ముస్లిం లీగ్: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:All-India Muslim League |
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: id:Liga Muslim India |
||
పంక్తి 60: | పంక్తి 60: | ||
[[fr:Ligue musulmane]] |
[[fr:Ligue musulmane]] |
||
[[he:הליגה המוסלמית]] |
[[he:הליגה המוסלמית]] |
||
[[id:Liga Muslim India]] |
|||
[[it:Lega musulmana]] |
[[it:Lega musulmana]] |
||
[[ja:全インド・ムスリム連盟]] |
[[ja:全インド・ムスリム連盟]] |
00:42, 13 మే 2010 నాటి కూర్పు
'అఖిల భారత ముస్లిం లీగ్' | |
---|---|
Leader | నవాబ్ వికారుల్ ముల్క్ (మొదటి గౌరవ అధ్యక్షుడు) |
Founded | డిసెంబరు 30 1906, ఢాకా |
Headquarters | లక్నో (ప్రధాన కేంద్రము) |
Official ideology/ political position |
ముస్లింల కొరకు రాజకీయ హక్కులు |
ముస్లిం లీగ్ (బెంగాలీ : অল ইন্ডীয়া মুসলিম লিগ ఉర్దూ: آل انڈیا مسلم لیگ), ఢాకాలో 1906 లో స్థాపించబడినది. బ్రిటిష్ ఇండియా కాలము నాటి రాజకీయ పార్టీ. భారత ఉపఖండంలో ముస్లింల కొరకు ప్రత్యేక దేశం పాకిస్తాన్ ఆవిర్భావానికి పాటుపడింది. [1] భారత్ కు స్వాతంత్రం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో భారతీయ సమైక్య ముస్లిం లీగ్ అనే పేరుతో కేరళ మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయినది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రధమ రాజకీయ పార్టీగా అవతరించినది. బంగ్లాదేశ్ లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.
చరిత్ర
ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడినది. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించినది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా బలూచిస్తాన్, తూర్పు బెంగాల్, కాశ్మీరు లోయ, వాయువ్య సరిహద్దులు, పంజాబ్ ప్రాంతం మరియు సింధ్ ప్రాంతాలు మరియు బాంబే ప్రెసిడెన్సీ లలో వుండేది.
స్థాపన
దీని స్థాపన 1906 డిసెంబరు 30 న అఖిల భారత ముహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ షాహ్బాగ్ సమావేశంలో జరిగినది. ఢాకాలో జరిగిన ఈ సదస్సులో నవాబ్ సర్ ఖ్వాజా సలీముల్లా పాల్గొన్నాడు. ఈ సదస్సులో మూడువేల మంది హాజరయ్యారు, సదస్సుకు నవాబ్ వికారుల్ ముల్క్ అధ్యక్షత వహించాడు. [2]
ఆరంభ సంవత్సరాలు
సర్ ఆగా ఖాన్ ముస్లింలీగ్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం లక్నో గా ఏర్పడింది. ఇందులో ఆరు ఉపాధ్యక్షులు, ఒక సచివుడు మరియు రెండు ఉప-సచివులు ప్రారంభ మూడు సంవత్సరాలకు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రతినిధులు వేరు వేరు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.[3]
పాకిస్తాన్ కొరకు ఉద్యమం
1940 లో జరిగిన లాహోర్ సమావేశంలో జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు చెందినవారు, వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విశదమయ్యే విషయమేమంటే, వీరిరువురూ వేర్వేరు చారిత్రక వనరులద్వారా ప్రేరేపితమౌతారు. వీరి గ్రంధాలు వేర్వేరు, వర్ణనలు వేర్వేరు, ఇలాంటి సమయంలో వీరిరువురూ ఒకే రాజ్యంలో (దేశంలో) ఇమడలేకపోతారు, కావున వీరిరువురికీ ప్రత్యేకమైన రాజ్యాలుండడం శ్రేయస్కరం.
మూలాలు
- ↑ Jalal, Ayesha (1994) The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. ISBN 978-0521458504
- ↑ The Statesman: The All India Muslim League, en:Government of Pakistan website. Retrieved on 11 May 2007
- ↑ Establishment of All India Muslim League, Story of Pakistan website. Retrieved on 11 May, 2007
ఇవీ చూడండి
- డైరెక్ట్ ఆక్షన్ డే
- భారత స్వాతంత్ర ఉద్యమం
- భారతీయ ముస్లింల జాతీయతా భావాలు
- భారత జాతీయ భావాలు
- భారత జాతీయ కాంగ్రెస్
- ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
- పాకిస్తాన్ ఉద్యమం