ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌
నినాదం సర్వే భవంతు సుఖినా
అందరు సంతోషంగా ఉండాలి
Agency overview
Formed 2005, ఆగస్టు 12
Legal personality Governmental: Government agency
Jurisdictional structure
Federal agency [[ భారతదేశం]]
General nature
Operational structure
Headquarters కర్నూల్ \ నాంపల్లి, హైదరాబాద్
Agency executive జస్టిస్ ఎం.సీతారామమూర్తి, ఛైర్మన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ జాతీయ మానవ హక్కుల చట్టం, 1993 ప్రకారం 2005, ఆగస్టు 11న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 2005, ఆగస్టు 12 న ఏర్పాటైంది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 జాతీయ మానవ హక్కుల కమిషన్‌నే కాక రాష్ట్రస్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ని ఏర్పర్చింది.[1]

నియామకం, పదవీ కాలం[మార్చు]

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. కమిషన్ ఛైర్మన్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని గవర్నర్ నియమిస్తారు. ఒక సభ్యుడు హైకోర్టులో పదవిలో ఉన్న లేదా హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి కానీ కనీసం 7 సంవత్సరాలు జిల్లా న్యాయమూర్తిగా చేసిన అనుభవం ఉండాలి. మరో సభ్యుడు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 70 ఏళ్లు వచ్చే వరకు ఉంటుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను గవర్నర్‌ నియమిస్తాడు. వీరిని తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికి మాత్రమే ఉంది.

ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పడే ఆరుగురు సభ్యుల అత్యున్నత అధికార కమిటీ వీరి నియామకంలో గవర్నర్‌కు సలహాలిస్తుంది. రాష్ట్రంలో శాసనమండలి ఉన్నట్లయితే శాసనమండలి ఛైర్మన్, ప్రతిపక్ష నాయకులను ఈ కమిటీలో ఉంటారు

  1. . రాష్ట్ర ముఖ్యమంత్రి (కమిటీకి ఛైర్మన్‌)
  2. . రాష్ట్ర శాసనసభ స్పీకర్‌
  3. . రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
  4. . రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు
  5. . శాసన మండలి చైర్మన్‌
  6. . రాష్ట్ర హోం శాఖ మంత్రి

విధులు[మార్చు]

  • మానవ హక్కుల ఉల్లంఘన జరిగే విచారణను చేపడు తుంది.
  • ప్రభుత్వ నిర్వహణలోని సంస్థలను, జైళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం
  • మానవ హక్కులకు భంగం జరుగుతున్న కేసుల విచారణ న్యాయస్థానంలో వాయిదా పడినపుడు జోక్యం చేసువడం
  • మానవ హక్కుల గురించి ప్రజల మధ్య ప్రచారం చేయడం, ఆ హక్కులకు గల రక్షణల గురించి వారికి అవగాహన కలిగించడం
  • రాష్ట్రంలో మానవ హక్కుల కాపలాదారుగా కమిషన్‌ వ్యవహరిస్తుంది. మానవ హక్కులను పెంపొందించడంలో అవసరమైన ఇతర చర్యలను చేపట్టడం.
  • మానవహక్కుల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను, శాసన సభల చట్టాలను సమీక్షించి వాటిని ప్రభావవంతంగా అమలుచేయడానికి సూచనలివ్వడం

అధికారాలు[మార్చు]

1.సివిల్ కోర్టుకున్న అధికారాలు ఉంటాయి.

    • ఎ) అఫిడవిట్లు, సాక్ష్యాధారాలు సేకరించడానికి.
    • బి) న్యాయస్థానం, ప్రభుత్వకార్యాలయం నుంచి అవసరమైన సమాచారం పొందడానికి..
    • సి) సాక్ష్యాలను విచారించడానికి, అధికార ప్రతులు పరిశీలించడానికి..

2.కమిషన్ తాను దర్యాప్తు చేస్తున్న కేసును మెజిస్ట్రేట్‌కు పంపడానికి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కేసును బదిలీ చేయడానికి అధికారం ఉంటుంది.

3.విచారణ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవచ్చు. ఆ సమయంలో ఆయా ఉద్యోగులు కమిషన్ పరిధిలో పని చేస్తారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌లు[మార్చు]

  1. జస్టిస్‌ బి. సుభాషణ్ రెడ్డి (2005 - 2010)
  2. జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్‌ ఖక్రు (2011 - 2016)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హెచ్ఆర్సీ ఛైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి 2021 మార్చి 18న నియమితుడై, [2] 24న బాధ్యతలు చేపట్టాడు.[3] కమిషన్‌ సభ్యులుగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్‌), న్యాయవాది డాక్టర్‌ గోచిపాత శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడిషియల్‌) బాధ్యతలు స్వీకరించారు.

మూలాలు[మార్చు]

  1. Nava Telangana (31 January 2020). "జాతీయ మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను ఎవరు నియమిస్తారు?". Archived from the original on 4 ఫిబ్రవరి 2020. Retrieved 29 August 2021.
  2. Prajatantra News (17 March 2021). "రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
  3. Sakshi Education (26 March 2021). "ఏపీ హెచ్ఆర్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ న్యాయమూర్తి". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.