పింగళి
స్వరూపం
పింగళి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. వీరు ఆరువేల నియోగులు, కమ్మ వారి లోను గలరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- పింగళి సూరన్న, : ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో ఒకడు.
- పింగళి వెంకయ్య, : స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.
- పింగళి వెంకట రామారెడ్డి, : హైదరాబాదు రాజ్యానికి ఉపప్రధాని. [1][2] అతను పరోపకారి, పారిశ్రామిక వ్యవస్థాపకుడు, [3]అతని కుమార్తె రాణి కుముదినీ దేవి హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక.[4]
- పింగళి నాగేంద్రరావు, : పేరొందిన రచయిత. సినిమా, నాటకాలు, పత్రికల్లో రచనలు చేశాడు.
- పింగళి లక్ష్మీకాంతం, ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందిన లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా,[5] కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు.
- పింగళి దశరధరామ్, అభ్యుదయవాది.
మూలాలు
[మార్చు]- ↑ "Pingle Venkatrama Reddy Memorial - Hyderabad". wikimapia.org (in ఇంగ్లీష్). Retrieved 2024-04-15.
- ↑ "A misfortune for five men". The Times of India. 2008-04-14. ISSN 0971-8257. Retrieved 2024-04-15.
- ↑ "Pingle Venkatrama Reddy Memorial - Hyderabad". wikimapia.org (in ఇంగ్లీష్). Retrieved 2024-04-15.
- ↑ Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ "ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీకాంతం".[permanent dead link]