జమీందారు గారి అమ్మాయి
జమీందారు గారి అమ్మాయి (1975 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాస రావు |
నిర్మాణం | నవతా కృష్ణంరాజు |
తారాగణం | శారద |
సంగీతం | జి.కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జనవరి 31, 1975 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
జమీందారు గారి అమ్మాయి సినిమా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శారద, రంగనాథ్, గుమ్మడి తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా 1975లో విడుదలైన చలనచిత్రం. సినిమాకి సంగీతాన్ని జి.కె.వెంకటేష్ సమకూర్చారు. నవత కృష్ణంరాజు సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా, అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. సినిమా వందరోజుల పాటు ప్రదర్శితమై, మంచి విజయాన్ని సాధించింది.[1]
తారాగణం
[మార్చు]- రంగనాథ్
- శారద
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- మమత
- గిరిబాబు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు
- రచన: డి.వి.నరసరాజు
- సంగీతం: జి.కె.వెంకటేష్
- గీత రచయితలు: దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, కె. కోదండపాణి, వక్కలంక లక్ష్మీపతిరావు,ఆరుద్ర,
- నేపథ్య గానం: పులపాక సుశీల, నవకాంత్, గిరిజ, విస్సంరాజు రామకృష్ణ,శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి,మాధవపెద్ది రమేష్, ఇ.పుష్పలలిత
- ఛాయా గ్రహణం: సుఖదేవ్
- కళ: కళాధర్
- కూర్పు : వాసు
- నిర్మాత: నవతా కృష్ణంరాజు
- సహానిర్మాతలు : డి శ్రీరంగరాజు, ఆర్. విజయ రామరాజు
- నిర్మాణ సంస్థ: నవత చిత్ర
- విడుదల:31:01:1975.
నిర్మాణం
[మార్చు]నేపథ్యం
[మార్చు]నవతా కృష్ణంరాజు ఈ సినిమా తీద్దామని నిర్ణయించుకుని అప్పటికి తన తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సింగీతం శ్రీనివాసరావును దర్శకునిగా తీసుకున్నారు. అయితే సింగీతం తీసిన తొలి సినిమా నీతి నిజాయితి పరాజయం పాలవడంతో పంపిణీదారులు వెనక్కితగ్గారు. సినిమాను నవతా కృష్ణంరాజు వదులుకోవలసివచ్చింది. ప్రముఖ రాజకీయవేత్త, రచయిత రాజాజీ రాసిన కథని సింగీతం శ్రీనివాసరావు తమిళంలో దిక్కట్ర పార్వతిగా తీసి, ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ పురస్కారం పొందారు. ఆ సినిమా బాగా నచ్చడంతో పంపిణీదారుని మార్చినా, సింగీతం శ్రీనివాసరావుతోనే సినిమా తీయాలని నవతా కృష్ణంరాజు నిశ్చయించుకున్నారు.[2]
విడుదల
[మార్చు]జమీందారు గారి అమ్మాయి సినిమా 1975లో విడుదలైంది. సింగీతం శ్రీనివాసరావు మొదటి సినిమా వైఫల్యంతో వెనక్కితగ్గిన డిస్ట్రిబ్యూటర్లను వదిలి, నిర్మాత అన్నపూర్ణ పిక్చర్స్ వారిని పంపిణీదారుగా ఒప్పించారు. దాంతో సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. సినిమా వందరోజులు ప్రదర్శితమై ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శక జీవితంలో తొలి విజయంగా నిలిచింది.[2]
పాటలు
[మార్చు]- మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే, గానం.- పి.సుశీల , రచన: దాశరథి
- ఇంటింటా దీపాలు వెలగాలి , గానం.నవకాంత్, గిరిజ, రచన: ఆరుద్ర
- ఈ లోకపు చదరంగంలో , గానం.వి.రామకృష్ణ , రచన: వక్కలంక లక్ష్మీపతి రావు
- అబ్బా నా పాడుబతుకు , గానం.ఎస్.జానకి, రచన: కె.కోదండపాణి
- ఇది జీవితం ఇది యవ్వనము స్నేహాలు మొహాలు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన:ఆరుద్ర
- చాకిరేవు కాడ.,. అబ్బమంగమ్మ, గానం.మాధవపెద్ది రమేష్, ఇ.పుస్ప లలిత , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి.
- ఓ కొండపల్లి బొమ్మ నీ కులుకులు చాలమ్మా, గానం.పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
- మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆ దివ్యారాగం అనురాగమై సాగిందిలే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: దాశరథి.
మూలాలు
[మార్చు]- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2012/02/1975.html?m=1
- ↑ 2.0 2.1 ఎం.బి.ఎస్., ప్రసాద్. "రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 13 July 2015.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.