ఉప్పాడ రంగబాబు

వికీపీడియా నుండి
(ఉప్పాడ రంగ బాబు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉప్పాడ రంగబాబు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు.
పదవీ కాలం
1955, 1972
నియోజకవర్గం ఇచ్ఛాపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1925
రాజకీయ పార్టీ కాంగ్రేసు పార్టీ

ఉప్పాడ రంగబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ఇతడు భారత జాతీయ కాంగ్రెసు సభ్యునిగా ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం నుండి 1955 లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.

రంగబాబు 9-10-1925 తేదీన జన్మించాడు. ఇంటర్ మీడియట్ విద్యానంతరం 1942 లో రాజకీయాలలో ప్రవేశించాడు. 1950 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా, తరువాత ప్రజాపార్టీలోను, లోక్ పార్టీలోను సభ్యుడుగా ప్రజాసేవలను అందించాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జిల్లా ప్రొహిబిషన్ కమిటీలోను, ప్లానింగు కమిటీలోను సభ్యునిగా సేవ చేశాడు.[1]

ఇతడు 1972లో తిరిగి ఇచ్ఛాపురం నియోజకవర్గం నుండే శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్ర శాసనసభ్యులు. 1955.
  2. "Election Commission of India.A.P.Assembly results.1972" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2015-06-11.