నింబార్కుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉఖ్ర మహంత ఆస్థల్ (పశ్చిమ బెంగాల్) లోని ఆచార్య సన్నిధిలో నింబార్కాచార్య

బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసిన మహామహులలో మరొక ప్రముఖుడు నింబార్కుడు. నింబార్కాచార్య, నింబార్క, నింబాదిత్య లేదా నియమానంద అని కూడా పిలుస్తారు, ఇతను ఒక హిందూ తత్వవేత్త, వేదాంతవేత్త, ద్వైతాద్వైత (ద్వైత-అద్వైత) లేదా ద్వంద్వ-ద్వైతం యొక్క వేదాంతానికి ప్రధాన ప్రతిపాదకుడు. అతను దైవ జంట రాధ, కృష్ణుల ఆరాధనను వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు, హిందూ శాఖ వైష్ణవ మతం యొక్క నాలుగు ప్రధాన సంప్రదాయాలలో ఒకటైన నింబర్క సంప్రదాయాన్ని స్థాపించాడు.

కాలం, జన్మస్థలం[మార్చు]

ఇతని జన్మస్థానం ఇథమిత్తంగా తెలియకపోయినా బళ్ళారిలోని నింబ గ్రామమనీ అందుకే ఇతనికి నింబార్కుడని పేరు వచ్చిందనీ అంటారు. మరొక ఊహ ప్రకారం ఇతనిది గోదావరీ తీరప్రాంతం. ఇతని జనన కాలంకూడా కచ్చితంగా తెలియదు. 11వ శతాబ్దం వాడని ఒక వాదమైతే 13వ శతాబ్దమని మరికొందరి లెక్క. ఇతడి తల్లిదండ్రులు జగన్నాథుడు, సరస్వతి.నింబార్క దాదాపు 11వ, 12వ శతాబ్దాల కాలంలో జీవించాడని నమ్ముతారు, అయితే మరికొందరు అతను 6వ లేదా 7వ శతాబ్దం CEలో శంకరాచార్య కంటే కొంత ముందు జీవించాడని సూచిస్తున్నారు. ఇతను దక్షిణ భారతదేశంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు, అతను తన జీవితంలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గడిపాడు.

'నింబార్క' (निंबार्क) అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది నింబ (निम्ब), అర్క (అర్క). నింబార్కకు అతని పుట్టినప్పుడు 'నియమానంద' అనే పేరు పెట్టబడిందని నమ్ముతారు. ఒక జానపద కథ ప్రకారం, నియమానందకు నింబార్క అనే పేరు వచ్చింది, ఎందుకంటే అతను వేప (నింబా) ఆకులలో సూర్యరశ్మి (అర్కా) యొక్క కొన్ని కిరణాలను బంధించాడు. అతని అనుచరులు అతన్ని నింబాదిత్య అని కూడా పిలుస్తారు. నింబార్కను తత్వవేత్త భాస్కరతో గుర్తించడం వల్ల కొన్నిసార్లు భాస్కరుడు అతని సారాంశంగా కూడా పరిగణించబడ్డాడు. అతను స్థాపించిన సంప్రదాయానికి అతని పేరు పెట్టారు.

వీరిది వైష్ణవసాంప్రదాయంలోని సనక సాంప్రదాయం. అనగా సనక మహర్షి నెలకొల్పిన సంప్రదాయం. వేదాంతపరంగా ఇతనిది ద్వైతాద్వైతం. దీనినే భేదాభేదవాదం అని కూడా అంటారు.

రచనలు[మార్చు]

బ్రహ్మసూత్రాలకు నింబార్కుడు వ్రాసిన భాష్యం పేరు "వేదాంత పారిజాత సౌరభం". దీనిని అర్థం చేసుకోవటానికి ఆయన శిష్యుడైన శ్రీనివాసాచార్యుడు "వేదాంత కౌస్తుభం" అనే వ్యాఖ్యానం వ్రాయవలసి వచ్చింది. దీనిని మరింత సుబోధకం చేయటానికి కేశవ కాశ్మీరీభట్టు "వేదాంత కౌస్తుభ ప్రభ" అనే మరొక వ్యాఖ్యాన గ్రంథం వ్రాసాడు.

భేదాభేదవాదం[మార్చు]

బ్రహ్మము తాను సృజించిన జీవునికంటే వేరు కాడు. బ్రహ్మము అంశి. జీవుడు అంశం. అలాగే జగత్తు కూడా. అది బ్రహ్మం కంటే వేరు కాదు. సూర్యుని కాంతి కిరణాలు సూర్యుని కంటే ఎలా వేరు కావో అలాగే బ్రహ్మము కంటే జీవులు, జగత్తు వేరు కావు. బ్రహ్మానికి, వాటికి అభేదం ఉంది. అదే సమయంలో బ్రహ్మానికి, జీవజగత్తులకు భేదం కూడా ఉంది. సూర్యునికి, సూర్య కిరణాలకూ తేడా ఉంది. బ్రహ్మము స్వతంత్ర తత్త్వం. జీవజగత్తులు పరతంత్ర తత్త్వాలు. సూర్య కిరణాలమీద సూర్యుడు ఆధారపడి లేడు. సూర్యకిరణాలే సూర్యుడిమీద ఆధారపడి ఉన్నాయి. సూర్యుడు లేకపోతే సూర్యకిరణాలు లేవు. అలాగే బ్రహ్మముమీద జీవజగత్తులు ఆధారపడి ఉన్నాయి. బ్రహ్మము లేకపోతే అవి లేవు.

ఈవిధంగా ఒకే సమయంలో భేదం, అభేదం; ద్వైతం, అద్వైతం ఉండటంవలన ఈ సిద్ధాంతానికి భేదాభేదవాదమనీ, ద్వైతాద్వైతమని పేరు వచ్చింది.

బయటి లింకులు[మార్చు]