దిలీప్ సింగ్ భూరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిలీప్ సింగ్ భూరియా

ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్
పదవీ కాలం
2002-2004

పదవీ కాలం
1980 - 1998
నియోజకవర్గం రత్లాం

వ్యక్తిగత వివరాలు

జననం 18 జూన్ 1944
మరణం 2015 జూన్ 24(2015-06-24) (వయసు 71)
గుర్గావ్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
మూలం [1]

దిలీప్ సింగ్ భూరియా (18 జూన్ 1944 - 24 జూన్ 2015) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రత్లాం నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దిలీప్ సింగ్ భూరియా కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1972లో పెట్‌లావాడ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1980లో తొలిసారి రత్లాం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 1996 వరకు వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1998లో ఓడిపోయి 2014లో తిరిగి లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు. దిలీప్ సింగ్ భూరియా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 2002 నుండి 2004 వరకు జాతీయ ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.

మరణం

[మార్చు]

దిలీప్ సింగ్ భూరియా 2015 జూన్ 25న గుర్గావ్‌లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (24 June 2015). "BJP MP Dileep Singh Bhuria, 71, is dead". Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.
  2. The Hindu (24 June 2015). "BJP MP Dileep Bhuria passes away" (in Indian English). Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.