ప్రాచీనాంధ్ర గాథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల రామచంద్ర

ప్రాచీనాంధ్ర గాథలు ప్రముఖ రచయిత, పండితుడు తిరుమల రామచంద్ర గారు గాథాసప్తశతిలోని కొన్ని గాథలు తీసుకుని అల్లిన కథలు. రెండువేల యేళ్లనాటి ఆంధ్రుల ఆచార వ్యవహారాలు, తిండితిప్పలు, కష్టసుఖాలు ఈ కథల్లో ప్రతిబింబిస్తాయి.

రచన నేపథ్యం[మార్చు]

ఆంధ్రశాతవాహన కాలం నాటి ప్రాకృత సాహిత్యం నుంచి విశ్వసాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించున్న రెండు గ్రంథాల్లో గాథాసప్తశతి ఒకటి. సా.శ. 25-30 మధ్య శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన కవి వత్సలుడు హాలుడు ఈ గ్రంథాన్ని సంతరించాడు. ఆనాడు ప్రచారంలో ఉన్న కోటి గాథల నుంచి ఏర్చి కూర్చిన గ్రంథం "గాథాసప్తశతి". 300వందల మంది రచయితలు, రచయిత్రులు ఈ కథలను రచించారంటే ఆనాటి ప్రాకృత సాహితీ వైభవం తెలుస్తుంది. అపురూపమైన ఈ కావ్యాన్ని శ్రీనాథుడు తెనుగు చేయడంతోపాటు, ప్రోలయ వేమారెడ్డి తదితరులు ఈ గ్రంథానికి తెలుగులో టీక తాత్పర్యాలు రచించారు. సంస్కృత, ప్రాకృత, తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్లాది బహుభాషల్లో పండితుడు, సృజనాత్మక రచయిత, అనువాదకుడు తిరుమల రామచంద్ర విశిష్టమైన గాథాసప్తశతి గాథలను కథలుగా మలిచారు. ఈ కథలు మొదట పల్లకి పత్రికలో ధారావాహికంగా వెలువడగా తిరుమల రామచంద్ర శతజయంతి సందర్భంగా 2013 జూన్న ఎమెస్కో బుక్స్ ప్రచురణ సంస్థ వారు తిరుమల రామచంద్రకు నివాళిగా ప్రచురించారు.

ఇతివృత్తాలు[మార్చు]

కథనం[మార్చు]

శైలి,ఉదాహరణలు[మార్చు]

ఇతరుల మాటలు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]