ప్రజానాట్యమండలి

వికీపీడియా నుండి
(ప్రజానాట్య మండలి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

[[దస్త్రం:Garikapati Rajarao.JPG|alt=Dr.Garikapati Rajarao, Praja Natya Mandali |thumb|ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు డా ! [రాజారావు] సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితంలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో ప్రజానాట్యమండలి స్ధాపించబడింది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పిటికీ వీధి నాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది. 1943లో స్థాపించబడింది

70 ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన ప్రజా సాంస్కృతికోద్యమ సంస్థగా, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇండియన్ పీపుల్స్ థియేటర్ ( ఇష్టా) కు వారసురాలిగా ఏర్పడిన ప్రజానాట్యమండలి కళ కళ కోసం కాదు, కళ ప్రజలకోసం అని నినదించి తెలుగునాట ప్రజా సాంస్కృతికోద్యమ సారధిగా ప్రజానాట్యమండలి పనిచేస్తోంది. ప్రజా ఉద్యమాల పట్ల అంకితభావంతో తన కలాన్ని, గళాన్ని అంకితమిస్తూ ఉద్యమిస్తోంది. తెలుగునేలపై సాక్షరతా ఉద్యమ పిలుపునందుకుని అక్షర కళాయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. తెలుగు భాషా, సాంస్కృతికోద్యమానికి బాసటగా నిలిచి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పేరుతో కళారూపాలను ప్రదర్శించింది. సారా వ్యతిరేక ఉద్యమం, మద్యంపై యుద్ధం పేరుతో వేలాది కళా ప్రదర్శనలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసింది. శ్రీశ్రీ, గురజాడ, వేమన, కందుకూరి, జాషువా, వీరబ్రహ్మం వంటి సంఘ సంస్కర్తల భావజాలాన్ని, వారి రచనల సందేశాన్ని కళారూపాలుగా మలచి పల్లెల్లో, పట్టణాల్లో వాడవాడలా విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది. జిల్లాలో అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్రను వీధినాటికగా మలచి వందలాది ప్రదర్శనలిచ్చింది ప్రజానాట్యమండలి. దళిత, ఆదివాసుల హక్కుల రక్షణ కోసం, ఎసిసి,ఎస్.టి సబ్ ప్లాన్ చట్టం ప్రచార జాతాలు వందలాది మంది కళాకారులతో జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది.


2022 మే 28,29,30 వ తేదీలలో కృష్ణా జిల్లాలోని పెనమలూరు లో ప్రజానాట్యమండలి రాష్ట్ర 10 వ మహాసభలు జరిగాయి.ఈ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు గా పి. మంగరాజు, ఎస్.అనిల్ కుమార్ లు ఎన్నికయ్యారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు గా sk. ఖాసిం, ఈ.నాగరాజు లు సహాయ కార్యదర్శులుగా ఐ.వి, సుభాషిణి,గుర్రం రమణ లు ఎన్నికయ్యారు.45 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికయ్యింది.

సంస్ధాపకులు[మార్చు]

ప్రజానాట్యమండలి స్దాపకులలో ప్రముఖులు డా. గరికపాటి రాజారావు గారు.[1] ఆయన 1915 ఫిబ్రవరి 5న కోటయ్య, రామలింగమ్మలకు రాజమండ్రిలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్. వామపక్ష భావజాలానికి చదువుకునే రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. ఆయన నటుడు, ప్రయోక్త, రచయిత. ఆయన ప్రజానాట్యమండలికి నిర్వహాకులుగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సుంకర వాసు రెడ్డి గారు రచించిన "మా భూమి" నాటకానికి దర్శకత్వం వహించి అందరి మన్ననలు పొందారు. 108 దళాలుగా ఏర్పర్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈయన రూపొందించిన నాటకాలలో కొన్ని - జై భవాని, పశ్చాతాపం, ఖిల్జీ రాజ్యపతనం, ముందడుగు, భయం, పరివర్తన, ఈనాడు, అల్లూరి సీతారామరాజు మున్నగున్నవి.
పరితాపం, వీరనారి, పశ్చాతాపం మున్నగు నాటకాలు రచించారు.
1953 లో నిర్మితమైన పుట్టిల్లు చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున, అల్లు రామలింగయ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు. దానితో రాజారావు ఆర్థికంగా చితికి పోయారు. ఐనా, వారు సంఘ సేవ ఆపలేదు. బీద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసే వారు. తరువాతి కాలంలో వారు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.

మహోన్నత వేదిక[మార్చు]

ప్రజా నాట్య మండలి ద్వారా ప్రాచుర్యం పొందిన వారు ఎందరో. ముందు తరం నటులు, సాంకేతిక నిపుణులు ప్రజానాట్యమండలి నుండి వచ్చిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరు - జమున (నటి) ,జి.వరలక్ష్మి, కోవెలమూడి ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, బొల్లిముంత శివరామకృష్ణ, కాకరాల మున్నగు వారు.
బుర్రకథ పితామహ షేక్ నాజర్, వారి బృందంలో కర్నాటి లక్ష్మీనరసయ్య ప్రజానాట్యమండలికి చెందిన వారే.

వనరులు[మార్చు]