కవికోకిల గ్రంథావళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కవికోకిల గ్రంథావళి
కృతికర్త: దువ్వూరి రామిరెడ్డి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ: కవికోకిల గ్రంథమాల
విడుదల: 1935
ముద్రణ: నెల్లూరు


దువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895సెప్టెంబర్ 11, 1947) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఆయన సాహిత్యాన్ని కవికోకిల గ్రంథావళిగా వివిధ సంపుటాల్లో ప్రచురించగా; నాల్గవ సంపుటిలో సాహిత్య వ్యాసాలు ముద్రించారు.

దీని మొదటి ముద్రణము 1935లో చేయగా (రెండవ ముద్రణ 1945లో; మూడవ ముద్రణ 1946లో; నాల్గవ ముద్రణ 1955లో; ఐదవ ముద్రణ 1959లో) 1967లో ఇది ఆరవ ముద్రణము పొందినది. దీనిని కవికోకిల గ్రంథమాల, నెల్లూరు వారు ప్రచురించారు.

మొదటి సంపుటములోని కావ్యములు[మార్చు]

రెండవ సంపుటములోని ఖండకావ్యములు[మార్చు]

  • నక్షత్రమాల
  • నైవేద్యము
  • భగ్నహృదయము
  • పరిశిష్టము
  • ప్రథమకవిత్వము

మూడవ సంపుటములోని నాటకాలు[మార్చు]

కవికోకిల గ్రంథావళి-మూడవ సంపుటం ముఖచిత్రం.

నాల్గవ సంపుటములోని వ్యాసములు[మార్చు]

1. సారస్వత వ్యాసములు
  1. కవి
  2. కవిత్వావతరణము
  3. కవిత్వతత్త్వము
  4. కావ్యజీవితము
  5. కవిత్వశిల్పము - అనుకరణము
  6. రసరామణీయకములు
  7. శిల్పసీమలు
  8. కవిత్వప్రయోజనము
  9. కావ్యము నీతి
  10. మర్మ కవిత్వము
  11. నాటక కళాసంస్కరణము
  12. అల్లసాని పెద్దన సమకాలీన భావప్రతినిధి
  13. నాటకము చరిత్రము
  14. అలంకార తత్త్వము
2. తెలుగు కవితలో క్రొత్త తెన్నులు
  1. తెలుగు కవితలో క్రొత్త తెన్నులు
  2. అభినవాంధ్ర సాహిత్యము
  3. చిత్ర లక్షణము
  4. సాహిత్యములో రమ్యత
  5. నేటి కవిత - ప్రకృతి పూజ
  6. సాహిత్యంలో వైచిత్రి
  7. నా కవితానుభవములు
  8. తిక్కన
  9. విషాదాంత నాటకము - మీరాబాయి

అయిదు, ఆరవ, ఏడవ సంపుటాలలోని అంశాలు[మార్చు]

ఈ గ్రంథావళిలోని ఐదవ సంపుటము గులాబీ తోటగా ముద్రించారు.[1] ఇది పార్సీ మహాకవి "గులిస్తాను" అని కావ్యమునకు అనువాదము. కవికోకిల గ్రంథావలి- 6 పండ్లతోటను 1956 ముద్రించారు.[2] దానినే చిన్నచిన్న కథలుగా ఉన్నదానికి ఆరవ సంపుటిగా ప్రచురించారు. ఏడవ సంపుటంలో రెడ్డిగారి డైరీలు, ఉత్తరాలను ముద్రించారు.

శతజయంతి సంపుటాలు[మార్చు]

దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి, నెల్లూరు వారు రామిరెడ్డిగారి శతజయంతి సందర్భంగా 1996 వీరి సమగ్ర సాహిత్యాన్ని ముద్రించారు. దీని రెండవ సంపుటంలో నాటికలు, వ్యాసాలతో పాటుగా డైరీలు - ఉత్తరాలు కూడా ప్రచురించారు.[3]

మూలాలు[మార్చు]

  1. https://archive.org/details/in.ernet.dli.2015.333555/page/n3/mode/2up
  2. https://archive.org/details/in.ernet.dli.2015.386202/page/n3/mode/2up
  3. https://archive.org/details/in.ernet.dli.2015.390210/page/n1/mode/2up