Jump to content

కుతుబుద్దీన్ ఐబక్

వికీపీడియా నుండి
కుతుబుద్దీన్ ఐబక్
జననం
కుతుబుద్దీన్ ఐబక్

వృత్తిచక్రవర్తి
తరువాతివారుఇల్తుత్మిష్

కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఒక రాజు. ఐబక్ అనగా చంద్రునికి ప్రభువు అని అర్థం. ఇతను టర్కీ వంశస్థుడు. ఇతను ఇల్బారీ తెగకు చెందినవాడు.బానిస రాజుల శకానికి నాంది పలికాడు. ఈయన రాజ్య విస్తరణ కోసం ఘోరి మరణాంతరం గజినీ ప్రాంతం స్వతంత్రించి,పాలకుడైన తాజుద్దీన్ ఎల్డజ్ కుమార్తె ను వివాహం చేసుకున్నాడు,మరియు ముల్తాన్ ప్రాంతాన్ని స్వతంత్రించిన నాసిరుద్దీన్ కుబాచా కి తన సోదరిని ఇచ్చి వివాహం జరిపించాడు. ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ కట్టడం కుతుబ్ మినార్ ఇతను నిర్మించినదే. అలాగే ఢిల్లీలో కువ్వత్-అల్-ఇస్లాం మసీదు, అజ్మీర్లో అధాయ్ దిన్ కా ఝోప్రా మసీదులను నిర్మించాడు. తన మరణం వరకూ దాదాపు 4 సంవత్సరాలు ( క్రీస్తు శకం 1206 నుండి 1210 వరకు) అతని పరిపాలన సాగింది.

మరణం

[మార్చు]

ఇతను లాహోర్ నగరంలో పోలో ఆటను ఆడుతుండగా గుర్రం పైనుండి పడి మరణించాడు.[1]

బిరుదులు

[మార్చు]

1. లాక్ బక్ష్ (హబిబుల్లా అనే వ్యక్తి ఈ బిరుదు ఇచ్చాడు)

2. సిఫాసలార్

నిర్మాణాలు

[మార్చు]

1. కువ్వత్ - ఉల్ - ఇస్లామ్ ( ఈ మసీదు ఢిల్లీలో కలదు)

2. అధైదిన్ ఝోంప్రా.(ఈ మసీదు అజ్మీర్ లో కలదు)

మూలాలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]
  • K. A. Nizami (1992). "The Early Turkish Sultans of Delhi". In Mohammad Habib; Khaliq Ahmad Nizami (eds.). A Comprehensive History of India: The Delhi Sultanat (A.D. 1206-1526). Vol. 5 (Second ed.). The Indian History Congress / People's Publishing House. OCLC 31870180.

బయటి లంకెలు

[మార్చు]