పచ్చా మధు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పచ్చా మధు
మరణం2016 డిసెంబరు 08
వృత్తిఛాయాగ్రాహకుడు

పచ్చా మధు ఒక ప్రముఖ ఛాయాగ్రాహకుడు. చాలా ఏళ్ళుగా పలు టి.వి కార్యక్రమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (డి. ఓ. పి) గా పనిచేశాడు.[1] ముఖ్యంగా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ లాంటి ప్రజాదరణ పొందిన అనేక కార్యక్రమాలకు డి.ఓ.పిగా పనిచేశాడు.[2] ఎ ఫిల్మ్ బై అరవింద్ అనే ఒక థ్రిల్లర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కూడా నటించాడు.

టివి కార్యక్రమాలు[మార్చు]

ఈటివి, మాటీవీ, జెమిని టి.వి లాంటి ప్రముఖ ఛానళ్ళలో ప్రజాదరణ పొందిన కార్యక్రమాలకు కెమెరామెన్ గా పనిచేశాడు.[3]

  • జబర్దస్త్
  • జీన్స్
  • క్యాష్
  • మేము సైతం
  • రచ్చబండ
  • బూం బూం
  • లక్ష్మీ టాక్ షో
  • ఆలీతో జాలీగా
  • ఆలీ 369
  • మా మహాలక్ష్మి

మరణం[మార్చు]

తీవ్ర అనారోగ్యంతో 2016 డిసెంబరు 8 న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "కన్నీరు మున్నీరైన యాంకర్ అనసూయ!". tupaki.com. Retrieved 17 October 2017.
  2. "కెమరామెన్ పచ్చా మధు మృతి..." mediawatchlive.com. Retrieved 17 October 2017.[permanent dead link]
  3. "కెమెరామెన్‌ పచ్చా మధుకు సీనీ, టీవీ నటుల నివాళి". navatelangana.com. నవ తెలంగాణా. Retrieved 17 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=పచ్చా_మధు&oldid=2825994" నుండి వెలికితీశారు