గురుగోవింద చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురుగోవింద చరిత్ర
కృతికర్త: చిలకమర్తి లక్ష్మీనరసింహము పంతులు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: గురు గోవింద్ సింగ్ చరిత్ర
ప్రచురణ: కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్
విడుదల: 1955
పేజీలు: 144
ముద్రణ: లిలితా ప్రింటింగ్ వర్క్స్, ఇన్నీసు పేట, రాజమండ్రి

గురుగోవింద చరిత్ర చిలకమర్తి లక్ష్మీనరసింహము పంతులు గారు రచించిన పుస్తకం. దీనిని కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్సు, రాజమండ్రి వారు 1955 సంవత్సరంలో ప్రచురించారు.[1]

కథాంశం[మార్చు]

గురు గోవింద్ సింగ్ సిక్కు గురుపరంపరలో పదో గురువు, పదకొండవ గురువు గురు గ్రంథ్ సాహిబ్ అనే పవిత్ర మతగ్రంథం. ఆయన గొప్ప వీరుడు, కవి, తత్త్వవేత్త. ఆయన తండ్రి గురు తేజ్ బహదూర్‌కు తన తొమ్మిదో సంవత్సరంలోనే మత వారసుడయ్యారు. ఆయన సిక్కు మతానికి ఆఖరి జీవించివున్న గురువుగా నిలిచారు. గురు గోవింద్ సింగ్ 1699లో సిక్కు ఖల్సా ప్రారంభించారు. చిలకమర్తి ఆయన జీవితాన్ని, అది అర్థంచేసుకునేందుకు మిగిలిన తొమ్మిదిమంది సిక్కుగురువుల జీవితాలు సంగ్రహంగా ఈ పుస్తకం ద్వారా అందించారు.

మూలాలు[మార్చు]

  1. చిలకమర్తి లక్ష్మీనరసింహం (1955). గురు గోవింద చరిత్రము.

బాహ్య లంకెలు[మార్చు]