పెదరెడ్డిపాలెం
పెదరెడ్డిపాలెం | |
— గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | నరసరావుపేట |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీ జగన్నాధం |
పిన్ కోడ్ | 522601 |
ఎస్.టి.డి కోడ్ |
"పెదరెడ్డిపాలెం" గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన గ్రామం. [1]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 ఆగస్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ జగన్నాధం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ కృష్ణ బృందావనం[మార్చు]
పెదరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీ కశిందుల పూర్ణచంద్రరావు కుమారుడు శ్రీ బసవలింగేశ్వరరావు, వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడినారు. వీరు గ్రామములో దాతల ఆర్ధిక సహకారంతో నిర్మించతలపెట్టిన శ్రీ కృష్ణ బృందావనం ఆలయ నిర్మాణానికై ఒక అర ఎకరం భూమిని విరాళంగా ఇచ్చినారు. అమెరికాలో ఉంటున్న యతి జియ్యర్స్వామి, తన ఆధ్వర్యంలో గ్రామములో ఈ ఆలయం నిర్మించడానికై ఈ గ్రామానికి చేరుకున్నారు. దాతలు కొందరు ఆలయంలో ప్రతిష్ఠించుటకై విగ్రహాలను అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినారు. ఈ ఆలయ నిర్మాణానికై 2017,జులై-27వతేదీ గురువారంనాడు శంకుస్థాపన నిర్వహించెదరు. అంతా అనుకున్నట్లు జరిగితే ఒక సంవత్సరంలో ఆలయ నిర్మాణం పూర్తికాగలదు. ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామములో 2017,జులై-7వతేదీ శుక్రవారం నుండి ప్రతి దినం, సాయంత్రం 7 నుండి 10 గంటల వరకు గ్రామములో భగవద్గీత, భాగవతం, వాల్మీకి రామాయణంలోని శ్లోకాల పఠనం, ప్రవచనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టుచున్నారు. ఇంతకు ముందే స్వామీజీ ఆధ్వర్యంలో అమెరికాలో ఒక రంగనాథస్వామివారి ఆలయం నిర్మించినారు. స్వామీజీ పూర్వాశ్రమంలో, అమెరికాలో 30 సంవత్సరాలపాటు వైద్యరంగంలో పనిచేసినారు. స్వామీజీ ఆధ్వర్యంలో ఇంతకు ముందు అమెరికాలో ఒక రంగనాథస్వామివారి ఆలయం నిర్మించినారు.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]