Jump to content

పెద్దదిన్నె

వికీపీడియా నుండి

పెద్దదిన్నె, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలంలోని గ్రామం.[1]

పెద్దదిన్నె
—  రెవెన్యూ గ్రామం  —
[[Image:
శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, పెద్దదిన్నె
|250px|none|]]
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ
మండలం ఇటిక్యాల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీనివాస్ రెడ్డి
జనాభా (2011)
 - మొత్తం 1,865
 - పురుషుల సంఖ్య 947
 - స్త్రీల సంఖ్య 918
 - గృహాల సంఖ్య 422
పిన్ కోడ్ 509128
ఎస్.టి.డి కోడ్

మండల కేంద్రమైన ఇటిక్యాల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 89 కిలోమీటర్ల దూరాన ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఇది పంచాయతి కేంద్రం.

గ్రామ గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 422 ఇళ్లతో, 1865 జనాభాతో 1599 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 947, ఆడవారి సంఖ్య 918. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 438 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 10. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 576309[3].పిన్ కోడ్: 509128.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు ఇటిక్యాలలో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గద్వాలలోను, ఇంజనీరింగ్ కళాశాల కొండేర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్‌ గద్వాలలోను, మేనేజిమెంటు కళాశాల కొండేర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గద్వాలలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెద్దదిన్నెలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.ఈ గ్రామానికి రైలు సౌకర్యం కూడా ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెద్దదిన్నెలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 23 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 27 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 19 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 430 హెక్టార్లు
  • బంజరు భూమి: 421 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 679 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1513 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 17 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెద్దదిన్నెలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 16 హెక్టార్లు* చెరువులు: 1 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పెద్దదిన్నెలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్న

రాజకీయాలు

[మార్చు]

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యాడు.[4]

ఇతర విశేషాలు

[మార్చు]

ఇక్కడ ఒక పురాతన దేవాలయము ఉంది. ఈ దేవాలయముకు ప్రతి సంవత్సరం పెద్ద జాతర జరుగును.ఈ దేవాలయమునకు 500 ఎకరముల భూమి ఉంది.

శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానము చరిత్ర

[మార్చు]

ఈ గ్రామ జానపద ఐతిహ్యం ప్రకారం, సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఒక గొల్ల భక్తుడు ఉండే వాడట. అతడు గోవుల గాచి జీవించే వాడట అలా ఉండగా ఒకరోజు స్వామి వారు కలలో కనిపించి నేను నీ ఆవుల పాలు త్రాగి జీవిస్తున్నాను. నేను మీ ఊరి పొలిమేరల్లోని కోట్ల బావి దగ్గర భూమిలో ఏ పూజ పునస్కారాలు లేక పడి ఉన్నాను. నన్ను వెలికితీసి గ్రామంలో ప్రతిష్ఠ చేయమని చెప్పారట స్వామి వారు. ఏదైనా గ్రామ ప్రజలకు చెప్పబోతే వెఱ్ఱి గొల్ల వాడు అని హేళన చేసేవారు. అయితే రానురాను అతడి ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఎర్పడటం వలన అతడిపై నమ్మకం కుదిరింది. అలా కొద్ది రోజుల తరువాత గ్రామములోని పెద్దలయిన వెంకోబా గారికి తెలియజేయగా వారు కొందరు గ్రామస్థులు కలిసి ఆ గొల్ల భక్తుని పిలుచుకొని పొలిమేరలోని కోట్ల బావి దగ్గరకు వెళ్ళి ఆ భక్తుడు చూపిన చోట తవ్వి చూడగా దొరికిన ఆ వేంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత గర్భగుడి కట్టించినారు. అలా కొంత కాలం తరువాత గద్వాల సంస్థానాధీశులైన రాజా పెద్ద సోమభాపాల్ దొర గారిని కలిసి సంప్రదించగా వారు ఒప్పుకుని దేవాలయం చుట్టూ ప్రహరీగోడ, ముఖ మంటపం, ఆ ముఖ మంటపంపై ముందు భాగాన ఆ యాదవ భక్తుని రూపం శిలా విగ్రహం చెక్కించి పెట్టడం జరిగింది. అదేవిధంగా ముందు విమాన గోపురం, దాని ముందు రెండు ఎత్తైన శిలా దీపస్తంభాలను మరియు ఒక ద్వజస్తంభాన్నీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా ఆ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య సేవా కైంకర్యానికై సుమారు 480 ఎకరాల ఇనాం భూమిని కూడా సంస్థానాధీశులు సమర్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని శివాలయానికి కూడా 70 ఎకరాల భూమిని సమర్పించినారు.ఆ విధంగా గ్రామంలో అన్ని వృత్తుల వారు నేటికీ సేవలు చేస్తూనే ఉన్నారు.బ్రాహ్మణులు, శ్రీ వైష్ణవులు అర్చకులు. తంబలి, మంగలి వారు వాయిద్య కారులు. అలాగే పోలీస్ రెడ్డి గారి ఇంటి నుండి పూర్ణ కుంభము తీసుకెళ్ళడం చేస్తారు. కురువ, గొల్ల, కమ్మరి, కుమ్మరి, సాలె, గాండ్ల, హరిజన అన్ని కులాల వారు స్వామి కైంకర్యంలో పునీతులౌతున్నారు. ఇంత మొత్తం ఇనాం భూమి గల దేవస్థానం అలంపూర్ తాలుకాలో మరే గ్రామములోను లేదనేది నిస్సందేహం. అయితే నాటినుండి అనగా దేవాలయం స్థాపించి నప్పటి నుండి ఇప్పటి వరకు నిరాటంకంగా స్వామి వారికి సేవలు జరుగుతూనే ఉన్నాయి.అయితే ఈ ఆలయ సంరక్షణ ప్రతిష్టాపకులైనటువంటి వెంకోబా గారి కుటుంబీకులే చూసుకుంటున్నారు. సుమారు 1840 నుండి1888 వరకు శ్రీ వెంకోబా గారు తరువాత1888నుండి 1935 వరకు శ్రీ రాఘప్ప గారు 1935 నుండి1941 వరకు శ్రీ వెంకోబా గారు1941నుండి1954 వరకు శ్రీ బలరామప్ప గారు అప్పటి నుండి శ్రీ బద్రి నారాయణ రావు గారు దినదినాభివృద్ధికై అలుపెరుగని పోరాటం సాగించారనేది నిర్వివాదాంశం. అయితే ఈ గ్రామము గుండా రైలు మార్గము ఉన్నప్పటికీ ఈగ్రామంలో రైల్వే స్టేషను లేకుండేది అయితే రైల్వేస్టేషన్ కూడా శ్రీ బద్రి నారాయణ రావు గారు ఏర్పాటు చేయించారు. శ్రీ బ్రహ్మయ్యాచార్యులు, పోలీసు పటేల్ చిన్న సల్వారెడ్డి గారు అయిదు సెంట్ల స్థలం దానమివ్వగా అక్కడ శ్రీ నిర్భయానంద స్వామి ఆశ్రమం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ విచారకరమైనదేమిటంటే ఆ యాదవ భక్తుని పేరు తెలియరాలేదు. అయితే ఆ స్వామి ప్రతిష్ఠకు మూల పురుషుడు యాదవ భక్తుడు అన్నది గ్రామస్థులకందరకు తెలుసన్నది జగద్వితము. 2022 సంవత్సరంలో దేవాదాయశాఖ శాఖ వారు, గ్రామస్థులు 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేయగా, 36 వేల రూపాయలు దేవాదాయశాఖ వారు సర్వశ్రేయోనిధినుండి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుతో చుట్టూ ఉన్న కాంపౌండ్ మరమ్మత్తు చేయించి దానికానుకొని లోపల భాగాన సత్రాలు వినూత్నమైన రీతిలో నిర్మించి ధ్వజస్తంభం నూతనంగా తయారు చేసి ఎంతో వైభవంగా నిర్వహించారు. గ్రామంలో అన్ని కులాల వారు ప్రముఖంగా రెడ్ల కుటుంబాలు ధర్మకర్తలైనటువంటి జయసింహయ్య కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ దేవాలయాన్ని దినదినాభివృద్ధిగా తీర్చిదిద్దుతున్నారు. స్వామి వారి సేవా విశేషాలు ప్రతిరోజూ ఉదయం బిందెసేవ సాయంత్రం దివిటీ సేవ క్రమం తప్పకుండా జరగడం ఒక విశేషం. ప్రతి సంవత్సరం పుష్య శుద్ధ దశమి రోజున జాతర జరుగుతుంది ఆరోజు రథోత్సవం మొదలు కొని ఐదు ప్రధాన వరకు పాంచరాత్రాగమ సాంప్రదాయ పద్ధతిలో సేవలు జరగడం ఒక నియమం. అదేవిధంగా గ్రామంలో ఇంతకు ముందు యాదవ భక్తుని ఇల్లు ఉండేదట.స్వామి వారు అక్కడకు తీసుకు వెళ్ళమని కోరగా అక్కడ దశమి కట్ట కట్టించి స్వామి వారిని పల్లకిలో ఊరేగించి అక్కడ దించి పూజచేసి తిరిగి దేవాలయానికి తీసుకు రావడం ఇప్పటి వరకు అదే ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ప్రతి నెల శ్రవణా నక్షత్రం రోజున స్వామి కల్యాణం ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంకొక విశేషమేమంటే వేంకటేశ్వర స్వామి దేవాలయం అయినప్పటికీ యాదవ భక్తుని వల్ల ప్రతిష్ఠ జరిగినందుకు గోకులాష్టమి రోజున ఉట్లు కొట్టే జాతర కూడా జరుగుతుంది. అయితే ఆ భక్తునికి స్వామి వారు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అని అడుగగా ఆ యాదవ భక్తుడు నాకేమి వద్దు నీవు నాయింటికి వస్తే చాలు అన్నాడని అందుకు స్వామి కోపోద్రిక్తుడై నీ వంశం విఫలమౌగాక అని అన్నాడని అందుకు భయపడి వారి వంశస్థులు ఊరు వదిలి కర్నూలు జిల్లా లోనిపోలుకల్లు గ్రామము కొందరు, పెద్ద నాగటూరు గ్రామము కొందరు వలస పోయారని వారి వంశస్థులు తెలిపిన విషయం. ఇకపోతే ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ రెండు గ్రామాల నుండి వారు ఇక్కడికి వచ్చి పుట్టు వెంట్రుకలను తీయించడం జాతరకు రావడం పశువులు ఈనిన నెయ్యిని తెచ్చి స్వామి వారికి సమర్పించిన తరువాతనే వారు తినడం ఆనవాయితీగా వస్తున్నదని పెళ్ళిళ్ళు చేసినా కొత్త జంట ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు[5].

శ్రీవేంకటేశ్వరస్వామిపై ఊర ఈశ్వర్ రెడ్డి పద్యాలు

[మార్చు]

1.

 శ్రీనివాస భక్త!శ్రితజనపరిపాల
ఆదిదేవనీకు!పాదసేవ
మదినిసల్పుదెపుడు!మరువకనేవేళ
వేగబ్రోవరావె! వేంకటేశ!

2.

 నీదుమహిమదెల్ప!నిఖిలలోకంబుల
సజ్జనులుగమార్చ!సన్నుతాంగ
కోరివెలసితీవు!కొంగుబంగారమై
పెద్దదిన్నెలోన!ప్రేమతోడ!

3.

 గొంతుతెరచినిన్ను!గోవిందయనిపిల్వ
కూడిబాధలెల్ల!గూల్చినావు
నీదుమహిమనెన్న!నేనెంతవాడను
నిఖిలలోకరక్ష!నీరజాక్ష!

4.

 వేలవందనములు!విశ్వంభరానీకు
సాధుజననృపాల!సన్నుతింతు
దీనబంధుయింక!దిక్కెవ్వరికమాకు
జాగుచేయనేల!వేగరమ్ము!

5.సీ,మా.

 కరుణాలవాలనీ!కరుణజూపవదేమి కానివాడననీకు!కమలనయన
అరవింద లోచనా!ఆశ్రితపరపాల యింతైనదయరాద!ఏలనీకు
సాగరంబనెడుయీ!సంసారచక్రంబు దాటించరాగదే!దనుజవైరి
కష్టాలు కడతేర్చు!కల్పవృక్షమనీవు దీవించి నాబాధ!దీర్చవేమి


దీనబాంధవనాకు!దిక్కునీవేయంటి!
వేగబ్రోవగరావె!వేంకటేశ
ఎన్నికష్టములైన!యిష్టంబుగానిన్ను
భక్తితోపూజించు!శక్తి నిమ్ము

నీపాదపద్మముల్!నిరతంబుసేవించు భాగ్యమ్మునొసగుమా!భవ్యచరిత
కలనైననీరూపు!కనులజూతమటన్న కనిపించరావునా!కర్మయేమొ
కోరనునినునేను!కోట్లధనమ్మును వరమివ్వుచేయనీ!పాదసేవ
పలుమార్లునినునేను!ప్రార్థించిననుగాని పలుకవేనామీద!పంతమేమొ

అఙ్ఞానినైనేను!యంధకారమునున్న
దిక్కుజూపగనాకు!దివ్వెనీవె
ఎన్నిజన్మలకైన!నిన్నువీడనునేను
దిక్కునేవేయంటి!దీనబంధు!

తే,గీ

 భక్తజనపోష ఆశ్రిత పక్షపోష
విశ్వ కల్యాణ గిరిధరా వేంకటేశ
పరమ కారుణ్య జగదీశ పాపనాశ
పుడమి పెద్దదిన్నేగ్రామ! పురనివాస

[6]!


మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013
  5. పెద్ద దిన్నె శ్రీ వేంకటేశ్వర స్వామి చరిత్ర, రచయిత: ఊర ఈశ్వర్ రెడ్డి, శంకరాభరణం ప్రచురణలు,2024
  6. పెద్ద దిన్నె శ్రీ వేంకటేశ్వర స్వామి చరిత్ర, రచయిత: ఊర ఈశ్వర్ రెడ్డి, శంకరాభరణం ప్రచురణలు,2024

వెలుపలి లింకులు

[మార్చు]