ఘృతాచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.

ఘృతాచి, ఇంద్రుని సభలోని 31 మంది అప్సరసలలో ఈమె ఒకరు.అప్సరల 31 మందిలో ఆమెకు ప్రధాన స్థానం ఉంది.ఈమెకు ప్రమతి వలన రురుడు అను కుమారుడు జన్మిస్తాడు.[1] ఒకసారి ఈమెను విశ్వకర్మ చూచి, పొందు కోరగా ఘృతాచి నిరాకరిస్తుంది. కోపం వచ్చిన విశ్వకర్మ శూద్రయోని యందు పుట్టమని శపిస్తాడు.ఘృతాచి విశ్వకర్మను భూలోకాన జన్మిస్తావని ప్రతిశాపమిచ్చింది.శాపం వలన ఘృతాచి మదనుడనువానిఇంట గోపకాంతకు జన్మించి, భూలోకంలో జన్మించిన విశ్వకర్మతో భోగించింది.

పురాణల ప్రకారం చరిత్ర[మార్చు]

ఘృతాచి అందమైన అప్సర. రుషులను మోహింపజేయడంలో, వారి కుమారులకు జన్మనివ్వడంలో ఆమె రాణించింది. ఆమె బాధితుల్లో  వ్యాసమహర్షి, కుశనాభుడు, భరద్వాజ ఉన్నారు.[2]

వ్యాసుడు ద్వారా శుకుడుకు జన్మ[మార్చు]

వ్యాసుడుకు కొడుకు కోసం ఆరాటపడతాడు.అతడు నారదుడి సలహాలను అనుసరించి, ఏకాక్షార మంత్రంతో శివుడికి, పార్వతికి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఒక సంవత్సరం పాటు చేస్తాడు.ఆ సమయంలో వ్యాసుడు శక్తి ప్రపంచాన్ని చుట్టుముట్టింది.ఆ శక్తిని చూచి ఇంద్రుడు భయపడతాడు.శివుడు వ్యాసుడు కనిపించి, అతనికి తెలివైన, ప్రసిద్ధ, సహాయకారి అయిన కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తాడు. ఒకసారి అతను అగ్నిని ప్రారంభించడానికి కట్టెలు కోసం వెతుకుతుంటాడు.అదే సమయంలో కొడుకు గురించి కూడా ఆలోచించడం ప్రారంభించాడు.అగ్నిని ప్రారంభించడానికి తనకు రెండు కట్టెలు అవసరమని, అదేవిధంగా కొడుకును పొందటానికి భార్య అవసరమని అతను అనుకుంటాడు.వెంటనే ఘట్రాచిని తనవద్ద కనిపించటానికి ఎంచుకుంటాడు.అతను శపిస్తాడని భయపడి ఆమె చిలుక రూపం దాల్చింది.కానీ వ్యాసుడుకు ఇది నచ్చదు కానీ త్వరలోనే ఆమె వ్యాసుడు గురించి మనసు మార్చుకుని అతనితో కామం గురించి ఆలోచించడం ప్రారంభించింది.వ్యాసుడు స్ఖలనం చేసుకుంటాడు.అది మండే కర్రల మీద పడింది. అతను దీనిని గ్రహించలేదు.అగ్ని కర్రలను మండిస్తూనే ఉంది.దాని నుండి ఒక కుమారుడు ఉద్భవించాడు.అతను పేరు శుకుడు.[2][1]

భరధ్వాజ ద్వారా ద్రోణుడుకు జన్మ[మార్చు]

ఒకసారి, భరద్వాజ గంగాలో స్నానం చేసి వెళ్లిపోయే ముందు ఘృతాచీ సమీపంలో స్నానం చేయడం జరిగింది.ఆమె బట్టలు ఒక రాయిపై చిక్కుకొని దూరంగా తేలుతున్నాయి.ఇది చూసిన భరద్వాజ స్ఖలనం చేసి, దానిని ఒక పాత్రలో సేకరిస్తాడు.కొన్ని నెలలు తరువాత దాని నుండి ఒక బాలుడు జన్మిస్తాడు.అతడే ద్రోణుడు.[2][1]

కుశనాభుడు ద్వారా నూరుగురు కుమార్తెలకు జన్మ[మార్చు]

కుషా కుమారుడు కుశనాభుడు ఒక రాజరిషి.అతను ఒకసారి ఘృతచీతో ప్రేమలో పడతాడు.అది వివాహానికి దారితీస్తుంది.ఇద్దరూ వివాహం చేసుకుంటారు.వారు వంద మంది కుమార్తెలుకు జన్మనిస్తారు.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Ghritachi - An Apsara - Indian Mythology". www.apamnapat.com. Retrieved 2020-08-11.
  2. 2.0 2.1 2.2 2.3 manuscrypts. "Ghritachi | Origins" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-11.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఘృతాచి&oldid=3883676" నుండి వెలికితీశారు