కోటగిరి సీతారామ స్వామి
కోటగిరి సీతారామ స్వామి ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా 1955 లో జరిగిన ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు.
జీవిత విశేషాలు[మార్చు]
అతను 1904లో పూర్వపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొబ్బిలి లో జన్మించాడు. స్కూలు ఫైనలు వరకు విద్యనభ్యసించాడు. 1982లో రాజకీయ ప్రవేశం చేసిన వెంటనే జైలుశిక్ష అనుభవించాడు. 1938-42 మధ్య కాలంలో విశాఖపట్టణం జిల్లా బోర్డు ఉపాధ్యక్షునిగా, 1950-53 కాలంలో శ్రీకాకుళం జిల్లా బోర్డు ఉపాద్యక్షునిగా, శ్రీకాకుళం జిల్లా సంఘ సభ్యునిగా, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, విజయనగరం సెంట్రల్ బ్యాంకు ఉపాద్యక్షునిగా పనిచేసాడు. అతనికి సహకారోద్యమం పై ప్రెత్యేక అభిమానం. [1]
1955 ఎన్నికలు[మార్చు]
ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా 1955 లో జరిగిన ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప పి.ఎస్.పి అభ్యర్థి పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో అతనికి 14031 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 1367 ఓట్లు వచ్చాయి.[2]
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్ర శాసనసభ్యులు. 1955.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Retrieved 2023-07-16.