పోస్టుకార్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత తంతితపాలా వారి పోస్టుకార్డు, చిరునామా విభాగాన్ని కూడా చూడవచ్చు

పోస్టుకార్డు, అనునది ఇతరులకు సమాచారం చేరవేసే ఒక రకమైన సాధనం లాంటి ఉత్తరం.

పోస్టుకార్డు వినియోగం[మార్చు]

ఇది దీర్ఘచతురస్రాకారములో మందపాటి అట్టతో చేయబడి ఉంటుంది. దీనిని ఉత్తర ప్రత్ర్యుత్తరంగా ఉపయోగిస్తారు. దీనిపై సమాచారం వ్రాసి, చిరునామ రాసి తపాలా పెట్టెలో వేస్తే అది ఆ చిరునామాకు చేరుతుంది.గతంలో సమాచార మార్పిడికి, క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే (ఉత్తరము) ప్రధాన ఆధారము . పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు . కాలగమనంలో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి . ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడకోసం పొరాడుతోంది . సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయినది . ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి . కొన్ని ప్రదే్శములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు.

సుమారు పదిహేనేళ్ళ కిందట వరకు పొస్టుకార్డుకు జనజీవనముతో విడదీయలేని సంబంధము ఉండేది . పొట్టకూటికి వలస వెళ్ళిన కొడుకు క్షేమ సమాచారము కోసం తల్లి, భర్త కోసము భార్య, కుటుంబసభ్యులు అక్కడనుండి ఉత్తరం ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూసేవారు . బంధువుల మధ్య క్షేమసమాచారము ఉత్తరం ద్వారానే తెలుపునేవారు . పర్స్తుతం ఆ పరిస్థితి కనుమరుగైనది . కొన్ని వ్యాపార సంస్థలు మాత్రము వ్యాపార లావదేవీలు, బకాయిల చెల్లింపుల సమాచారము తెలుపుకుంటున్నారు .

భారతదేశంలో పోస్టుకార్డు[మార్చు]

మనదేశంలో 1879 జూలై 1 న పోస్టుకార్డును ప్రవేశపెట్టారు. దాదాపు శతాబ్దంపాటు దీనికి ప్రత్యుమ్నాయం లేకుండా పోవడంతో ప్రజలు దీనిని ప్రధాన సమాచార వారధిగా ఉపయోగించారు. ప్రజలు తమ క్షేమ సమాచారాలను పోస్టుకార్డు ద్వారానే చెప్పుకునేవారు. దీని వెలకూడా అతి తక్కువగా ఉండి అందరికీ అందుబాటులో ఉండేది. దీనిపై వ్రాసిన సమాచారాన్ని కప్పిపెట్టే అవకాశం లేకపోవడంతో అది అందరికీ కనిపిస్తూ ఉండేది. పల్లెలలో నిరక్షరాస్యులు పోస్టుమ్యాన్ ద్వారా కార్డులను చదివించుకునేవారు. చదివిన తర్వాత కూడా దీనిని అపురూపంగా దాచుకుని మరలా మరలా చదువుకునేవారు .చరవాణి రాకవలన ఈరోజు దీని వాడకం పడిపోయి దాదాపు అవసానదశకు చేరుకుంది.

చరిత్ర[మార్చు]

అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో 1861 లో తొలిసారిగా పోస్టుకార్డును ప్రవేశపెట్టేరు . తరువాత మిగిలిన దేసాల్లో వాడుకలోనికి వచ్చినది . మన దేశములో 1879 జూలై ఒకటిన (01/07/1879) ప్రవేశపెట్టి వినియోగం లోనికి వచ్చినది .

ధరలు[మార్చు]

ప్రస్తుతం పొస్టుకార్డు ధర 50 పైసలు . ప్రభుత్వ, వ్యాపార సంస్థల ప్రకటనలతో ఉన్న మేఘదూత్ కార్డు వెల 25 పైసలు . ఆయా సంస్థలు తపాల శాఖకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే చిరునామా ప్రక్కన ప్రకటనలు ముద్రించి వినియోగదారులకు 25 పైసలకే అమ్ముతారు . స్వాతంత్ర్యం రాకముందు మనదేశములో కాని, అర్ధ అణా, అణా, మూడు పైసలు, ఐదు పైసలు, పది పైసలు, 15 పైసలు, 25 పైసలు ధరలు ఉండేవి . వివిధ చానళ్ళు నిర్వహించే పలు పోటీలకు సంబంధించిన సమాచారము పంపించేందుకు ఉపయోగించే పోస్టుకార్దు ధర మాత్రము 10 రూపాయిలు ఉన్నది . తొలుత ఈ కార్డు 2 రూపాయిలు ఉండేది . ఎస్.ఎం.ఎస్ లు రావదంతో ఈ కార్డులు మూలన పడ్డాయి .

తయారీ ఖర్చు[మార్చు]

కార్డు తయారీకి ప్రభుత్వానికి రూ.1.33 ఖర్చు అవుతుంది . ప్రజా సంక్షేమముకోసం ఈ ధరను తగ్గించి నస్టాలను భరించి అమ్ముతుంది .

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]