దుర్భా సుబ్రహ్మణ్యశర్మ
Jump to navigation
Jump to search
దుర్భా సుబ్రహ్మణ్యశర్మ నెల్లూరుకు చెందిన పండితుడు. ఇతడు 1875, అక్టోబరు 1న జన్మించాడు. నెల్లూరులోని వి.ఆర్.కాలేజీలో ప్రధానాంధ్ర పండితుడిగా పనిచేశాడు. ఇతని శిష్యులలో వేపకొమ్మ ఆదిశేషయ్య, చలినురుగు కామయ్య, కొలకుల నారాయణరావు, దుర్భా రామమూర్తి, భట్టారం మల్లికార్జున, షేక్ దావూద్ మొదలైనవారు ఎన్నదగినవారు. ఇతడు 1956, మే 11వ తేదీన మరణించాడు[1].
రచనలు[మార్చు]
ఇతడు దాదాపు 25 కావ్యాలను ఆంధ్రీకరించాడు.
- లక్ష్మీ శృంగార కుసుమమంజరి (అనువాదం)
- అభినవ సుమతి శతకము
- సౌందర్యలహరి (అనువాదం)
- భరతుడు
- శంకరాచార్య చరిత్రము[2]
- ఆంధ్ర అభిజ్ఞానశాకుంతలము[3]
- దీనచింతామణి
- వివేకచూడామణి (అనువాదం)
- సుమనస్మృతి
బిరుదములు[మార్చు]
- మహోపాధ్యాయ
- సాహిత్యస్థాపక
- అభినవ తిక్కన
మూలాలు[మార్చు]
- ↑ అలనాటి నెల్లూరు - ఈతకోట సుబ్బారావు - పేజీలు 249-250
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి