఆరోజు నేనే రేడియో ప్రసారం చేసి చివర్లో వందేమాతరం రికార్డ్  వేస్తుంటే ,పోలీసులువచ్చి నన్ను అరెస్ట్ చేశారు .వాళ్ళు నాలుగుగదులు దాటిరావాలి. తాళాలు పగలకొట్టి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు .’’అని వివరించారు .

ఉషా, ఆసఫాలీ , పట్వర్ధన్ , ఆజాద్ , జయప్రకాష్ వంటి నిస్వార్ధ త్యాగధనులు ‘’స్వాతంత్ర్యం మా జన్మ హక్కు ‘’అని చాటి చెప్పటానికి ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు .1946జూన్ 8న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకులు పట్వర్ధన్ లోహియా జయప్రకాష్ అరుణా ఆసఫాలీ లు ఒక ప్రకటన చేస్తూ ‘’భారత్ లో బ్రిటిష్ పెట్టుబడిదార్లు దొడ్డిదారిన ప్రవేశించారు. వారినుండి మనదేశాన్ని మనం కాపాడుకోవాలి .ఇదే సోషలిస్ట్ పార్టీ ఆదర్శం ‘’.అని చెప్పారు .

రచనలు[మార్చు]

1947లో పట్వర్ధన్ నాయకత్వం లో ‘’సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ‘’స్థాపించారు .1950లో అచ్యుత్ పట్వర్ధన్ రాజకీయాలనుంచి విరమించాడు .మళ్ళీ సెంట్రల్ హిందూకాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేసి 1966లో రిటైరయ్యాడు .తర్వాత పూనాలో ఎవరికీ అందుబాటులో ఉండకుండా, ఉత్తర ప్రత్యుత్తరాలుకూడా జరపకుండా ఒంటరిజీవితం గడిపాడు పట్వర్ధన్ రెండు గ్రంథాలు రాశాడు -1.

మరణం[మార్చు]

ఆగస్టు ఉద్యమమమహానాయకుడు సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు అచ్యుత్ పట్వర్ధన్ 1992 ఆగస్టు 5న 87వ ఏట వారణాసిలో మరణించాడు .త్యాగమూర్తి అచ్యుత్ పట్వర్ధన్ .

మూలాలు[మార్చు]

  1. https://ia601602.us.archive.org/13/items/in.ernet.dli.2015.371318/2015.371318.Achyuta-Patvardhan.pdf
  2. Patwardhan, Achyut (1971). Ideologies and the Perspective of Social Change in India (in ఇంగ్లీష్). University of Bombay.

వెలుపలి లంకెలు[మార్చు]