అహమ్మద్ మహమ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అహమ్మద్‌ మహమ్మద్‌ సామాజిక రుగ్మతలను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడగల సాహిత్యాన్ని అందించే సాహితీకారుడు.

బాల్యము[మార్చు]

అహమ్మద్‌ మహమ్మద్‌ మెదక్ జిల్లా మెదక్‌లో 1962 డిసెంబర్ 25న జన్మించారు. వీరి తల్లితండ్రులు... యాకూబీ, మహమ్మద్‌ మూసా. చదువు: ఎం.ఎ., బి.ఇడి. ఉద్యోగం ఉపాధ్యాయులు.

రచనా వ్యాసంగము[మార్చు]

ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి ప్రేరణతో 1984లో సాహిత్యరంగ ప్రవేశం చేశారు. 1986 'మౌనం' కవిత ప్రచురితం. అప్పటినుండి వివిధ పత్రికలు, కవితా సంకలనాలలో పలు కవితలు, కథానికలు ప్రచురితం అయ్యాయి. ప్రచురణలు: పానాది (కవితా సంపుటి, 2008). ఇతని లక్ష్యం: సామాజిక రుగ్మతలను విమర్స నాత్మకంగా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడగల సాహిత్యాన్ని వ్రాశారు.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 41