ఎంసీ కోటిరెడ్డి
ఎంసీ కోటిరెడ్డి | |||
![]()
| |||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 5 జనవరి 2022 నుండి 4 జనవరి 2028 | |||
ముందు | తేరా చిన్నపరెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | నల్గొండ జిల్లా స్థానిక సంస్థల కోటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 15 అక్టోబర్ 1959 బోయగూడెం , తిరుమలగిరి సాగర్ మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | ![]() | ||
తల్లిదండ్రులు | మట్టా రెడ్డి, బుచ్చమ్మ | ||
జీవిత భాగస్వామి | పద్మావతి | ||
సంతానం | సుజిత్ రెడ్డి, అభిజీత్ రెడ్డి | ||
నివాసం | నల్గొండ | ||
మతం | హిందూ మతము |
మంకెన కోటి రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ‘స్థానిక సంస్థల’ కోటా టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఎంసీ కోటిరెడ్డి 15 అక్టోబర్ 1959లో తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, బోయగూడెం గ్రామంలో మట్టా రెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బి.ఎల్, ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు. ఎంసీ కోటిరెడ్డి ఎల్.ఎల్.బి పూర్తి చేసి న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, 2005లో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా నియమితులై 7 సంవత్సరాలు పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎంసీ కోటిరెడ్డి 1984లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1984 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.
ఎంసీ కోటిరెడ్డి 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్యకు మద్దతుగా పని చేసి ఆయన గెలుపులో కీలకంగా పని చేశాడు. 2021లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన సీటును ఆశించాడు, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోముల భగత్ కుమార్ కు టికెట్ ఇచ్చాడు, ఆయనను గెలిపించుకుని వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో నోముల భగత్ గెలవడంతో తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును టిఆర్ఎస్ అధిష్టానం 21 నవంబర్ 2021న ఖరారు చేసింది.[2][3]
మంకెన కోటిరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబర్ 23న నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు.[4] కోటిరెడ్డి 10 డిసెంబర్ 2021లో తెలంగాణ శాసనమండలి కి జరిగిన ఎన్నికల్లో నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 2022 ఫిబ్రవరి 21న శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[6][7]
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో 9 మందితో రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేశాడు. ఈ కమిటీలో ఎమ్మెల్సీకి కోటిరెడ్డి సభ్యుడిగా ఉన్నారు.[8][9]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (15 December 2021). "ఆరూ.. కారుకే!". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (22 November 2021). "టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
- ↑ Eenadu (23 November 2021). "తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటిరెడ్డి". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
- ↑ Namasthe Telangana (23 November 2021). "ముగిసిన నామినేషన్లు". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
- ↑ V6 Velugu (14 December 2021). "సిక్స్ కొట్టిన టీఆర్ఎస్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ HMTV (21 February 2022). "ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురి ప్రమాణ స్వీకారం". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
- ↑ Prabha News (21 February 2022). "ఎమ్మెల్సీలుగా ఆ నలుగురు ప్రమాణం". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
- ↑ "రైతు ఆత్మహత్యలపై భారాస అధ్యయన కమిటీ". 21 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
- ↑ "రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ.. రెండు వారాల పాటు అన్ని జిల్లాల్లో పర్యటన". NT News. 20 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.