పాటిబండ్ల వెంకటపతిరాయలు
పాటిబండ్ల వెంకటపతిరాయలు | |
---|---|
![]() పాటిబండ్ల వెంకటపతిరాయలు చిత్రం | |
జననం | పాటిబండ్ల వెంకటపతిరాయలు 28 డిసెంబరు 1914 కృష్ణాజిల్లా వీరులపాడు గ్రామం |
మరణం | 27-4-2015 నిజామాబాదు |
విద్య | హిందీ భాషా ప్రవీణ |
వృత్తి | హిందీ ఉపాధ్యాయులు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు |
జీవిత భాగస్వామి | అన్నపూర్ణ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | పాటిబండ్ల వెంకటరామయ్య చౌదరి-కవి,పండితుడు |
పాటిబండ్ల వెంకటపతిరాయలు ప్రముఖ కవి, రచయిత. ఈయన ఆంధ్రా గాంధీగా సుప్రసిద్ధులు. ఈయన ఉభయభాషా ప్రవీణుడు. తెలుగు, హిందీ, సంస్కృతంలో ప్రావీణ్యతతో పలు పుస్తకాలు వ్రాసారు.[1] హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసారు.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన 28 డిసెంబర్ 1914లో పాటిబండ్ల కోటయ్య, లక్ష్మిదేవి గార్ల కలల పంటగా కృష్ణాజిల్లా వీరులపాడు గ్రామంలో జన్మించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. అన్న పాటిబండ్ల వెంకటరామయ్య చౌదరి మంచి కవి, పండితుడు. వెంకటపతిరాయల గారి చదువు స్థానికంగా ఉన్న తిలక్ జాతీయ పాఠశాలలో కొనసాగింది. ఆయన సాహిత్య గురువు జంగ హనుంత చౌదరి గారు.సాహిత్యంలో అనేక విషయాలను ఆయనవద్దనే నేర్చుకున్నారు.ఆయన చదువు మధ్యలో అర్థాంతరంగా ఆగిపోయింది.తరువాత హిందీ భాషా ప్రవీణ చదివి హిందీ ఉపాధ్యాయులుగా చేరారు. రాయలగారికి అన్నపూర్ణతో వివాహమైనది. 1972 లో వారు నిజామాబాదులో స్థిరపడ్డారు. ఆయన ఎనిమిది పుస్తకాలను రచించి ప్రచురించాడు. వాటిలో దేశంలో దేవాలయాలు అనే పుస్తకం ప్రముఖమైనది. ఆయన దేశవ్యాప్తంగా కలినడకన 12 సంవత్సరాలపాటు పర్యటించారు[2]
నిరంతర ఖాఖీ ధారణ[మార్చు]
మహాత్మా గాంధీ సహాయనిరాకరణ, స్వదేశీ పిలుపుతో ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. చిన్నప్పటి నుండి ఖాదీ వస్త్రధారణపై మక్కువ ఎక్కువ.పాఠశాలకు కూడా ఖాదీ వస్త్రధారణ చేసేవారు.దేశంలోవివిధ ప్రాంతాలలో పర్యటించినపుడు ఆయనను "ఆంధ్రా గాంధీ" అని పిలిచేవారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆయనకు ఇద్దరు కూమరులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు పి.రామమోహనరావు సీనియర్ డాక్టరు, రాష్ట్ర జనవిజ్ఞాన పరిషత్ కు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు.[2] పెద్ద కోడలు డా జయనీ నెహ్రూ. చిన్న కుమారుడు కోటేశ్వరరావు బొంబాయి ఐ.ఐ.టి చదివాడు. కుమార్తె సరళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.
రచనలు[మార్చు]
- పాటిబండ్ల అక్కయ్య వంశ చరిత్ర.
- మిత్ర ప్రబోధ (432 శతక పద్యాలు)
- ఆలయాలు అచటి విశేషాలు
- నా దక్షిణ భారత యాత్రా విశేషాలు
- నా ఉత్తర భారత యాత్రా విశేషాలు
- నాలో నేను (ఆత్మకథ)
- బుద్ధం శరణం గచ్ఛామి
మరణం[మార్చు]
ఆయన 27-4-2015 న నిజామాబాద్లోలో మరణించారు.
మూలాలు[మార్చు]
- ↑ ప్రముఖ కవి పాలిబండ్ల కన్నుమూత
- ↑ 2.0 2.1 "Patibandla Venkatapathi Rayalu passes away". ది హిందూ. SPECIAL CORRESPONDENT. Retrieved 28 April 2015.
ఇతర లింకులు[మార్చు]
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using residence
- Infobox person using home town
- తెలుగు కవులు
- తెలుగు రచయితలు
- 2015 మరణాలు
- 1914 జననాలు
- గాంధేయవాదులు
- తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు
- ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- కృష్ణా జిల్లా రచయితలు
- కృష్ణా జిల్లా ఉపాధ్యాయులు