అబలా బోస్

వికీపీడియా నుండి
(అబాలా బోస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అబలా బోస్
జననం8 ఆగష్టు 1865
మరణం1951 ఏప్రిల్ 25(1951-04-25) (వయసు 87)
వృత్తిసమాజసేవ
జీవిత భాగస్వామిజగదీశ్ చంద్రబోస్

లేడీ అబలా బోస్ ( Bengali: অবলা বসু అబోలా బోషు ) (8 ఆగస్టు 1865 - 1951 ఏప్రిల్ 25) ఒక భారతీయ సామాజిక కార్యకర్త. మహిళల విద్యలో ఆమె చేసిన ప్రయత్నాలు, వితంతువులకు సహాయం చేయడంలో ఆమె చేసిన కృషికి ఆమె ప్రసిద్ధి చెందింది.

జీవితం తొలి దశలో[మార్చు]

అబలా దాస్ గా జన్మించిన ఈమె, బ్రహ్మసమాజ సంస్కర్త దుర్గా మోహన్ దాస్ కుమార్తె. సతీష్ రంజన్ దాస్, సరళా రాయ్ ల సోదరి. ఆమె స్వాతంత్ర్య ఉద్యమకారుడైన చిత్తరంజన్ దాస్, భారత ప్రధాన న్యాయమూర్తి సుధి రంజన్ దాస్ ల పినతండ్రి కుమార్తె. ఆమె 1864 ఏప్రిల్ 8 న బొరిషాల్‌లో జన్మించింది. ఆమె ఢాకా లోని టెలీబాగ్ దాస్ కుటుంబానికి చెందినది. ఆమె 1887 లో వృక్ష శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్‌ను వివాహం చేసుకుంది. భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించిన తొలి మహిళలలో అబలా దాస్ ఒకరు.

ఆమె బంగ మహిళా విద్యాలయ ప్రారంభ విద్యార్థిని. 1876లో ఈ పాఠశాల, బెథూన్ పాఠశాలలో విలీనమైంది. ఆమె 1881 లో ఉపకార ప్రవేశం పొందింది. ఒక మహిళగా, ఆమె కలకత్తా వైద్య కళాశాలలో ప్రవేశం పొందలేకపోయింది. ఆమె 1882 లో మద్రాసు (ఇప్పుడు చెన్నై) కు బెంగాల్ ప్రభుత్వ ఉపకారవేతనంలో వైద్యవిద్య అధ్యయనం కోసం వెళ్ళింది. ఆమె తుది పరీక్షలు రాసింది కాని ఫలితం ప్రకటించక ముందే అనారోగ్యం కారణంగా తిరిగి రావలసి వచ్చింది. ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది కానీ ఆమె విజయం గురించి ఎప్పుడూ తెలుసుకోలేదు.

కెరీర్[మార్చు]

విద్యావేత్తగా పనిచేయడమే కాకుండా, బోస్ తొలితరానికి చెందిన స్త్రీవాది . మోడరన్ రివ్యూ అనే ఆంగ్ల పత్రికలో వ్రాస్తూ, మహిళలు మెరుగైన విద్యను పొందాలని వాదించింది.[1] తనతో పాటు బెథూన్ పాఠశాలలో కలిసి చదువుకున్న కామిని రాయ్, అబలా బోస్ చే ప్రభావితురాలై స్త్రీవాది అయ్యింది. 1916 లో తన భర్త జగదీశ్ చంద్ర బోస్, సర్ బిరుదు పొందిన తర్వాత కాలంలో, ఆమె లేడీ బోస్ గా ప్రసిద్ధి చెందింది.

మాయావతిలో సిస్టర్ నివేదా, సిస్టర్ క్రిస్టిన్, షార్లెట్ సెవియర్, లేడీ అబలా బోస్

1919 లో బోస్, నారి శిక్షా సమితి అనే సామాజిక సేవా సంస్థను స్థాపించింది. పిల్లలు, బాలికలు, మహిళలకు విద్యనందించడమే ఈ సంస్థ యొక్క లక్ష్యం. ఆ కాలంలో, బాల్యవివాహాల కారణంగా, బాల్యంలోనే వితంతువులు కావటం సాధారణం. విద్య లేకపోవడం, మగ కుటుంబ సభ్యులపై ఆర్థికంగా, సామాజికంగా ఆధారపడటం మూలంగా, మహిళలు సమాజంలో అట్టడుగు స్థాయికి చేరుకున్నారు. వరకట్నం తదితర సామాజిక ఒత్తిళ్లు, చాలా మంది మహిళల జీవితాలను దుర్భరంగా చేశాయి. రాజా రామ్మోహన్ రాయ్, పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సిస్టర్ నివేదిత వంటి సంఘసంస్కర్తల ప్రభావంతో మహిళా సమస్యలపై కొత్త అవగాహన ఏర్పడింది.

తన జీవితకాలంలో, బోస్ బెంగాల్ లోని వివిధ ప్రాంతాలలో సుమారు 88 ప్రాథమిక పాఠశాలలను, 14 వయోజన విద్యా కేంద్రాలను స్థాపించింది. కోల్‌కతా, జార్గ్రామ్‌లోని మహిళా శిల్పా భవన్ వంటి కేంద్రాలను స్థాపించడానికి బోస్ మార్గదర్శకుడు. ఇది బాధిత మహిళలకు, ముఖ్యంగా వితంతువులకు వృత్తిపరమైన శిక్షణను అందించి, జీవనోపాధిని కల్పించింది.

భారతదేశంలో సంస్థాగత పూర్వ ప్రాథమిక, ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసిన వారిలో ఆమె మొదటిది. దీని కోసం ఆమె 1925 లో విద్యాసాగర్ బని భవన్ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణా సంస్థను స్థాపించింది. 294/3 APC రోడ్ వద్ద కొంత భూమిని నారీ శిక్షా సమితి కార్యకలాపాల కోసం, అప్పటి కలకత్తా కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ విరాళంగా ఇచ్చారు.

తరువాత జీవితం[మార్చు]

తన భర్త మరణం తరువాత, బోస్ వయోజనుల ప్రాథమిక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సిస్టర్ నివేదా మహిళా విద్యా నిధిని ఏర్పాటు చేయడానికి 10,000,000 డాలర్లు (2015 డాలర్లలో 200,000 డాలర్లు) విరాళంగా ఇచ్చింది.

బోస్ 1910 నుండి 1936 వరకు బ్రహ్మసమాజ బాలికా శిక్షణ కార్యదర్శిగా పనిచేసింది. ఆమె 1951 ఏప్రిల్ 26 న మరణించింది.

మూలాలు[మార్చు]

  1. Ray, Bharati (1990). "Women in Calcutta: the Years of Change". In Chaudhuri, Sukanta (ed.). Calcutta: The Living City. Vol. II. Oxford University Press. p. 36. ISBN 978-0-19-563697-0.

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అబలా_బోస్&oldid=3826482" నుండి వెలికితీశారు