అలుగుబెల్లి నర్సిరెడ్డి
అలుగుబెల్లి నర్సిరెడ్డి | |||
![]()
| |||
పదవీ కాలం 2019 మార్చి 30 - 2025 మార్చి 29 | |||
ముందు | పూల రవీందర్ | ||
---|---|---|---|
తరువాత | పింగిలి శ్రీపాల్ రెడ్డి | ||
నియోజకవర్గం | నల్లగొండ – ఖమ్మం – వరంగల్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చెర్లగూడ, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా | 1960 ఆగస్టు 25||
రాజకీయ పార్టీ | యూటీఎఫ్ | ||
తల్లిదండ్రులు | నారాయణరెడ్డి, భాగ్యమ్మ | ||
జీవిత భాగస్వామి | నాగమణి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
నివాసం | పెద్ద అంబర్పేట్, హయాత్నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా |
అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, నల్లగొండ – ఖమ్మం – వరంగల్ జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యుడు.[1][2] ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు.
జీవిత విషయాలు
[మార్చు]నర్సిరెడ్డి 1960, ఆగస్టు 25న అలుగుబెల్లి నారాయణరెడ్డి, భాగ్యమ్మ[3] దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని చెర్లగూడలో జన్మించాడు.[4] ఎంఏ, బిఎడ్ పూర్తిచేసిన నర్సిరెడ్డి ఉపధ్యాయ వృత్తిని చేపట్టి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]నర్సిరెడ్డికి నాగమణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
రాజకీయ విశేషాలు
[మార్చు]నర్సిరెడ్డి 2019లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి యూటీఎఫ్ అభ్యర్థిగా పోటీచేసి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 8,976 ఓట్లు రాగా, రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం 9,021 ఓట్లతో గెలుపొందాడు.[6][7][8] 2019 ఎన్నికల్లో మొత్తంగా 18,885 ఓట్లు పోలయ్యాయి. వీటిలో చెల్లని ఓట్లు పోగా 18,027 ఓట్లు లెక్కించారు. వీటిలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8,976ఓట్లు పోలవ్వగా, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్కు 6,279 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డికి మరో 38 ఓట్లు తక్కువ పడటంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో నర్సిరెడ్డి 9,021 ఓట్లు, పూల రవీందర్కు 6,292ఓట్లు పోలయ్యాయి. దీంతో 2,729ఓట్ల ఆధిక్యతతో నర్సిరెడ్డి విజయం సాధించాడు.
నర్సిరెడ్డి 2025లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి యూటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "శాసన మండలికి కొత్త సభ్యుల ఎన్నిక | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2021-08-04.
- ↑ "MLC Results 2019: Narsi Reddy elected to Telangana council; Raghu Varma wins from North Andhra Teachers' seat". Times Now. 26 March 2019. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
- ↑ "ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి మాతృవియోగం". Andhrajyothy. 27 December 2024. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.
- ↑ "Alugubelli Narsi Reddy | MLC | Nalgonda | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-30. Retrieved 2021-08-04.
- ↑ తెలంగాణ శాసనమండలి, ఎమ్మెల్సీలు (4 August 2021). "Members Information - Telangana-Legislature". telanganalegislature.org.in. Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ "Narsi Reddy elected to council, defeats sitting MLC". Business Standard. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
- ↑ https://telanganatoday.com/utf-candidate-wins-warangal-khammam-nalgonda-teachers-constituency/amp
- ↑ "UTF candidate wins Warangal-Khammam-Nalgonda Teachers' constituency". archive.telanganatoday.com. Retrieved 2021-08-04.[permanent dead link]
- ↑ "టీచర్స్ ఎమ్మెల్సీగా శ్రీపాల్". NT News. 4 March 2025. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.