నల్లపాడు (గ్రామీణ)
నల్లపాడు (గ్రామీణ) | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°18′31″N 80°22′17″E / 16.308554°N 80.371433°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | గుంటూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 9,820 |
- పురుషుల సంఖ్య | 5,229 |
- స్త్రీల సంఖ్య | 4,591 |
- గృహాల సంఖ్య | 2,438 |
పిన్ కోడ్ | 522005 |
ఎస్.టి.డి కోడ్ |
నల్లపాడు, గుంటూరు జిల్లా, గుంటూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన గుంటూరు నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2438 ఇళ్లతో, 9820 జనాభాతో 1643 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5229, ఆడవారి సంఖ్య 4591. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2677 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 83. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590242[1]ఈ గ్రామం గుంటూరుకు సుమారు 3 మైళ్ళ దూరంలో ఉంది.
గ్రామ చరిత్ర[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది.
విలీన గ్రామాలు[మార్చు]
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అడవితక్కెళ్ళపాడు, అక్కిరెడ్డిపాలెం, గోరంట్ల, చోడవరం, ఏటుకూరు, నల్లపాడు, పెదకాకాని, పెదపలకలూరు, పోతూరు మొత్తం పది గ్రామాలు విలీనమయ్యాయి.[3]
విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.
వైద్య సౌకర్యం[మార్చు]
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
నల్లపాడు (గ్రా)లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.
ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]
గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు[మార్చు]
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం[మార్చు]
గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]
నల్లపాడు (గ్రా)లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]
గ్రామంలో వాణిజ్య బ్యాంకు (ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్) ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు[మార్చు]
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం[మార్చు]
నల్లపాడు (గ్రా)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1146 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 4 హెక్టార్లు
- బంజరు భూమి: 101 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 392 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 456 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 37 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]
నల్లపాడు (గ్రా)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 37 హెక్టార్లు
ఉత్పత్తి[మార్చు]
నల్లపాడు (గ్రా)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు[మార్చు]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. అగస్త్స్యమహాముని ఇక్కడ శివలింగాన్ని పాలరాతితో ప్రతిష్ఠించినారని చెబుచుంటారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో విశేషపూజలు, అభిషేకాలు నిర్వహించెదరు. ఫాల్గుణ పౌర్ణమి నాడు, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు.
శ్రీ ధర్మశాస్త్ర (అయ్యప్పస్వామివారి) ఆలయం[మార్చు]
ఈ ఆలయాన్ని, గుంటూరు నగర శివారులోని నల్లపాడు గ్రామంలోని వంకాయలపాడు కాలువ సమీపంలో, సుమారు మూడున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల లోని అయ్యప్పస్వామి ఆలయ నమూనాతోనే ఈ అలయంగూడా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి అయ్యప్పస్వామి భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు సమకూర్చారు. అయ్యప్ప దర్శనం కోసం దీక్షాధారులు ఎక్కే మెట్లను, ఏకశిలతో తయారుచేయటం ఇక్కడి విశేషం. దేవాలయం ముందున్న కాలువను, "పంబ"గా నామకరణం చేసారు. ఆలయం చూడగనే వెనుకనున్న కొండలు, శబరిమలను పోలియున్నవిగా భావించెదరు. ఈ ఆలయప్రాంగణంలో లక్ష్మీగణపతి, శివలింగాలను ప్రతిష్ఠించారు. శబరిమల తంత్రివరేణ్యులు రాజీవరు ఆధ్వర్యంలో కొన్నిరోజులుగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించుచున్నారు.ఈ ఆలయంలో ఏడురోజులపాటు నిర్వహించే విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2015జూన్-5వ తేదీ శుక్రవారంనుండి ప్రారంభమయినవి. 6వ తేదీ శనివారం ఉదయం గణపతిపూజ, శాంతిహోమం, గోపూజసాయంత్రం స్వశాంతిహోమం నిర్వహించారు. 7వ తేదీ ఆదివారంనాడు, విశేషపూజలు నిర్వహించారు. గణపతి హోమం, స్వశాంతిహోమంతోపాటు, జలాధివాసం తదితర పూజలు నిర్వహించారు. 8వ తేదీ సోమవారంనాడు గణపతిపూజ, అద్భుత శాంతి హోమం, విష్ణుపూజ, భగవతి సేవ తదితరపూజలు నిర్వహించారు. 9వ తేదీ మంగళవారంనాడు, మృత్యుంజహోమం, శాంతిహోమం నిర్వహించారు. 10వ తెదీ బుధవారంనాడు గణపతిహోమం, సుకృతహోమం, ఆదివాస హోమం, అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చివరిరోజు, 11వ తేదీ గురువారం ఉదయం 8-03 గంటలనుండి 10-15 గంటల నడుమ విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. అయ్యప్పస్వామి విగ్రహంతోపాటు, జీవధ్వజస్తంభం, ఉప దేవతల విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. శబరిమల తంత్రివరేణ్యులు రాజీవరు, ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పూజాఫలం అందించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు, వెంగళాయపాలెం, శ్రీనివాసకాలనీ, నల్లపడు, తురకపలెం, పేరేచర్ల తదితర ప్రాంతాలనుండి గూడా విచ్చేసారు.
తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
గుంటూరు నగరశివారు నల్లపాడు కాలువ సమీపంలోని ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016,మార్చి-1వ తేదీ మంగళవారంనాడు, లక్ష విష్ణుసహస్రనామ పారాయణ, మూలమంత్ర హోమాలు, ఊంజల్ సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3వ తేదీ గురువారం ఉదయం 8,9 గంటల మధ్య, ఆండాళమ్మ, పద్మావతి, జీవ, ధ్వజస్తంభం, రామానుజాచార్యులు, జయవిజయుల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణం నయనానందకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఐదు రోజులపాటు ప్రతేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ చతుర్దశినాడు వైబవంగా నిర్వహించెదరు. పౌర్ణమి నాడు స్వామివారి రథోత్సవం, భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
ఈ గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు మిరపకాయల యార్డు మీద ఆధారపడి జీవిస్తున్నారు.
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,599. ఇందులో పురుషుల సంఖ్య 3,872, స్త్రీల సంఖ్య 3,727, గ్రామంలో నివాస గృహాలు 1,834 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,643 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
- ↑ "Guntur Corporation Town Planning G.O." (PDF). Guntur Municipal Corporation. Retrieved 22 August 2016.