జి.కొండూరు
జి.కొండూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | జి.కొండూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి పజ్జూరి అంజన |
జనాభా (2001) | |
- మొత్తం | 8,158 |
- పురుషులు | 3,583 |
- స్త్రీలు | 3,348 |
- గృహాల సంఖ్య | 1,666 |
పిన్ కోడ్ | 521229 |
ఎస్.టి.డి కోడ్ | 08865 |
జి.కొండూరు | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో జి.కొండూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో జి.కొండూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°41′08″N 80°34′45″E / 16.685528°N 80.579109°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | జి.కొండూరు |
గ్రామాలు | 27 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 53,499 |
- పురుషులు | 26,934 |
- స్త్రీలు | 26,565 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 63.14% |
- పురుషులు | 67.07% |
- స్త్రీలు | 59.18% |
పిన్కోడ్ | 521229 |
జి.కొండూరు (గడ్డమణుగు కొండూరు), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్ నం 521 229., ఎస్.టి.డి.కోడ్ = 0866.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
[1] పినపాక 2 కి.మీ, చెవుటూరు 4 కి.మీ, వెల్లటూరు 5 కి.మీ, వెలగలేరు 5 కి.మీ, కందులపాడు 5 కి.మీ
సమీప మండలాలు[మార్చు]
మైలవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణ, యెర్రుపాలెం.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
మైలవరం, కొండపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: కొండపల్లి, రామవరప్పాడు, విజయవాడ 20 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
- వివేకానంద ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల.
- శ్రీ వేంకటేశ్వర విద్యాలయం.
- ఆక్స్ ఫర్డ్ హైస్కూల్:- ఈ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ జి.అశోక్, ఇటీవల నిర్వహించిన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, "ఆచార్య దేవోభవ" పురస్కారాన్ని అందుకున్నారు. [11]
- ఓం మానసిక వికలాంగుల పాఠశాల:- ఈ పాఠశాల స్థానిక కొత్తూరు రహదారిలో ఉంది.
- శాఖా గ్రంథాలయం.
- శ్రీ శాయ్ హైస్కూల్, జి.కొండూరు ఆక్స ఫర్డ్ కన్చెప్ట్ హైస్కూల్, జిల్లాపరిషత్ హైస్కూల్, కొండూరు
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
వైద్య సౌకర్యం[మార్చు]
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- జాతీయ ఆరోగ్య మిషన్ ఫేజ్-2 క్రింద, ఈ క్లేంద్రం ఆవరణలో, 2008 లో ఒక హోమియో వైద్యశాలను ఏర్పాటుచేసారు. ఒక డాక్టరునూ, ఒక కాంపౌండరును గూడా ఏర్పాటుచేసారు. [15]
- ఈ గ్రామంలో స్థానిక నృసింహస్వామి దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్.ఎం.ఆర్ క్లినిక్ ను దసరా పండుగ సందర్భంగా 14-10-2013న ప్రారంభించారు. జి.కొండూరులో ఇప్పటివరకూ, అర్హత గలిగిన వైద్యులు లేని కొరత తీరినట్లైనది. [3]
- ఓం శాంతి మానసిక వికాసకేంద్రం:- ఈ కేంద్రం స్థానిక కొత్తూరు రహదారిపై ఉంది.
- పశువైద్యశాల.
బ్యాంకులు[మార్చు]
- కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (K.D.C.C.Bank)
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 0866/2802226.
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్:- స్థానిక పాల కేంద్రం సమీపంలో గడ్డమణుగు రహదారిలో, ఈ బ్యాంక్ శాఖ కార్యాలయాన్ని, 2015,సెప్టెంబరు-30వ తేదీనాడు ప్రారంభించారు. [10]
మీ-సేవా కేంద్రం[మార్చు]
గ్రామంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ శాఖా కార్యాలయానికి ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన సి.ఎస్.సి.మీ-సేవాకేంద్రాన్ని, 2015,అక్టోబరు-15వ తేదీనాడు ప్రారంభించారు. గ్రామంలో ఇంతకు ముందు రెండు మీ-సేవా కేంద్రాలు పనిచేయుచుండగా, ఇది మూడవ కేంద్రం. [12]
మన రైతు బజార్[మార్చు]
స్థానిక గడ్డమణుగు రహదారిలో 2016,జనవరి-1వ తేదీనాడు, మన రైతుబజార్ ను ప్రారంభించారు. [14]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
- స్థానిక నరసింహస్వామి గుట్ట సమీపంలోని చెరువు.
గ్రామ పంచాయతీ[మార్చు]
ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి పజ్జూరి అంజన సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం[మార్చు]
గ్రామంలో నూతనంగా నిర్మించుచున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేస్తున్నారు. [4]
శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం[మార్చు]
ఈ 2 ఆలయాల 14వ వార్షికోత్సవ వేడుకలను, 2016,మే-18వ తేదీ బుధవారం నుండి నాలుగు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. [16]
శ్రీ కోదండరామాలయం[మార్చు]
స్థానిక నూజివీడు రహదారిలోని ఈ ఆలయంలో, 2014,డిసెంబరు14, ఆదివారం నాడు, సామూహిక అనఘాష్టమి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అలంకరణలతోపాటు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [8]
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]
స్థానిక ప్రధాన కూడలిలో జాతీయ రహదారి ప్రక్కన, పంచాయతీ కార్యాలయం ప్రక్కనే, నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో, శిఖర, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,జూన్-16, సోమవారం నాడు, అంకురార్పణ, వాస్తుపూజ, హోమం నిర్వహించారు. మంగళవారం ఉదయం, పంచగవ్యారాధన, పంచగవ్యాప్రాసన, క్షీరాధివాసం, జలాధివాసం, ఆదివాస హోమాది ప్రధాన హోమాలు, గ్రామ బలిహరణ, గ్రామోత్సవం, శాంతిహోమం నిర్వహించారు. బుధవారం ఉదయం పూజాదికాలు నిర్వహించి 11-12 గంటలకు స్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, అనంతరం శాంతికల్యాణం, తీర్ధప్రసాదాల పంపిణీ చేసారు. శిఖరనిర్మాణం పూర్తి అయిన తరువాత, ఈ ఆలయంలో 2014, అక్టోబరు-1, బుధవారం నాడు, శిఖర, బ్రహ్మకపాల పూజలు నిర్వహించారు. బ్రహ్మకపాల పూజలలో భాగంగా, అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు, శిఖర రంధ్రాలలో నవధాన్యాలు, పూర్ణాలు వేసి పూజలు నిర్వహించారు. [5],[6]&[7]
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]
- స్థానిక నృసింహస్వామి గుట్టపై నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ధ్వజస్తంభ, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మే నెల-2వ తేదీ శనివారం ఉదయం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం, స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన, స్వామివారి ప్రసాదంగా భావించే అన్నదాన కార్యక్రమానికి, భక్తులు, వేలసంఖ్యలో పాల్గొన్నారు. [9]
- ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని 2016,మే-19వ తేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. [16]
- ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా ఈ ఆలయంలోని స్వామివారికి విశేషపూజలు, అభిషేకాలు నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించెదరు. [17]
- ఈ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అభయాంజనేయస్వామివారల ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వాయు శివలింగ, నవగ్రహాల విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని 2017,ఆగష్టు-17వఫేదీ గురువారంనాడు నిర్వహించెదరు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసెదరు. [19]
శ్రీ సిద్ది, బుద్ధి సమేత శ్రీ వినాయకస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయం, స్థానిక ఆత్కూరు క్రాస్ సమీపంలో ఉంది.
శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]
ఈ గ్రామం గ్రామంలోని నరసింహస్వామి గుట్టకు సమీపంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణ పనులు జరుగుచున్నవి. [18]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
జి.కొండూరు గ్రామానికి చెందిన ఒక సామాన్య కుటుంబానికి చెందిన శ్రీ మందా రాజానందకుమార్, కాకినాడలోని జె.ఎన్.టి.యూ.లో 1994లో బి.టెక్.పూర్తిచేసి, 1995లో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన "మెకాన్ లిమిటెడ్"లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆ సంస్థలో రాంచీలో అసిస్టెంట్ జెనరల్ మేనేజరుగా పనిచేయుచున్న ఆయన ఇటీవల జాతీయస్థాయిలో డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య-2015 పురస్కారం అందుకున్నారు. ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ వారు 2015,డిసెంబరు-18న అసోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ లో వీరికి, ఈ పురస్కారాన్నీ, స్వర్ణ పతకాన్నీ అందజేసినారు. [13]
గ్రామాలు[మార్చు]
- ఆతుకూరు (జి. కొండూరు)
- భీమవరప్పాడు
- చెగిరెడ్డిపాడు
- చెరువు మాధవరం
- చెవుటూరు
- దుగ్గిరాలపాడు
- గడ్డమనుగు
- గంగినేనిపాలెం
- గుర్రాజుపాలెం
- హవేలి ముత్యాలంపాడు
- కట్టుబడిపాలెం
- కదింపోరవరం
- కవులూరు
- కోడూరు
- కందులపాడు
- జి.కొండూరు
- కుంటముక్కల
- లోయ
- మునగపాడు
- నందిగామ
- నరసయగూడెం
- పెట్రంపాడు
- పినపాక
- సున్నంపాడు
- తెల్లదేవరపాడు
- వెలగలేరు
- వెల్లటూరు
- వెంకటాపురం
జనాభా[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు :[2]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అతుకూరు | 366 | 1,385 | 707 | 678 |
2. | భీమవరప్పాడు | 202 | 837 | 426 | 411 |
3. | చెగిరెడ్డిపాడు | 158 | 556 | 283 | 273 |
4. | చెరువు మాధవరం | 406 | 1,725 | 840 | 885 |
5. | చెవుటూరు | 740 | 2,829 | 1,423 | 1,406 |
6. | దుగ్గిరాలపాడు | 245 | 1,072 | 542 | 530 |
7. | గడ్డమణుగు | 450 | 1,780 | 896 | 884 |
8. | గంగినేనిపాలెం | 603 | 2,566 | 1,269 | 1,297 |
9. | గుర్రాజుపాలెం | 209 | 863 | 432 | 431 |
10. | హవేలి ముత్యాలంపాడు | 333 | 1,381 | 718 | 663 |
11. | కొండులపాడు | 281 | 1,047 | 540 | 507 |
12. | కవులూరు | 1,738 | 7,155 | 3,702 | 3,453 |
13. | కోడూరు | 911 | 3,682 | 1,865 | 1,817 |
14. | జి.కొండూరు | 1,666 | 6,931 | 3,583 | 3,348 |
15. | కుంతముక్కాల | 704 | 3,462 | 1,484 | 1,978 |
16. | మునగపాడు | 313 | 1,390 | 685 | 705 |
17. | నందిగామ | 312 | 1,252 | 658 | 594 |
18. | పినపాక | 323 | 1,413 | 711 | 702 |
19. | సున్నంపాడు | 188 | 754 | 376 | 378 |
20. | తెల్లదేవరపాడు | 158 | 549 | 270 | 279 |
21. | వెలగలేరు | 1,243 | 4,975 | 2,523 | 2,452 |
22. | వెల్లటూరు | 1,054 | 4,455 | 2,269 | 2,186 |
23. | వెంకటాపురం | 366 | 1,440 | 732 | 708 |
గణాంకాలు[మార్చు]
- జనాభా (2001) - మొత్తం 6,931 - పురుషుల సంఖ్య 3,583 - స్త్రీల సంఖ్య 3,348 - గృహాల సంఖ్య 1,666
వనరులు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/G.konduru/G-Konduru". Retrieved 14 June 2016. External link in
|title=
(help) - ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-03.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,ఆగస్టు-6; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,అక్టోబరు-16; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జనవరి-26; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-17; 2వ పేజీ. [6] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-19; 2వపేజీ. [7] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,అక్టోబరు-2; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,డిసెంబరు-15; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,మే-3; 35వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-1; 28వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-6; 27వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-16; 29వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-28; 28వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2016,జనవరి-2; 28వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-2; 28వఫేజీ. [16] ఈనాడు అమరావతి/మైలవరం; 2016,మే-23; 3వపేజీ. [17] ఈనాడు అమరావతి/మైలవరం; 2016,మే-30; 2వపేజీ. [18] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఫిబ్రవరి-27; 2వఫేజీ. [19] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఆగస్టు-14; 2వపేజీ.