జమ్నాలాల్ బజాజ్
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జమ్నాలాల్ బజాజ్ | |
---|---|
![]() జమ్నాలాల్ బజాజ్ | |
జననం | కాశీ కా బస్, సికార్, రాజస్థాన్ | 1889 నవంబరు 4
మరణం | 1942 ఫిబ్రవరి 11 | (వయసు 57)
వృత్తి | సంఘసేవకుడు, రాజకీయవేత్త, స్వాంతంత్ర్య సమరయోధుడు, పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు. |
జీవిత భాగస్వామి | జానకీదేవి బజాజ్ |
పిల్లలు | కమలాబాయి, కమల నయన్, ఉమ, రామకృష్ణ, మదాలస |
తల్లిదండ్రులు | కనీరామ్, బిర్దిబాయి |
జమ్నాలాల్ బజాజ్ (నవంబర్ 4, 1889 - ఫిబ్రవరి 11, 1942) ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
జననం[మార్చు]
నేటి రాజస్థాన్ రాజధాని జైపూర్లో నవంబర్ 4, 1889 వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్య మంలో పాల్గొని జైలు కెళ్ళారు. ఒక సందర్భంలో మహాత్మాగాంధీ బజాజ్ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. వార్ధాలో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి జమ్నాలాల్ బజాజ్ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.
మరణం[మార్చు]
ఫిబ్రవరి 11, 1942లో మరణించాడు.