కుంజా సత్యవతి
Jump to navigation
Jump to search
కుంజా సత్యవతి | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
నియోజకవర్గం | భద్రాచలం శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగస్టు 1, 1971 వరరామచంద్రపురం, భద్రాచలం మండలం, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | కుంజా ధర్మారావు | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
కుంజా సత్యవతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరపున భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.[1]
జననం - విద్యాభ్యాసం[మార్చు]
సత్యవతి 1971, ఆగస్టు 1న శూలం కృష్ణ, సీతమ్మ దంపతులకు భద్రాచలం మండలం లోని వరరామచంద్రపురం లో జన్మించింది. 10వ తరగతి వరకు చదువుకుంది.
వివాహం - పిల్లలు[మార్చు]
1988, ఆగస్టు 8న కుంజా ధర్మారావుతో సత్యవతి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (సంతోష్ కుమార్, విశ్వశాంతి)
రాజకీయరంగ ప్రస్థానం[మార్చు]
1991లో భద్రాచలం ఎంపిపిగా ఎన్నికయింది. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా ఎన్నికయింది. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ... ఎస్టీ కమిటీ... ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది.
మూలాలు[మార్చు]
- ↑ సాక్షి ఎడ్యువేషన్. "ఆరంభంలోనే అంతరాయం". www.sakshieducation.com. Retrieved 15 May 2017.