అంజన

వికీపీడియా నుండి
(పుంజికస్థల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అంజనాదేవి

అంజన వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించెను.

సంబంధిత పురాణ కథలు[మార్చు]

విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత అహల్యకు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అంజన&oldid=3846110" నుండి వెలికితీశారు