అరసానపల్లి వేంకటాధ్వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రముఖ శ్రీ రాఘవ యాదవీయం అనే సంస్కృత ప్రఖ్యాత విలోమ కావ్య గ్రంథ కర్త. ఈ కావ్య రచయిత వేంకటాధ్వరి కాంచీ నగరవాసి. రామానుజ సంప్రదాయానికి చెందిన గొప్ప దార్శనిక పండితుడు. ఆయన వ్రాసిన శ్రీ రాఘవ యాదవీయం సంస్కృతంలో 30 శ్లోకాలుగా రాశారు. ఇందులోని శ్లోకాన్ని ముందు నుంచి చదివితే రామాయణ కథ, వెనుక నుంచి చదివితే పారాజాతాపహరణ కథ కావడం ఆయన పాండితీ ప్రకర్షకు నికషోపలం. వారే పదచ్ఛేదం కూడా ఇచ్చారు.

వేంకటద్వారి విశ్వగుణదర్శనం అనే ప్రసిద్ధ చంపూ గ్రంథాన్ని రచించారు. హస్తిగిరి చంపూ, లక్ష్మీ సహస్త్రం, యాదవ పాండవీయం, సుభాషితకౌస్తుభ వంటి పుస్తకాలను కూడా రచించారు. ఇతను రఘునాథ్ దీక్షిత్ కుమారుడు. అతని తల్లి సీతాంబ. ఇతను నీలకంఠ దీక్షితులు సమకాలీనుడు. అందుచేత ఇతడు కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినవాడని నిర్ధారణ అయింది. వేంకటధ్వరి శ్రీ వైష్ణవ దృక్పథాన్ని అనుసరించేవారు. విశ్వగుణ దర్శనంలో స్వతంత్ర కల్పన యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఈ పుస్తకంలో ఇద్దరు గంధర్వులు, కుశానుడు, విశ్వవసు అనే ఇరువురి విశ్వం యొక్క విశేషగుణాలను వివరిస్తారు. విమానంలో దేశమంతా తిరుగుతూ దేశాన్ని, నగరాలను, నదులను, పవిత్ర స్థలాలను, ప్రజల ప్రవర్తనను వివరించారు. ఈ పుస్తకంలో చరణాలు, ఇతర భాగాలు లేవు. ఒక్కో విషయం ఒక్కో విభాగంగా విభజించబడింది. ఇందులో ఎక్కువ భాగం పద్య విభాగంలో ఉంది. నుసరించడానికి కథ లేనప్పటికీ, ఆహ్లాదకరమైన వ్యక్తీకరణ మనస్సును ఆహ్లాదపరుస్తుంది.

మూలములు[మార్చు]

వెంకటాద్వరి సంస్కృత వికి.