తంత్ర శాస్త్రం

వికీపీడియా నుండి
(తంత్ర శాస్త్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తంత్ర శాస్త్రము శక్తి ఉపాసన శాస్త్రము. యొక్క ముఖ్య గమ్యము జీవబ్రహ్మైక్యం. ఉపనిషత్తులు సిద్ధంతమే ఇది.కాని ఉపనిషత్తులు ఎక్కువగా జ్ఞానమును ఆధారం చేసుకున్నవి. శక్తిని ఆధారం చేసుకున్నవి తంత్ర శాస్త్రములు. ఆత్మ జ్ఞాన గ్రంథాలు రహస్య గ్రంథాలన్నారు పెద్దలు.కనుక తంత్ర శాస్త్రమును రహస్య భాషలో వ్రాసారు.ఈభాషను సంధ్యా భాష అంటారు. సంధ్య వేళయందు చీకటి, వెలుగులు రెండున్నట్లు, సంధ్యా భాషకు రెండర్ధాలున్నవి.తెలిసిన వారు చదివితే ఒక అర్ధం, తెలియని వారు చదివితే వేరొక అర్ధం. మహానిర్వాణ తంత్ర శాస్త్రమును పరమేశ్వరుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్పాడు.అని కొందరు అంటారు.వేదములు స్త్రీ శూద్రులు వేదకర్మలను ఆదరించకూడదని బహిష్కించినవి.దీనివల్ల కలియుగంలో స్త్రీ శూద్రులు తంత్ర శాస్త్రమును ఆశ్రయించినట్లు తెలుస్తున్నది.

తంత్రము -క్రాంతములు[మార్చు]

తంత్ర శాస్త్రము సాధనా గ్రంథము. త్రంత్రమునకు ఉపాయము అని కూడా అర్ధమున్నది. దీని యందు ముఖ్య విషయములను వేదములనుండే తంత్ర శాస్త్రము తీసుకున్నది.ఆ తీసుకున్నదానిని విశదపరిచి వ్రాసింది. తను అనగా విస్తరించుట. తనువిస్తారే. త్ర అనగా తరింప జేయు జ్ఞానము.తరింపజేయు జ్ఞానమును విస్తరించి చెప్పినది తంత్ర శాస్త్రము.తంత్ర శాస్త్రములో శక్తి (స్త్రీ) ఆరాధ్యముఖ్యము. శ్రీ పూజ వేదములలో శ్రీసూక్తం మొదలైన వాటిలలో ఉంది. గాయత్రి కూడా స్త్రీయే.యజ్ఞములందు పశుబలులు, సోమపానములున్నవి. తంత్ర శాస్త్రములు దేశాచారములను అనుసరించి అనేక రూపాలుగా ఉన్నాయి. ఈసంప్రదాయములు కల ప్రాంతములను క్రాంతములందురు.వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమిని రాధాక్రాంతమంటారు.ఇక్కడ కాశ్మీరి సంప్రదాయం ఉంది.తూర్పున ఉన్న ప్రాంతమును విష్ణు క్రాంతము అంటారు.ఇక్కడ గౌడ (వంగ) సంప్రదాయం ఉంది. దక్షిణ దేశమును అశ్వ క్రాంతమందురు. ఇక్కడ కేరళ సంప్రదాయం ఉంది.ఎవరి ఆచారవ్యవహారములను అనుసరించి ఆసాధనలు ప్రబలివి.వంగీయులు మత్స్య మాంస ప్రియులు-వీరు వాటిని విశేషముగా ఉపయోగించిరి.

విధానములు-సాధనలు-భావనలు[మార్చు]

తంత్ర పూజలు 5 విధానములు.ఇవి ఒక్కొక్క శక్తికి 5 రూపాలు.

  • 1 సూర్య
  • 2 గణపతి
  • 3 విష్ణు
  • 4 శివ
  • 5 శక్తి

సాధనలు- సాధకుని భావము-చతురతననుసరించి 4 విధానములు.

  • 1 పూజ
  • *2 జపం
  • *3 ధ్యానము
  • *4 బ్రహ్మత్వం.

సాధకుని భావనము 3.

  • 1 పశుభావం- లజ్జా మోహకామక్రోధాదులనే పాశములతో కట్టుబడి ఉన్నాయి. పశ్వాచారులు.
  • 2 వీరభావం- పశుబంధమును తెంచుకొని, జితేంద్రియుడైనవానిని వీరాచార్యులంటారు.
  • 3 దివ్యభావం- బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వానిని దివ్యాచార్యుడంటారు.

కులార్ణవ తంత్రము 7 రకాల ఆచారములను చెప్పింది. (1) - వేదాచారం- ఇది ఆచారములకు స్థూల దేహం వంటిది.బహిఃపూజలు చేయువిధానమిది.ఇది క్రియా మార్గము. (2) - వైష్ణవాచారము - ఇది భక్తి యోగము, హృదయ సాధన. (3) - శావాచారము - జపయోగము. (4) - దక్షిణాచారము - వీరు దక్షిణకాళికను పూజింతురు.వీరు గాయత్రిని ఉపాసింతురు. (5) - వామాచారము - గురువు వల్ల తంత్ర దీక్ష పొదాక దక్షిణాచార్యులు వామనాచార్యులగుదురు.వీరు వామనుని పూజింతురు.స్త్రీ వామపార్స్వంలో ఉండు. (6) - సిద్ధాంతాచారము - లజ్జాభయమోహములు వీరికి ఉండవు.వీరు శ్మశానంలో ఉందురు.యోగరహస్యములు తెలుసుకుంటు ఉందురు.అష్టాంగయోగమును సాధించి తురీయాచారమైన కాలాచారమునకు అర్హత పొందుతారు. (7) - కాలాచారము - ఇది భాక్మీభావం.ఇతనికి శాత్రువులు, మిత్రులు, లాభనష్టాలు అనేభావాలు ఉండవు. అన్నీ సమానమే.ఏకాంతంగా శ్మశానభూములందు ఉంటు నిర్వికల్పసమాధిస్థితిలో ఉందురు. ఇదే చివరి దశ.

యంత్ర, మంత్ర రహస్యాలు[మార్చు]

తంత్ర సిద్ధికి సాధనలు మంత్రయంత్ర పూజలు (బహిర్ముఖమైనవి), హఠ, రాజయోగములు (అంతఃముఖమైనవి).మంత్రయంత్రములు శక్తిసమంవితములైనవి.మత్రము శబ్దబ్రహ్మమునుండి పుట్టింది.కనుక మంత్రము బ్రహ్మ శక్తి. దీనివల్ల అంతఃసాధనయైన కుండలినీశక్తి కలుగుతుంది.

మత్రము శబ్ద శక్తి. యంత్రము చిత్ర శక్తి. యంత్రము శరీరము. మత్రము ప్రాణము.యంత్రమందు మంత్రం చేర్చినప్పుడు జీవం కలదౌను.కామక్రోధాధులను నియంత్రణ చేయునది యంత్రము.మనన చేత తరింప జేయునది మంత్రము.యంత్ర మంత్రములు రెండును రహస్యముగా ఉంచదగినవే.యంత్రము సాంకేతిక శక్తి.శివునికి గాని, శక్తికిగాని త్రికోణము యాంత్రిక సంకేతము, 3 గీతలు ఒక్క ఆకారంగాచేసిన త్రికోణము.ఒక్క రూపంలో 3 వస్తువులున్నవి.ఒకడే 3 ఆకారములుగా ఉంది.అందుకే త్రికోణము ఆదిశక్తికి గాని, ఆది శంభునికి గాని సంకేతమైన యంత్రము.

శక్తి సమస్త ప్రపంచమునకు ఉత్పత్తి చేయుయోని.రెండు త్రికోణాకారాములను శివశక్తుల సంయోగముగా పరిగణింతురు.ప్రపంచ శబ్దములో, ప్ర అనగా వికసించుట పంచ అనగా 5 భూతములు.దీని అర్ధం పంచభూతముల వికాసమే ప్రపంచము.బీజమైన బిందువునకు శివశక్తుల సంయోగము ప్రధానకారణము.

ఆది శివుని సంకేతమైన త్రికోణాకారము మీద శాక్తి సంకేతమైన త్రికోణాకారమును తలక్రిందులుగా ఉంచెదరు.ఇప్పుడు శక్తిసంకేతమైన రెండు త్రికోణాకారములు యోని అంటారు.ఇదే సృష్టి క్రీడ. తంత్ర శాస్త్రము దీనిని సదాశివ అంటుంది.మంత్ర శాస్త్రము రంభం అంటుంది.

తంత్ర శాస్త్రము ప్రకారము బ్రహ్మకు రెండు కళలు. (1) సా కళ (2) నిష్కళ. బ్రహ్మ మూల ప్రకృతిలో కలిసినప్పుడు సాకళ అప్పుడు ప్రకృతి గర్భమందు బీజోత్పత్తియౌను, అప్పుడు ఒక స్పందనం ఏర్పడును.ఈ స్పందనమే నాదం.నాదం నుండి బిందువు ఏర్పడును.నాదమునకు సంకేతము వంటి బాలచంద్రాకారము.

కలవక ఉన్నప్పుడు నిష్కళ.

ఆదియందు పరమేశ్వరుడు ఒక్కొక్క కామ్యమునకు ఒక్కొక్క తంత్ర శాస్త్రం చొప్పున 64 తంత్ర శాస్త్రములను చెప్పాడు.కామ్యములన్నింటిని పొందుటకు 64 తంత్రములను పూజించవలసివచ్చింది.ఇది కష్టమైన కార్యము.కనుక పరమేశ్వరుని సులభమార్గం చూపించమని ప్రార్థించారు.దీని పర్యవసానంగా పరమేశ్వరుడు శ్రీ విద్యోపాసనను ప్రసాదించాడు.శృఈ విద్యోపాసనలో 12 సంప్రదాయములున్నవి.

పలువురు తంత్ర శాస్త్ర ఉపాసకులు[మార్చు]

మూలము[మార్చు]

  • 1960 భారతి మాస పత్రిక.