జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్

వికీపీడియా నుండి
14:30, 6 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search
జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్
స్థానం
పటం
సమాచారం
రకంప్రభుత్వ
Mottoప్రజ్ఞానః బ్రహ్మ
స్థాపన1987
ప్రిన్సిపాల్ఏం.వెంకటరమణ
తరగతులు6 నుండి 12వ తరగతి
విద్యార్ధుల సంఖ్య464
Campus size25-acre (100,000 m2)
Campus typeగ్రామీణ
పరీక్షల బోర్డుసిబిఎస్‌ఈ
Websiteఅధికారిక జాలస్థలి

జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్(ఆంగ్లం:Jawahar Navodaya Vidyalaya, Hindi: जवाहर नवोदया विद्यलया) ఒక కేంద్ర ప్రభుత్వ పాఠశాల. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోసం స్థాపించబడింది. ఈ పాఠశాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యాశాఖ నిర్వహిస్తుంది. భారతదేశంలో మొత్తం 661 నవోదయ విద్యాలయాలున్నాయి, వీటన్నింటిని నవోదయ విద్యాలయ సమితి నిర్వహిస్తోంది.

సంక్షిప్తంగా దీన్ని జేఎన్వీ నిజాంసాగర్ అని పిలుస్తారు.[1][2]

చరిత్ర

1986లో నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఈ నవోదయ విద్యాలయాలు చేయబడ్డాయి. వాటిల్లో ఒకటి ఈ జేఎన్వీ నిజాంసాగర్.

ప్రవేశ విధానం

ప్రతి సంవత్సరం 6వ తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుంటారు. ప్రతి సంవత్సరం సుమారు 10000 నుండి 20000 దరఖాస్తులు వస్తాయి, జేఎన్వీఎస్టి(JNVST) ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక విధానం కొనసాగుతుంది. తరగతులు 9 ఇంకా 11 లో కూడా పాఠశాలలో ఉన్న ఖాళీలను బట్టి దరఖాస్తుల ద్వారా ప్రవేశం ఉంటుంది.

విద్య, వసతి

ఈ పాఠశాలలో 6 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు చదువు చెప్తారు. అన్ని తరగతుల వారికి సి.బి.యస్.ఈ సిలబస్ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉంటుంది.ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో పాఠశాల భవనం, విద్యార్థులకు ఇంకా ఉపాధ్యాయులకు వసతి గృహములు ఉన్నాయి. ఆడుకోవడానికి విశాలమైన మైదానం ఉంది.

ఇవి కూడా చూడండి

జవహర్ నవోదయ విద్యాలయం

మూలాలు

  1. "home". www.navodaya.gov.in. Retrieved 2021-07-06.
  2. "Wayback Machine". web.archive.org. 2013-03-30. Retrieved 2021-07-06.