భగీరథుడు
భగీరధుదు | |
---|---|
సగరుని మనుమడు. | |
![]() Shiva bearing the Descent of the Ganges River, as the goddess Parvati, Bhagiratha, and the bull Nandi look on (circa 1740). | |
Royalty | |
Dynasty/Clan | ఇక్ష్వాకులు |
Predecessor | సగరుడు |
ATMALINGAMభగీరధుడు గంగను భువికి తీసుకు వచ్చిన మహాముని[1] .
జనన విశేషాల[మార్చు]
సూర్యవంశపు రాజైన సగరునకు కేశినీ, సుమతి అను ఇద్దరు భార్యలు. కేశినీ కి అసమంజసుడను కుమారుడు, సుమతి కి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగ అశ్వమును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు దిలీపుడు. అతని కుమారుడు భగీరధుడు.
గంగావతరణం[మార్చు]
భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.
మూలాలు[మార్చు]
- ↑ Mankodi, Kirit (1973) "Gaṅgā Tripathagā"Artibus Asiae 35(1/2): pp. 139-144, p. 140
వనరులు[మార్చు]
- http://moralstories.wordpress.com/2006/05/14/hard-work-can-do-wonders/
- Dictionary of Hindu Lore and Legend (ISBN 0-500-51088-1) by Anna L. Dallapiccola
- The story of Baghiratha in western edition[permanent dead link]