ఈనాడు (1982 సినిమా)
ఈనాడు (1982 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.సాంబశివరావు |
తారాగణం | కృష్ణ, చంద్రమోహన్, రాధిక |
సంగీతం | జె.వి.రాఘవులు |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
నిర్మాణ సంస్థ | పద్మాలయా పిక్చర్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 17, 1982 |
భాష | తెలుగు |
ఇది 1982లో విడుదలైన తెలుగు సినీమా. కృష్ణ 200 వ చిత్రంగా పద్మాలయా పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం. మలయాళంలో విజయవంతమైన ఈనాడు చిత్రం దీనికి ఆధారం. పరుచూరి సోదరులు కృష్ణ చిత్రానికి తొలిసారిగా పనిచేసారు. పొలిటికల్ సెటైర్ గా తీసిన చిత్రం విజయవంతమయ్యింది.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- చంద్రమోహన్
- రాధిక
- శ్రీధర్
- జమున
- కృష్ణకుమారి
- రావు గోపాలరావు
- గిరిబాబు
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- కొంగర జగ్గయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కాంతారావు
- త్యాగరాజు
- సుధాకర్
- రాజా
- పేకేటి
- సాక్షి రంగారావు
- పి.ఎల్.నారాయణ
- సారధి
- బి.రామారావు
- కృష్ణమూర్తి
- రాళ్ళబండి
- బీమేశ్వరరావు
- ప్రతాప్
- అర్జున్ కుమార్
- రమణారెడ్డి
- విద్యాసాగర్
- చిడతల అప్పారావు
- గోకిన రామారావు
- ఝాన్సీ
- అత్తిలి లక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: పి.సాంబశివరావు
సంగీతం: జె.వి.రాఘవులు
నిర్మాత: జి.హనుమంతరావు
నిర్మాణ సంస్థ: పద్మాలయ పిక్చర్స్
మాటలు: పరుచూరి బ్రదర్స్
పాటలు: శ్రీ శ్రీ , ఎం.గోపీ,కొసరాజు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ప్రకాశరావు, ఎస్ పి శైలజ , మాధవపెద్ది సత్యం
కళ: కె.రామలింగేశ్వరరావు
కూర్పు: నరసింహరావు,నాగేశ్వరరావు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి:పుష్పాల గోపీకృష్ణ
నృత్యాలు:శ్రీనివాస్
అసోసియేట్ డైరెక్టర్: త్రిపురనేని వరప్రసాద్
నిర్వహణ: జి.ఆదిశేషగిరిరావు
విడుదల:17:12:1982.
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]
మలయాళంలో విడుదలై విజయవంతమైన ఈనాడు చిత్రం ఈనాడుకు మాతృక. పద్మాలయ సంస్థ ద్వారా తెలుగులో తీద్దామన్న ఉద్దేశంతో కృష్ణ ఈ సినిమా తెలుగు పునర్నిర్మాణ హక్కులు కొన్నారు. మలయాళ మాతృక సినిమాలో హీరో వయసు అరవై సంవత్సరాలు. పరుచూరి సోదరులను పిలిపించి కృష్ణ వారికి ఈ సినిమా చూపించి ఎవరు హీరోగా సరిపోతారంటే కృష్ణే సరిపోతారని చెప్పారు. మూలంలో కథానాయకుడు ముసలి వయసులో ఉన్నవాడు కదానని కృష్ణ అడగగా, ఆయన బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తానని చెప్పారు. ఆయన మరుసటి రోజు వింటానని సమయమివ్వగా 20 గంటల్లో ట్రీట్మెంట్ రాయడం పూర్తిచేశారు. ఇందులో కథానాయకుడి వయసును తగ్గించడంతో పాటుగా, కథానాయకుడు ప్రతినాయకుల మధ్య బావా బావమరుదుల సంబంధాన్ని కల్పించారు రచయితలు పరుచూరి సోదరులు. మలయాళ మాతృక సినిమాలో పాటలేవీ ఉండకపోవటంతో తెలుగు సినిమాలో పాటలకు చోటుకల్పించారు.[1]
నటీనటుల ఎంపిక
[మార్చు]మలయాళ మాతృకలో కథానాయకుని పాత్ర ముసలి వ్యక్తి కావడంతో కృష్ణ ఎవరైనా సీనియర్ నటుడితో కథానాయక పాత్ర చేయిద్దామనుకున్నారు. ఆ పాత్రలోనూ, సినిమా కథలోనూ రచయితలు పరుచూరి సోదరులు మార్పులు చేశారు. దాంతో కథానాయకునిగా కృష్ణ నటించడానికి అంగీకరించారు.[1]
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
నేడె ఈ నాడే ప్రజా యుద్ధ సంరంభం | శ్రీశ్రీ | జె.వి.రాఘవులు | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం |
రండి కదలి రండి | శ్రీరంగం శ్రీనివాసరావు | జె.వి.రాఘవులు | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం |
కానీ సరే కానీ నీ ఆటలన్ని సాగని | మైలవరపు గోపి | జె.వి.రాఘవులు | ప్రకాశరావు, పి సుశీల |
యే వాడ చుక్కయైన ఏ కాడ చంద్రుడు | మైలవరపు గోపి | జె.వి.రాఘవులు | ప్రకాశరావు, పి సుశీల బృందం. |
వినరో ఓ వీరపుత్రుడా,(బుర్రకథ), రచన: కొసరాజురాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ప్రకాశరావు బృందం.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 పరుచూరి, గోపాలకృష్ణ. లెవంత్ అవర్ (2 ed.). హైదరాబాద్: వి టెక్ పబ్లికేషన్స్. pp. 1–11.
. 2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.