తణుకు
తణుకు తారకాపురి | |
---|---|
![]() తణుకు పట్టణం చిత్రపటం | |
నిర్దేశాంకాలు: 16°45′N 81°42′E / 16.75°N 81.7°ECoordinates: 16°45′N 81°42′E / 16.75°N 81.7°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | పురపాలకసంఘం |
• నిర్వహణ | తణుకు పురపాలకసంస్థ |
• MLA | కారుమూరి వెంకట నాగేశ్వరరావు |
• Municipal Chairman | Vacant |
విస్తీర్ణం | |
• మొత్తం | 24.83 కి.మీ2 (9.59 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 90,430 |
• ర్యాంకు | 5వది (జిల్లా) |
• సాంద్రత | 3,600/కి.మీ2 (9,400/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | [తెలుగు]] |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 534211 |
Telephone code | +91–08819 |
వాహనాల నమోదు కోడ్ | AP–37,39 |
Nearest city | తాడేపల్లిగూడెం |
జాలస్థలి | tanuku |
తణుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. ఇదే తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తణుకు 32 వార్డుతో 72,348 జనాభాతో ఉండేది 2013వ సంవత్సరంలో తణుకు మున్సిపాలిటీ లో మూడు గ్రామాలను వెంకటరాయపురం, పైడిపర్రు, వీరభద్రపురం విలీనం చేశారు అప్పుడు తణుకు మున్సిపాలిటీ పరిధి 24.83 కి.మీ గా పెరిగి 34 వార్డు లో 90,430 మంది జనాభా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు ప్రకారం ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తర్వాత తణుకు ఐదవ పెద్ద పట్టణంగా ఉంది.
పేరు వెనుక చరిత్ర[మార్చు]
స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాతం అసురుల (రాక్షసులు) రాజైన తారకాసురుని రాజ్యపు రాజధానిగా చెప్పబడుతుంది. పరిసర ప్రాంతాలలో ఈ కథనానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు లభ్యమవుచున్నాయి. అవి కొన్ని ఇక్కడ పొందు పరచబడినవి. ప్రస్తుత పాలంగి ఆ రోజులలో పూలంగి ( పూల కొట్టు) గానూ, ప్రస్తుత చివటం గ్రామం శ్రీవతం (ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం) గానూ, అప్పటి ధాన్యాగారమే ఇప్పటి వడ్లూరు గానూ, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం (బంగారం భద్రపరుచు ప్రాంతం) గానూ, బహుశా ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు.
ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్ధం నుండే చాలా గ్రామాలకు పేరు స్థిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్రపురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామం వేల్పూరు (వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పిలవబడుచున్నదని చెబుతారు.ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నో గుడులు (ఆలయాలు) ఉండడం గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉంది.అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు గానూ, అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. ఇవన్నీ ఎలా ఉన్ననూ తణుకు ప్రశస్తి పురాణాలలో ఉన్నట్లు పండితులు చెబుతారు. ఆదికవి నన్నయ ఇక్కడే యాగం చేసినట్లు చరిత్ర చెబుతోంది. తణుకు పట్టణానికి తారకేశ్వరపురం అన్న పూర్వనామం ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు.[3]
భౌగోళికం[మార్చు]
- తణుకు 16o 45' ఉ, 81o 42' తూర్పు అక్షాంశ, రేఖాంశాల మధ్య ఉంది.
చరిత్ర[మార్చు]
గోస్తని నది పుణ్యజలధారలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది. దీనిని బట్టి తణుకు ప్రాంతానికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతున్నది. మధ్యయుగాలలో, ఆధునిక యగంలో తణుకు ప్రశస్తి అనేక చోట్ల కనిపిస్తూ ఉంది.[4][ఆధారం చూపాలి]. వర్తమానంలో తణుకు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తూ ఉంది. వ్యవసాయకంగాను, పారిశ్రామికంగాను, విద్య, వైద్య రంగాలలోను తణుకు ఎంతో అభివృద్ధి చెందింది[ఆధారం చూపాలి]. తణుకు మండలానికి చెందిన మండపాక గ్రామం, వేల్పూరు గ్రామం రాజకీయ చైతన్యానికి, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞాన వినియోగానికి జిల్లా మొత్తంలో ముందువరుసలో ఉన్నాయి[ఆధారం చూపాలి]. భారతదేశంలో మొదటి సారిగా రాకెట్ ఇంధనం తయారి పరిశ్రమ తణుకులోనే ఏర్పాటు చేయడం జరిగింది/
తణుకులో కవులు[మార్చు]
- ఆది కవి నన్నయ్యభట్టు
- ముదిగంటి జగ్గన్న శాస్త్రి
- కళాప్రపూర్ణ పండిత పెనుమత్స సత్యనారాయణరాజు (తెలుగు రాజు)
- రంగినీని సత్యనారాయణ రాజు (రసరాజు)
- డా.వేదుల సూర్యనారాయణ శర్మ
- కొప్పర్తి వెంకటరమణమూర్తి
- కోట వేంకట లక్ష్మీనరసింహం - సహస్రావధాని
- అక్కిపెద్ది రామ సూర్యనారాయణ - అష్టావధాని
- బి.వి.వి.ప్రసాద్ (హైకూ కవి,)
సాంస్కృతిక సేవా రంగాలు[మార్చు]
రవాణా వ్యవస్థ[మార్చు]
రైలు రవాణా[మార్చు]
తణుకు రైల్వే స్టేషను విజయవాడ జంక్షన్, నిడదవోలు మధ్య ఉంది. ఇది సింగల్ లైన్, విద్యుదీకరణ లేదు. దాదాపు 20 పాసింజర్ & 10 ఎక్స్ప్రెస్ రైళ్లు తణుకు ద్వారా వెళ్ళి హైదరాబాదు, చెన్నై, బెంగుళూర్, విశాఖపట్నం, ముంబై స్టేషనులకు కనెక్ట్ అవుతాయి.
రోడ్డు రవాణా[మార్చు]
తణుకులో ఉన్న జాతీయ రహదారి-16 చెన్నై నుండి కలకత్తాకు కనెక్ట్ చేసి ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా ప్రధానంగా స్టీల్, బొగ్గు, చమురు, మేజర్ నిర్మాణ సామగ్రి వాహనాలు రోజువారీ వెళ్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యెుక్క ప్రధానమైన ఉత్పత్తి స్టీల్.
విద్యాలయాలు[మార్చు]
సంపూర్ణ అక్షరాస్యతకు మార్గదర్శి తణుకు.అక్షరాస్యతా వార్తలలో తణుకు పట్టణం ప్రత్యేక స్థానంలో ఉంది.2000 సెప్టెంబరు 8న అక్షరయజ్ఞం పేరుతో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమానికి ఈ పట్టణం శ్రీకారం చుట్టింది.2001 మార్చి 15న శాసనసభలో పాఠశాల విద్యాశాఖ మంత్రి సంపూర్ణ అక్షరాస్యతా సాధించిన తొలి పట్టణంగా తణుకును ప్రకటించారు.ఇప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడానికి తీర్మానించిన తొలి తెలుగు పట్టణంగా ముందుకు వచ్చింది.
దేవాలయాలు[మార్చు]
సిరిసంపదలతో, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో పరిపుష్టిగా ఉన్న తణుకు పట్టణం, ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకస్దానం పోందిం
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "District Census Hand Book : West Godavari (Part B)" (PDF). Census of India. Directorate of Census Operations, Andhra Pradesh. 2011. pp. 22–23, 54. Retrieved 9 June 2019.
- ↑ "About Tanuku Municipality". tanuku.cdma.ap.gov.in. p. 42. Archived from the original (PDF) on 27 జనవరి 2020. Retrieved 27 April 2019.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.
{{cite journal}}
: Check date values in:|date=
(help) - ↑ "About Tanuku Municipality | Tanuku Municipality". tanuku.cdma.ap.gov.in. Archived from the original on 2020-01-27. Retrieved 2019-12-18.