కారుమూరి వెంకట నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారుమూరి వెంకట నాగేశ్వరరావు
కారుమూరి వెంకట నాగేశ్వరరావు


పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు ఆరిమిల్లి రాధాకృష్ణ
నియోజకవర్గం తణుకు నియోజకవర్గం

శాసనసభ సభ్యుడు, తణుకు, ఆంధ్రప్రదేశ్
పదవీ కాలం
2009 – 2014

జనరల్ సెక్రటరీ
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
పదవీ కాలం
2019 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-10-02) 1964 అక్టోబరు 2 (వయసు 59)
అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి కారుమూరి లక్ష్మీ కిరణ్ (1989- ప్రస్తుతం)
సంతానం కుమారుడు:సునీల్ కారుమూరి, కుమార్తె:దీపికా కారుమూరి
నివాసం తణుకు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

కారుమూరి వెంకట నాగేశ్వరరావు (జ.1964 అక్టోబరు 2) యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చెందిన రాజకీయ నాయకుడు. అతను తణుకు శాసనసభ నియోజకవర్గం నుండి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.

జీవిత విశేషాలు[మార్చు]

కారుమూరి నాగేశ్వర రావు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో కారుమూరి రామకృష్ణ, సూర్యకాంతమ్మ దంపతులకు 1964 అక్టోబరు 2న జన్మించాడు. తన 18వ యేట అతను హైదరాబాదు వెళ్ళి వ్యాపారాలు ప్రారంభించాడు. అతనికి ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. అతని సోదరుడు తణుకులో రసాయనశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. నాగేశ్వరరావు 1989లో లక్ష్మీకిరణ్ ను వివాహమాడాడు వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు, 2009 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 2009 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ముందు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కు ఛైర్మన్ గా మూడు సంవత్సరాలు పనిచేశాడు.[1] 2007 లో యు ఎస్‌ లోని వెస్ట్‌బ్రూక్ విశ్వవిద్యాలయం సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.[2] 9 జూన్ 2013 న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు. వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 2019 ఎన్నికలలో తనుకు నుండి ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికయ్యాడు.

2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తణుకు శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సమీప తెలుగుదేశంపార్టీకి చెందిన ప్రత్యర్థి వై.టి రాజా పై 1451 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[3] 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలొ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అరిమిల్లి రాధాకృష్ణ పై విజయం సాధించాడు.[4] ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5][6]


మూలాలు[మార్చు]

  1. "Karumuri takes oath as Zilla Parishad chief". The Hindu. 24 July 2006. Archived from the original on 6 November 2012. Retrieved 15 April 2010.
  2. "Doctorate presentation". Westbrook University. Archived from the original on 2 June 2014. Retrieved 24 July 2012.
  3. "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2020-07-16.
  4. "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-16.
  5. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  6. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)