కె.ఆర్.వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కె.ఆర్.వేణుగోపాల్ రిటైర్డు ఐఏఎస్ అధికారి.రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, అంగన్‌వాడీ వంటి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. మానసిక వికలాంగుల కోసం స్వచ్ఛంద సంస్థను,దళిత అధ్యయన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.అసిస్టెంట్- కలెక్టర్‌గా శిక్షణలో ఉన్నప్పుడే బదిలీకి గురయ్యారు. ప్రధానమంత్రి వి.పి. సింగ్ వద్ద అడిషనల్ సెక్రెటరీగా పనిచేశారు.

భావాలు[మార్చు]

  • ఫైల్ అంటే ఒట్టి కాగితం కాదు. ప్రతి ఫైలు వెనుక ఒక మనిషి, అతనికి మరో ప్రత్యర్థి ఉంటాడు. అందుకే ప్రతి ఫైలూ ఒక యుద్ధభూమే! అవి కాగితాలు కాదు జీవితాలు.
  • ప్రతి సంతకం వెనుక ఒక సంఘర్షణ ఉంటుంది. పక్కదారి పట్టించే కుయుక్తులు, ఒత్తిళ్లు ఎదురవుతాయి. వాటన్నిటినీ ఎదిరించడానికి ధైర్యం కావాలి. నిజాయితీ ఉన్న చోటే ధైర్యం.. ధైర్యం ఉన్నచోటే నిజాయితీ ఉంటాయి. ఇవి లేకపోతే నిష్పక్షపాతంగా వ్యవహరించలేరు.
  • విధినిర్వహణలో నిజాయితీగా ఉంటే ఎటువంటి సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.
  • రైతును రైతుగా చూడకుండా రాజకీయ వర్గానికి చెందిన వ్యక్తిగా చూడటం ద్వారా ఎన్నో అనర్థాలే జరిగిపోతున్నాయి.
  • గోదావరి తీరప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండే రాజమండ్రి ప్రాంతంలో బియ్యానికి కరువు రావడం ఏమిటి? దీనికంతటికీ కారణం మిల్లర్లు బియ్యాన్ని దాచిపెట్టడమే.
  • ఎదుటి వాళ్లు ఎలా వ్యవహరించినా నీతి నిబద్ధతతో నిలిచే వారికి సమాజంలో ఎప్పుడూ ప్రేమాభిమానాలే లభిస్తాయి.

మూలాలు[మార్చు]