దశరాజుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దశరాజుపల్లె ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఒంగోలు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 182. Edit this on Wikidata


గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం, ఒంగోలు పట్టణానికి 5కి.మీ. దూరంలో ఉంది. గ్రామ జనాభా=750.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పాలేటి శ్రీనివాసులు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలో, 2014, జూన్-15వ తేదీ ఆదివారం నాడు, అంకమ్మ తల్లి కొలువులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక వాహనంపై అలంకరించి గ్రామోత్సవం, భక్తులు పొంగళ్ళు పెట్టి, మొక్కులు తీర్చుకున్నారు. దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు.

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి విగ్రహం[మార్చు]

ఒంగోలు మండలం, దశరాజుపల్లె రహదారిలోని అప్పాయికుంట వద్ద ఏర్పాటుచేసిన ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మే నెల-6వ తేదీ బుధవారంనాడు, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంతోపాటు, పరిసర ప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా పదివేలమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ విగ్రహ ఏర్పాటుకు తె.దే.పా సీనియర్ నాయకులు శ్రీ కరణం బలరామకృష్నమూర్తి సహకారం అందించారు.

క్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 45 రోజులు అయిన సందర్భంగా, 2015, జూన్-17వ తేదీ బుధవారంనాడు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మండలపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మపాలెం గ్రామంతోపాటు దశరాజుపల్లె గ్రామం నుండి గూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవరంనాడు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ, శ్రీ రాములవారు, సీతాదేవి, లక్ష్మణస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. తొలుత ధ్వజశిఖరంపై కలశ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దశరాజుపల్లె గ్రామవాసులేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

గ్రామ విశేషాలు[మార్చు]

2014, మే నెల 7న లోక్ సభకూ, శాసనసభకూ జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, ఈ గ్రామంలో 92.76 శాతం ఓటర్లు, తమ ఓటు హక్కు వినియోగించుకొని, తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు. గ్రామంలో ఉన్న 539 మంది ఓటర్లలో 500 మంది ఆ రోజున, తమ ఓటు వేసినారు. ఈ గ్రామంలో ఎక్కువమంది ఉపాధికోసం హైదరాబాదు, బెంగుళూరు వంటి నగరాలకు వలస వెళ్ళినారు. వీరందరూ ఎక్కడ ఉన్నా, ఎన్నికలకు ఈ గ్రామానికి తరలి వచ్చి, తమ ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]