Coordinates: 31°36′17″N 74°34′23″E / 31.60464°N 74.57310°E / 31.60464; 74.57310

అటారీ-వాఘా సరిహద్దు వేడుక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అటారీ-వాఘా సరిహద్దు వేడుక
వాఘా సరిహద్దు పాకిస్తాన్ వైపు
ఈ వేడుక అటారీ-భారతదేశం, వాఘా-పాకిస్తాన్ మధ్య సరిహద్దులో జరుగుతుంది [1]
ప్రక్రియసైనిక ప్రదర్శన
తేదీలుప్రతి రోజు
ప్రదేశంఇండియా-పాకిస్తాన్ బార్డర్
అక్షాంశ రేఖాంశాలు31°36′17″N 74°34′23″E / 31.60464°N 74.57310°E / 31.60464; 74.57310
క్రియాశీల సంవత్సరాలు1959 (65 సంవత్సరాల క్రితం) (1959) నుండి
స్థాపించినదిసరిహద్దు భద్రతా దళం, పాకిస్తాన్ రేంజర్లు

అటారీ-వాఘా సరిహద్దులో 'ఫ్లాగ్-ఆఫ్' వేడుక లేదా జెండా ఉపసంహరణ వేడుక అనేది ప్రతిరోజు జరుగుతుంది. ఇది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) ఆచారం, దీనిని భారతదేశ (సరిహద్దు భద్రతా దళం), పాకిస్తాన్ ( పాకిస్తాన్ రేంజర్స్) భద్రతా దళాలు 1959 నుండి సంయుక్తంగా అనుసరిస్తున్నాయి.[2] ఇది రెండు దేశాల సైనికుల మధ్య సద్భావనను పెంపొందించడానికి ప్రారంభించబడింది, ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఫజిల్కా సమీపంలోని మహావీర్/సాద్కీ సరిహద్దులో, ఫిరోజ్‌పూర్ సమీపంలోని హుస్సేనివాలా/ గండా సింగ్ వాలా సరిహద్దులో ఇలాంటి కవాతులు నిర్వహించబడతాయి.

వేడుక[మార్చు]

వేడుక ప్రారంభానికి 20 నిమిషాల ముందు లౌడ్ స్పీకర్ ద్వారా "హిందుస్థాన్ జిందాబాద్..", "సారే జహాసే అచ్చా...హిందుస్థాన్ హమారా.." వంటి దేశభక్తి నినాదాలు వెలువడతాయి. అప్పుడు పాకిస్తాన్ వైపు నుండి "పాకిస్తాన్ జిందాబాద్" వంటి నినాదాలు వెలువడతాయి. దీని తరువాత ఇద్దరు సైనికులు దూరం నుండి చురుకైన అడుగులతో కవాతు చేసి గేటు దగ్గర నిలబడతారు. పైభాగానికి తాకేలా పాదాలను పైకెత్తి నేలపై బలంగా కొట్టి పై అధికారుల నుంచి సెల్యూట్ తీసుకుంటారు. పాకిస్తాన్ కూడా అదే పరేడ్‌లను పునరావృతం చేస్తుంది. అప్పుడు గేటు తెరుచుకుంటుంది. పాకిస్తాన్, భారతదేశ ప్రజలు ఒకరినొకరు చూసుకుంటారు రెండు జెండాలు ఒక బగల్ తోడుగా ఒకేసారి దించబడతాయి. జెండా స్తంభానికి ఎదురుగా జెండాలు దించుతారు. వాటిని భద్రంగా మడతపెట్టి, గౌరవప్రదంగా వారి సంబంధిత భవనాలకు తీసుకెళ్లి గేట్లు మూసివేయడంతో వేడుక ముగుస్తుంది.[3]

2014 ఆత్మాహుతి దాడి[మార్చు]

2 నవంబర్ 2014న, అటారీ-వాఘా సరిహద్దులో పాకిస్తాన్ వైపున జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 60 మంది మరణించారు, కనీసం 110 మంది పైగా గాయపడ్డారు. అటారీ-వాఘా సరిహద్దు వేడుక ముగిసిన వెంటనే, 18-20 సంవత్సరాల వయస్సు గల యువకుడు తన చొక్కాలో 5 కిలోల పేలుడు పదార్థాలను పెట్టుకొని, క్రాసింగ్ నుండి 500 మీటర్ల దూరంలో పేల్చాడు.[4][5]

2016 ఉద్రిక్తతలు[మార్చు]

29 సెప్టెంబర్ 2016న, భారతదేశం-పాకిస్తాన్ సైనిక వివాదం కారణంగా వేడుక రద్దు చేయబడింది. అశాంతి కారణంగా, భారత సరిహద్దు భద్రతా దళం కూడా కొవ్వొత్తులను వెలిగించడం, పండుగలకు శుభాకాంక్షలను చెప్పడం నిలిపివేసింది.[6][7]

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Mixed feelings on India-Pakistan border". BBC News. 14 August 2007.
  2. Khaleeli, Homa (1 November 2010). "Goodbye to the ceremony of silly walks between India and Pakistan". The Guardian. Retrieved 14 November 2011.
  3. Frank Jacobs (3 July 2012). "Peacocks at Sunset". Opinionator: Borderlines. The New York Times. Retrieved 15 July 2012.
  4. "Pakistan blast 'kills 45' at Wagah border with India". BBC News. 2 November 2014. Retrieved 2 November 2014.
  5. Kassim, Aliza (3 November 2014). "Suicide bomber kills dozens at Pakistan border parade, police say". CNN World. CNN. Archived from the original on 10 June 2021. Retrieved 30 September 2022. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 26 ఫిబ్రవరి 2021 suggested (help)
  6. "Attari-Wagah post echoes with patriotic chants again". hindustantimes. 9 October 2016. Retrieved 6 November 2016.
  7. "BSF refuses to exchange Diwali sweets at Wagah as Indo-Pak tension increases". The Economic Times. 30 October 2016. Archived from the original on 27 December 2016. Retrieved 6 November 2016.