ఈడుపుగంటి వెంకట సుబ్బారావు
ఐ.వి.సుబ్బారావు | |
---|---|
![]() | |
జననం | డిసెంబర్ 20, 1934 పసలపూడి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
మరణం | ఆగష్టు 14, 2010 |
పౌరసత్వం | భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
జాతి | హిందూ |
రంగములు | వ్యవసాయం |
విద్యాసంస్థలు | ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మశ్రీ |
ఈడుపుగంటి వెంకట సుబ్బారావు M.Sc. Ph.D. (డిసెంబర్ 20, 1934 – ఆగష్టు 14, 2010) ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఇతడు ఐ.వి.సుబ్బారావుగా సుపరిచితుడు. అతను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని పసలపూడి గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు అచ్చన్న, మున్నెమ్మ. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్ లో M.Sc. చేశాడు, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ నుంచి Ph.D. పొందాడు. అతను ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టే ముందు విశ్వవిద్యాలయంలో పరిశోధన యొక్క డైరక్టర్ గా ఉన్నాడు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వరుసగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి 2003 లో పదవీ విరమణ చేశాడు.
ఈ విశ్వవిద్యాలయం, ఈయన ఆధ్వర్యంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించి, దేశం లోనే, దీనిని నిర్వహించిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయముగా పేరు తెచ్చుకొన్నది.[1] అతను 2006 లో నిర్వహించిన 93 వ కాంగ్రెస్ కు జనరల్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.
అతను 75 సంవత్సరాల వయస్సులో 2010 ఆగష్టు 14 న క్యాన్సర్తో మరణించాడు.[2]
పురస్కారాలు[మార్చు]
- అతను వ్యవసాయ రంగానికి చేసిన ప్రముఖ సేవలకు 2002 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించాడు.
- బోర్లోగ్ అవార్డు (2004).
- అశుతోష్ ముఖర్జీ స్మారక అవార్డు (2007).