Jump to content

కిర‌ణ్ బాబు

వికీపీడియా నుండి

కిరణ్ బాబు పైగంబర కవులు లో ఒకరైన రావినూతల సుబ్బారావు కలంపేరు. అతను రచయిత. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

కిరణ్ బాబు పూర్వీకులు ప్రకాశం జిల్లా రావినూతల దగ్గర పమిడి పాడుకు చెందినవారు. అతను గుంటూరు లో 1950 జూలై 1న జన్మించాడు. తాడికొండలో చదువుకున్నాడు. అతను ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. అతను ప్రైవేట్ కంపెనీ ల్లో ప‌నిచేశాడు.

ప్రచురించినవి పైగంబర కవుల కవితా సంకలనాలు, రవిదాసు పదాలు, అనువాదం.

పైగంబ‌ర క‌వుల‌లో ఒక‌డు. సుగ‌మ్ బాబు, క‌మ‌లాకాంత్‌, దేవీప్రియ‌, ఓల్గా మిగిలిన న‌లుగురు పైగంబ‌ర క‌వులు.

సుగమ్ బాబు, దేవిప్రియ, కిరణ్ బాబు, ఓల్గా, కమలాకాంత్ కలిసి 1970లో “పైగంబరకవులు”గా త‌మ‌ను ప్ర‌క‌టించుకొన్నారు. 1970లో తొలి సంపుటి “యుగసంగీతం ప్ర‌చురించారు. త‌ర్వాత సంవత్సరం 1971లో రెండో సంపుటి “యుగ చైతన్యం వచ్చింది.

మగత నిద్రబోతున్న లోకం వెన్ను చరచిన ‘పైగంబర కవి కిరణ్ బాబు. కిరణ్ బాబు రాసింది చాలా తక్కువ. అందుకేనేమో తనను తాను “రాయని భాస్కరుడు గా అభివర్ణించుకుంటాడు.పైగంబరకవిత్వంతో కిరణ్ బాబు అక్షర సన్యాసం చేశాడు అని చెప్ప‌వ‌చ్చు.

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు సాహిత్యంలో పైగంబర కవిత్వానిది ప్రత్యేక స్థానం". EENADU. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-05-15.