కాళింది
శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు కాళింది. కాళింది సూర్యుని కూతురు. ఆమె తండ్రి తేజస్సును పొందింది, [1]
కృష్ణునితో వివాహం
[మార్చు]ఆమె నారాయణుని పెండ్లాడాలని సంకల్పించి తన తండ్రికి తెలిపింది. అతను ఇది తీరని కోరిక అని వేరెవరినైనా వరించమని నచ్చజెప్పాడు. కానీ ఆమె అంగీకరించలేదు. నారాయణుని వివాహమాడేందుకు తండ్రినే తోవ చూపమంది. తండ్రి సూచన మేరకు తపస్సు చేయడానికి అడవికి చేరింది. శ్రీహరి శ్రీకృష్ణునిగా పుట్టాడని, ద్వారకలో ఉన్నాడని చెప్పిన తండ్రి మాటల మీద నమ్మకముంచింది. విష్ణుమూర్తి అవతారమయిన శ్రీకృష్ణుడిని పెళ్ళి చేసుకోవాలని తపస్సు చేసింది.
ఒకనాడు ఇంద్ర ప్రస్తం నుండి వనవిహారానికి వచ్చారు కృష్ణార్జునులు. వారు యమునా నదిలో స్నానం చేయటానికి వెళ్ళినపుడు ఆమె తపస్సు గురించి తెలుసుకున్న అర్జునుడు శ్రీకృష్ణునితో తెలుపగా ఆమె మనోభిప్రాయానికి అనుగుణంగా ఆమెను ద్వారకా నగరానికి తీసుకెళ్ళి పెద్దలందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకుంటాడు.[2]
వీరికి శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.
మూలాలు
[మార్చు]- ↑ "కాళింది (For Children) | teluguglobal.in". www.teluguglobal.in. Archived from the original on 2021-04-14. Retrieved 2021-04-14.
- ↑ Ritu (2018-02-01). "Ashtabharya – Shri Krishna and his eight queens". Indian mythology (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-17. Retrieved 2021-04-14.