కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62: పంక్తి 62:


== పురస్కారాలు ==
== పురస్కారాలు ==

# 1974 తెనాలి శారదా కళా పీఠంలో అంతర్జాతీయ మహిళా సంవర్గములో వివిధ సాహితీ సంస్థల చే “రమ్య కధా కవయిత్రి” “అభ్యుదయ నవలా రచయిత్రి “బిరుదులు ప్రధానం
# 1975 లో మహా కవి శ్రీ శ్రీ తో అంతర్జాతీయ రచయితల సదస్సుకు ఆహ్వానం అందుకున్నారు
# 1983 లో తానా వారిచే అమెరికాకు ఆహ్వానం. వాషింగ్టన్ లో మస్కులర్ డిస్త్రోఫీ అన్న అంశము పై వైద్య పరముగా పేపర్ సమర్పించటం. సాహితీ పరముగా న్యూ జెర్సీ లో
అభిమానుల సమాగమం, సత్కారం
# 1983 లో సాహితీ జీవిత రజోతోత్సవ సందర్బముగా హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుచే ఘనసత్కారం
# 1983 లో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆచార్యుల చేతుల మీదుగా పూర్వ విద్యార్దినిగా ప్రతిభా పురస్కార ప్రధానం
# 1983 లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ద్వారా కాలేజ్ ఆఫ్ జనెరల్ ప్రాక్టిషనర్ గా ఎంపిక
# 1983 లో రాయల్ సొసైటీ ఆఫ్ హెల్త్ (లండన్) వీరి ద్వారా ఫెలోషిప్ స్వీకారం
# 1989 లో శ్రీనాధ పీఠం గుంటూరు వారి ఆహ్వానం పండితోత్తములతో సత్కారం
# 1992 లో ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారిచే అంతర్జాతీయ తెలుగు రచయితల సంస్థల తరపున రవీంద్రభారతి హైదరాబాద్ లో సన్మానం
# 1992 లో వైద్యరంగ పరముగా ఉమన్ ఆఫ్ దిఇయర్ ప్రతిష్టాత్మక అవార్డు హరిహర కళాభవన్ లో ప్రదానం
# 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
# 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
# 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
# 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం

18:08, 11 జూన్ 2018 నాటి కూర్పు

డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి
సత్య సాయి బాబా తో కె.వి.కృష్ణకుమారి
జననంకృష్ణ కుమారి
India తెనాలి, గుంటూరు
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుకృష్ణక్క
వృత్తిడాక్టర్
రచయిత్రి
మతంహిందూ
తండ్రిడాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు
తల్లిసత్యవతి

కె. వి. కృష్ణకుమారి తెలుగు రచయిత్రి, సాహితీవేత్త, గైనకాలజిస్టు.[1] ఆమె కృష్ణక్క గా సుప్రసిద్ధురాలు. ఆమె తన తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవలని ఎంతో మందికి అందిస్తున్నది.

జీవిత విశేషాలు

ఆమె తెనాలి లో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. ఆమె ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె 'రమ్యకథా కవయిత్రి' గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది.

మానసిక స్థైర్యం కోల్పో యిన వారికి కృష్ణక్క సలహాలు, సూచనలు ఎందరికో మార్గదర్శనమయ్యాయి.[2]

రచనా వ్యాసాంగం

కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో యద్దనపూడి సులోచనారాణి తో కలసి పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.[3] దాదాపు నలభై సంవత్సరాల పాటుగా వివిధ ప్రముఖ పత్రికలలో, ‘కృష్ణక్క సలహాలు’ శీర్షికను నిర్వహిస్తూ కృష్ణక్కగా లక్షలాది మంది హృదయాలలో స్దిరస్థానం సొంతం చేసుకున్నదామె.

సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంధాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావుకు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే పుట్టపర్తి సాయిబాబా మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.[4]

ఇప్పటిదాకా వైద్యరంగం, ఆధ్యాత్మిక పరంగా, ఆదేశాత్మకంగా 60కి పైగా నవలలు వ్రాసింది. “సహిత జావిత వజ్రోత్సవ” వేడుకలను అభిమానులు జరుపుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా కృష్ణక్క త్యాగ నిరతికి మెచ్చి “ఓంకార” పతకమున్నసువర్ణమాలను స్వయంగా మెడలో అలంకరించారు. అతని ఆదేశాలనుసారం అద్వైతామృత వర్షిణి, ‘భద్రాకళ్యాణం’ ప్రబంధ గ్రంధం వ్రాసింది.

రాజకీయ నేపథ్యం

ఆమెకు దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు, మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి రక్త సంభంధీకులైన దగ్గర బంధువులు. మెడిసిన్ లో, కుటుంబపరంగా, కొండా వెంకటప్పయ్య గారి మెరిట్, స్కాలర్షిప్ ను అందుకున్నది. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కృష్ణకుమారి కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి అభిమాన పుత్రికగా మరియు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటి ఆడపడుచుగా సుప్రసిద్దురాలు.

రచనలు

  • కర్మయోగి [5]
  • భద్రాకళ్యాణం [6]
  • మనిషి లో మనీషి డాక్టర్ అక్కినేని[7]
  • మంచుపూలు
  • శ్రీ కృష్ణామృతం
  • సశేషం[8]

పురస్కారాలు

  1. 1974 తెనాలి శారదా కళా పీఠంలో అంతర్జాతీయ మహిళా సంవర్గములో వివిధ సాహితీ సంస్థల చే “రమ్య కధా కవయిత్రి” “అభ్యుదయ నవలా రచయిత్రి “బిరుదులు ప్రధానం
  2. 1975 లో మహా కవి శ్రీ శ్రీ తో అంతర్జాతీయ రచయితల సదస్సుకు ఆహ్వానం అందుకున్నారు
  3. 1983 లో తానా వారిచే అమెరికాకు ఆహ్వానం. వాషింగ్టన్ లో మస్కులర్ డిస్త్రోఫీ అన్న అంశము పై వైద్య పరముగా పేపర్ సమర్పించటం. సాహితీ పరముగా న్యూ జెర్సీ లో
 అభిమానుల సమాగమం, సత్కారం 
  1. 1983 లో సాహితీ జీవిత రజోతోత్సవ సందర్బముగా హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుచే ఘనసత్కారం
  2. 1983 లో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆచార్యుల చేతుల మీదుగా పూర్వ విద్యార్దినిగా ప్రతిభా పురస్కార ప్రధానం
  3. 1983 లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ద్వారా కాలేజ్ ఆఫ్ జనెరల్ ప్రాక్టిషనర్ గా ఎంపిక
  4. 1983 లో రాయల్ సొసైటీ ఆఫ్ హెల్త్ (లండన్) వీరి ద్వారా ఫెలోషిప్ స్వీకారం
  5. 1989 లో శ్రీనాధ పీఠం గుంటూరు వారి ఆహ్వానం పండితోత్తములతో సత్కారం
  6. 1992 లో ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారిచే అంతర్జాతీయ తెలుగు రచయితల సంస్థల తరపున రవీంద్రభారతి హైదరాబాద్ లో సన్మానం
  7. 1992 లో వైద్యరంగ పరముగా ఉమన్ ఆఫ్ దిఇయర్ ప్రతిష్టాత్మక అవార్డు హరిహర కళాభవన్ లో ప్రదానం
  8. 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
  9. 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
  10. 1993 లో సాహితీ వైద్య శిరోమణి పురస్కారం
  11. 1994 లో మహాత్మా గాంధీ జాతీయ పురస్కారం
  12. 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం
  13. 1997 లొ భరతముని పురస్కారం
  14. 2005లో శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు పురస్కారం
  15. 2005లో అక్కినేని అవార్డు పురస్కారం
  16. 2007 శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం శ్రీ విజయ దుర్గా పీటము వారి నుండి
  17. విశిష్ట రచయిత్రిగా సర్వధారి పురస్కారం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి చేతులమీదుగా
  18. 2013లో సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
  19. డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
  20. 2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.[9]

వనరులు

మూలాలు

  1. "Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com". healcon.com. Retrieved 2018-06-10.
  2. "సేవే లక్ష్యంగా కృష్ణక్క సాహితీ సేద్యం, వైద్యం".
  3. "ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం".
  4. "సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-06. Retrieved 2018-06-10.
  5. "Karmayogi,K V Krishna Kumari - online Telugu Books". www.logili.com. Retrieved 2018-06-10.
  6. Prof. V. Viswanadham, Bhadra Kalyanam by Dr. K. V. Krishna Kumari - reading by Prof. V. Viswanadham Part-1, retrieved 2018-06-10
  7. "Manishilo Maneeshi Doctor Akkineni - మనిషిలో మనీషి డాక్టర్‌ అక్కినేని".
  8. "Sasesham - సశేషం".
  9. ""కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-22. Retrieved 2018-06-10.

బయటి లింకులు