కాకతీయ జూ పార్క్
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కాకతీయ జూ పార్క్ వరంగల్ పట్టణ జిల్లా,హనుమకొండ మండలం హనుమకొండ పట్టణంలోని హంటర్ రోడ్లో ఉంది.దీనిని వరంగల్ వన విజ్ఞాన కేంద్రం అని కూడా అంటారు.
విశేషాలు[మార్చు]
సామాన్య ప్రజానీకానికి వన్యసంరక్షణ గురించి తెలపడానికి ఈ కాకతీయ జూ పార్క్ ఏర్పాటు చేయబడింది. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జూ పార్క్ లో వివిధ రకాల జంతువులతో పాటు చాలా మొక్కలను కూడా పెంచుతున్నారు. ఈ పార్కు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో జింకలు, లేళ్లు, దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులు; చిలుకలు, పావురాలు, నిప్పుకోళ్లు, నెమళ్లు వంటి పలురకాల పక్షులు; తాబేళ్లు, మొసళ్ల వంటి సరీసృపాలు సంరక్షించబడుతున్నాయి. ఈ పార్కులో వన్య సంరక్షణ గురించి పర్యాటకులకు తెలిజేసేందుకు అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ప్రత్యేక కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పార్కును ప్రతి రోజు సుమారు 500 మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.