బృందావని వుంది (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"బృందావని వుంది"
రచయితవేటూరి సుందరరామ్మూర్తి
సంగీతంకె. చక్రవర్తి
సాహిత్యంవేటూరి సుందరరామ్మూర్తి
ప్రచురణకాంచనగంగ (1984)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

బృందావని వుంది పాట 1984లో విడుదలైన కాంచనగంగ చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామ్మూర్తి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె. చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి. బాలసుబ్రమణ్యం పాడాడు.[1]

పాటలోని సాహిత్యం[మార్చు]

పల్లవి:

బృందావని ఉంది.. యమునా నది ఉంది
మధురాపురి ఉంది… కాళింది ఉంది…
లేని వాడొక్కడే శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన కళ్యాణ మూర్తి….

చరణం 1:

పుట్టగానే పెరిగేటి మాయబంధనాలకన్నా…
పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న…
ఆ కిటుకు తెలిసేరా…
ఆ కిటుకు తెలిసేరా… శ్రీకృష్ణమూర్తి
చెరసాలలో పుట్టె చైతన్యమూర్తి.

పురస్కారాలు[మార్చు]

  1. వేటూరి సుందరరామ్మూర్తి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు - 1984.

మూలాలు[మార్చు]

  1. తెలుగు వన్, ప్రివ్యూ. "వేటూరి జయంతి". www.teluguone.com. Retrieved 22 December 2020.

ఇతర లంకెలు[మార్చు]

  1. పాట వెనుక మాట ప్రోగ్రాం