సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 42: | పంక్తి 42: | ||
== రంగస్థల ప్రస్థానం == |
== రంగస్థల ప్రస్థానం == |
||
8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటకంలో [[శ్రీకృష్ణుడు]] పాత్ర పోషించింది. [[షణ్ముఖి ఆంజనేయ రాజు]]తో |
8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటకంలో [[శ్రీకృష్ణుడు]] పాత్ర పోషించింది. [[షణ్ముఖి ఆంజనేయ రాజు]]తో [[సత్యభామ]]గా, [[పీసపాటి నరసింహమూర్తి]]తో [[రాధ]]గా, [[వేమూరి రామయ్య]]తో సుధేష్ణగా నటించడంతోపాటు [[బాలనాగమ్మ]], గుణసుందరి, [[ఝాన్సీ లక్ష్మీబాయి]], రాణీ మాలినీదేవి, చంద్రమతి, [[ద్రౌపది]], సక్కుబాయి వంటి పాత్రలు పోషించింది. |
||
== బహుమతులు - పురస్కారాలు == |
== బహుమతులు - పురస్కారాలు == |
14:49, 22 జనవరి 2020 నాటి కూర్పు
జమునా రాయలు | |
---|---|
దస్త్రం:Jamuna Rayalu.jpg | |
జననం | జమునా రాయలు జనవరి 22, 1960 |
ఇతర పేర్లు | నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల |
వృత్తి | సురభి నాటక సమాజం |
ప్రసిద్ధి | రంగస్థల కళాకారిణి,బుర్రకథ, హరికథ కళాకారిణి |
భార్య / భర్త | సురభి రాయలు |
తండ్రి | వనారస కొండలరావు |
తల్లి | వసుంధరాదేవి |
జమునా రాయలు రంగస్థల నటి, బుర్రకథ హరికథ కళాకారిణి. నాలుగు దశాబ్దాలకుపైగా రంగస్థల అనుభవం ఉన్న ఈమె సురభి నాటక సమాజం ప్రదర్శించిన అనేక నాటకాల్లో నటించింది.[1]
జననం
జమునా రాయలు 1960, జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించింది. తన మేనమామ సురభి రాయలునే వివాహం చేసుకుంది.
రంగస్థల ప్రస్థానం
8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా చింతామణి నాటకంలో శ్రీకృష్ణుడు పాత్ర పోషించింది. షణ్ముఖి ఆంజనేయ రాజుతో సత్యభామగా, పీసపాటి నరసింహమూర్తితో రాధగా, వేమూరి రామయ్యతో సుధేష్ణగా నటించడంతోపాటు బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి, ద్రౌపది, సక్కుబాయి వంటి పాత్రలు పోషించింది.
బహుమతులు - పురస్కారాలు
సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు. వీరి దర్శకత్వంలో వచ్చిన శశిరేఖాపరిణయం నంది పురస్కారమే
నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పొందారు.
మూలాలు
- ↑ జమునా రాయలు, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 42.